Farmers : రైతు సోదరులారా… మీ ఖాతాల్లోకి నెలకు 3000 రూపాయలు జమ… రైతు పెన్షన్ స్కీమ్ కు అప్లై ఇలా చేసుకోండి… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Farmers : రైతు సోదరులారా… మీ ఖాతాల్లోకి నెలకు 3000 రూపాయలు జమ… రైతు పెన్షన్ స్కీమ్ కు అప్లై ఇలా చేసుకోండి…

Farmers : సన్న చిన్న కారు రైతులను కొన్ని రకాల పథకాలను పెట్టి ఆదుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. సూక్ష్మ రైతులకు వృద్ధాప్య రక్షణ మరియు సామాజిక భద్రతను ఇవ్వడానికి రూపొందించబడింది ఈ స్కీం. పీఎం కిసాన్ మన్ దన్ పథకానికి వయసు అర్హత 18 నుండి 40 సంవత్సరాల వయసు కలవారు ఉండాలి. సంబంధిత రాష్ట్ర యూటీ భూ రికార్డుల ప్రకారం రెండు హెక్టార్ల వరకు సాగు భూమిని కలిగి ఉన్న రైతులు అర్హులు.. పిఎం కిసాన్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :23 April 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Farmers : రైతు సోదరులారా... మీ ఖాతాల్లోకి నెలకు 3000 రూపాయలు జమ... రైతు పెన్షన్ స్కీమ్ కు అప్లై ఇలా చేసుకోండి...

Farmers : సన్న చిన్న కారు రైతులను కొన్ని రకాల పథకాలను పెట్టి ఆదుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. సూక్ష్మ రైతులకు వృద్ధాప్య రక్షణ మరియు సామాజిక భద్రతను ఇవ్వడానికి రూపొందించబడింది ఈ స్కీం. పీఎం కిసాన్ మన్ దన్ పథకానికి వయసు అర్హత 18 నుండి 40 సంవత్సరాల వయసు కలవారు ఉండాలి. సంబంధిత రాష్ట్ర యూటీ భూ రికార్డుల ప్రకారం రెండు హెక్టార్ల వరకు సాగు భూమిని కలిగి ఉన్న రైతులు అర్హులు.. పిఎం కిసాన్ పెన్షన్ యోజనలో ఎంపిక చేయబడిన ప్రతి లబ్ధిదారునికి హామీ పెన్షన్ పొందవచ్చు నెలకి 3000. ఇది భారత ప్రభుత్వం నుండి సరిపోయే విరాళాలతో కూడిన స్వచ్ఛంద మరియు కంట్రిబ్యూటర్ పెన్షన్ పథకం.ఇంకా ఇది దీనిని అప్లై చేసుకుని రైతులు PMKMY తమ రిజిస్ట్రేషన్ పూర్తి చేయడానికి PM కిసాన్ పెన్షన్ పథకం ఆన్లైన్ దరఖాస్తు ఫారం ను పూరించవచ్చు..

ప్రధానమంత్రి కిసాన్ మన్ దన్ యోజన 2024 యొక్క వివరాలు; ప్రధానమంత్రి కిసాన్ మన్ ధన్ యోజన దేశంలోని భూస్వామ చిన్న మరియు సూక్ష్మ రైతులందరికీ సామాజిక భద్రత కల్పించడం ముఖ్య లక్ష్యంగా పెట్టుకుంది. రైతులకు తరచుగా కనీస పొదుపు ఉండదు. లేదా వారి వృద్ధాప్యంలో జీవనోపాధి ఉపాధి లేదు. వృద్ధాప్యానికి చేరుకున్న తర్వాత ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి వారికి ఉపయోగపడుతుంది. ఈ పథకం ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద అర్హులైన చిన్న సూక్ష్మ రైతులకు ఈ స్థిర పెన్షన్ లభిస్తుంది.. ఇది స్వచ్ఛంద మరియు కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించే పెన్షన్ ఫండ్ నుండి పెన్షన్ అందివ్వబడుతుంది.

రైతులకు 55 నుండి 60 ఏళ్ల వరకు పెన్షన్ నెలకు 200 ఆ సమయంలో వారు పెన్షన్ పొందడం మొదలు పెడతారు.కేంద్ర ప్రభుత్వం పెన్షన్ పండ్స్ రైతు సహకారంతో సరిపోతుంది. 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న రైతులు మరియు 40 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న రైతులు ఈ పథకంలో చేరడానికి అర్హులే.. చిన్నవయసు మరియు చిన్న రైతుల జీవిత భాగస్వామిలు కూడా విడివిడిగా పథకంలో చేరవచ్చు.. మరియు ప్రత్యేక పెన్షన్ 3000. వారికి 60 సంవత్సరాల వరకు వచ్చినప్పటికీ ఈ స్కీం నమోదు చేసుకున్న రైతులు ఏ కారణం చేతనైనా నిలిపియాలనుకుంటే ఆపవచ్చు.. పెన్షన్ పండ్స్ వారు విరాళాలు వడ్డీతో వారికి తిరిగి చెల్లించబడతాయి.. జీవిత భాగస్వామి లేకుంటే వడ్డీతో సహా మొత్తం సహకారం నామిని కి చెల్లించబడుతుంది. పదవి విరమణ తర్వాత రైతు మరణిస్తే జీవిత భాగస్వామి భాగస్వామి పెన్షన్ లో 50% పొందుకుంటారు. అంటే కుటుంబ పెన్షన్ గా నెలకు 1500 పొందవచ్చు..పీఎం కిసాన్ స్కీం నుండి ప్రయోజనం పొందుతున్న రైతులు పీఎం కిసాన్ ప్రయోజనం పొందేందుకు ఉపయోగించిన అదే బ్యాంకు ఖాతా నుండి నేరుగా చందా చెల్లించవచ్చు.

Farmers రైతు సోదరులారా మీ ఖాతాల్లోకి నెలకు 3000 రూపాయలు జమ రైతు పెన్షన్ స్కీమ్ కు అప్లై ఇలా చేసుకోండి

Farmers : రైతు సోదరులారా… మీ ఖాతాల్లోకి నెలకు 3000 రూపాయలు జమ… రైతు పెన్షన్ స్కీమ్ కు అప్లై ఇలా చేసుకోండి…

అర్హులైన రైతులు రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ నెంబరు మరియు బ్యాంక్ పాస్ బుక్ లేదా ఖాతా వివరాలతో సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ కి కాల్ చేయవచ్చు.. పీఎం కిసాన్ రాష్ట్ర నోడల్ అధికారుల ద్వారా ప్రత్యామనయ నమోదు పద్ధతులు లేదా ఆన్లైన్ నమోదు కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.. ఈ పథకం కింద నమోదు ఉచితం మరియు రైతులు CSC కేంద్రాలలో రిజిస్ట్రేషన్ కోసం ఎటువంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదు.. పీఎం కిసాన్ మన్ దన్ యోజన 2024 కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానము; *https://maandhan/వద్ద అధికారిక వెబ్సైట్ను సందర్శించండి…*హోం పేజీలో సేవలు విభాగానికి వెళ్లి కొత్త నమోదు లింక్ పై క్లిక్ చేయాలి. డైరెక్ట్ లింకు: https://maandhan.in /login

-లింక్ ని క్లిక్ చేసిన తర్వాత సియా నమోదు లేదా CSC కోసం కొత్త పేజీని అనుసరించండి..
-మీ మొబైల్ నెంబరు మరియు ఓటీపీ లింకు ని ఇచ్చి సెలబ్రేషన్ టాప్ పై క్లిక్ చేయండి. మీ 10 అంకెల మొబైల్ నెంబర్ నమోదు చేసి కొనసాగించి బటన్ ప్లే చేయండి..
-రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి కొనసాగించాలి..
-స్కీం పేరుని ప్రధానమంత్రి కిసాన్ మన్ దన్ యోజనగా ఎంచుకోవాలి. ఈ లింకుపై క్లిక్ చేసిన తర్వాత PMKMY సబ్స్క్రైబ్ ఫారం తెరవబడుతుంది. పీఎం కిసాన్ మన్ దన్ యోజన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి PMKMY ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫారం లో వివరాలను సబ్మిట్ చేయాలి. అంతే ఎంతో సులభంగా ఈ దరఖాస్తును చేసుకొని నెలకి 3000 రూపాయల పెన్షన్ గా పొందండి…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది