దేశంలో రోజు రోజుకీ పెరిగిపోతున్న ఇంధనల ధరలు సామాన్యులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్తోపాటు వంట గ్యాస్ ధరలు కూడా బాగా పెరిగాయి. ఈ క్రమంలో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంధన ధరలను చెల్లించేందుకు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు కరోనా వల్ల ఇప్పటికే తీవ్రమైన నష్టాలు, సమస్యల్లో ఉన్నవారిపై పెరుగుతున్న ఇంధన ధరలు గుదిబండగా మారాయి.
why fuel prices are not decreasing in india
దేశంలో అంతలా ధరలు పెరిగిపోతున్న వాటిని ప్రభుత్వాలు ఎందుకు తగ్గించడం లేదు ? అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటికే కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజ్యసభలో సమాధానం ఇచ్చారు. ప్రభుత్వాలు నడిచేది ప్రజలు చెల్లించే పన్నుల వల్లే. అందువల్ల వాటిని తగ్గించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రం ధోరణినే అనుసరిస్తున్నాయి. ఫలితంగా ధరలు తగ్గడం లేదు.
ఇక కరోనా నేపథ్యంలో గతేడాది చమురు సంస్థలకు నష్టాలు వచ్చాయి. వాడకం తక్కువైంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గాయి. దీంతో చమురు సంస్థలు నష్టాలను చవిచూశాయి. ఈ క్రమంలో సౌదీ అరేబియా ఆ నష్టాలను పూడ్చుకునేందుకు నిత్యం ఉత్పత్తి చేసే చమురు పరిమాణాన్ని తగ్గించింది. తక్కువ చమురును వెలికి తీస్తోంది. దీంతో సహజంగానే డిమాండ్ పెరిగింది. ఫలితంగా ధరలు కూడా పెరుగుతున్నాయి. అయితే మరికొంత కాలం ఇదే తీరు కొనసాగే అవకాశం ఉంది. ఆ తరువాతే ధరలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు.
మన దేశంలో ఇంధన ధరలు అంతర్జాతీయ మార్కెట్లను బట్టి మారుతుంటాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధర పెరిగితే ఇక్కడ పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరుగుతాయి. చమురు ధర తగ్గితే ఆ ధరలు తగ్గుతాయి. కానీ చమురు ధరలు పెరుగుతున్నందునే ఇంధన ధరలు కూడా పెరుగుతున్నాయి. కనుకనే రేట్లు తగ్గడం లేదు. మరి భవిష్యత్తులో అయినా ఇంధన ధరలు తగ్గుతాయా, లేదా అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.