SSC Notification 2022 : నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ నుంచి భారీ నోటిఫికేష‌న్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

SSC Notification 2022 : నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ నుంచి భారీ నోటిఫికేష‌న్

 Authored By mallesh | The Telugu News | Updated on :11 July 2022,5:00 pm

SSC Notification 2022 : సెంట్ర‌ల్ సంస్థ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. భారీ ఉద్యోగ నోటిఫికేష‌న్ ను రిలీజ్ చేసింది. ఇందులో మొత్తం 1,411 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఆప్ల‌య్ చేసుకునే అవ‌కాశం క‌ల్పించింది. కానిస్టేబుల్ (డ్రైవర్) ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న‌ట్లు తెలిపింది. ఢిల్లీ పోలీస్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేష‌న్ లో వివ‌రించింది.

వివిధ కేట‌గిరీల్లో ఉన్న ఖాళీల‌ను ప్ర‌క‌టించింది. జ‌న‌ర‌ల్ లో 604, ఈడ‌బ్ల్యూఎస్ కింద 142 పోస్టులు, ఓబీసీలో 353, ఎస్సీ కేట‌గిరిలో 262, ఎస్టీ కేట‌గిరిలో 50 పోస్టులు ఖాళీలు ఉన్న‌ట్లు తెలిపింది. అలాగే ఇందుకు సంబంధించిన అర్హ‌త‌లు ఇప్పుడు తెలుసుకుందాం.. 10+2 (సీనియర్ సెకండరీ) విద్యార్హతలు కలిగి ఉండి హెవీ మోటార్ వెహికిల్స్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా వాహనాల నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకునే వారి యస్సు జులై 1 నాటికి 18-27 ఏళ్ల వయస్సు ఉండాలి.

SSC Notification 2022 Central organization Staff Selection Commission is good news for unemployed

SSC Notification 2022 Central organization Staff Selection Commission is good news for unemployed

SSC Notification 2022 : ఈ నెల 29 వ‌ర‌కు అప్లికేష‌న్స్ గ‌డువు

అలాగే ఎంపిక షెడ్యూల్ కూడా విడుద‌ల చేసింది. దరఖాస్తుల ప్రక్రియ జులై 7 నుంచి ప్రారంభం కాగా అప్లికేష‌న్స్ జులై 29 వ‌ర‌కు చివ‌రి తేదీ ఉంది. ఇక ఆన్ లైన్ లో ఫీజు చెల్లించడానికి చివ‌రి తేదీ జులై 30 గా ఉంది. ఇక అక్టోబ‌ర్ లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వ‌హించ‌నుంది. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకున్న అభ్య‌ర్తులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించి తుది ఎంపిక చేపడతారు. ఈ ఎగ్జామ్ కోసం తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, గుంటూరు, చీరాల, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, నెల్లూరు, విజయనగరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో ఎగ్జామ్ నిర్వ‌హించ‌నున్నారు.

Also read

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది