7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న 18 నెలల డీఏ బకాయిల కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు కేంద్రం.. ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. త్వరలోనే దీనిపై కేబినేట్ భేటీ కానుంది. ఇందులో 18 నెలల డీఏ బకాయిలపై చర్చించనున్నారు. గత సెప్టెంబర్ లో డీఏ, డీఆర్ ను పెంచిన విషయం తెలిసిందే కదా. అయితే.. 18 నెలల డీఏ బకాయిలు మాత్రం చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్నాయి.
జనవరి 2020 నుంచి జూన్ 2021 వరకు 18 నెలల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి.వాటిని దసరా, దీపావళి కానుకగా ముందే చెల్లిస్తారని భావించినా వాటిని చెల్లించలేదు. తాజాగా బకాయిలపై నిర్ణయం తీసుకొని త్వరలోనే వాటిని చెల్లించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. లేవల్ 3 ఉద్యోగుల డీఏ బకాయిలను రూ.11,880 నుంచి రూ.37,554 వరకు చెల్లించే అవకాశం ఉంది. అదే లేవల్ 13, లేవల్ 14 ఉద్యోగులకు బకాయిలు రూ.1,44,200 నుంచి రూ.2,15,900 వరకు చెల్లించే అవకాశం ఉంది.
28 సెప్టెంబర్ 2022న యూనియన్ కేబినేట్ డీఏను 38 శాతానికి పెంచింది. ఇదివరకు 34 శాతం ఉండగా.. 4 శాతం పెంచి 38 శాతానికి పెంచింది. ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా డీఏను పెంచారు. జులై 1, 2022 నుంచే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన డీఏ, డీఆర్ అందుబాటులోకి రానుందని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. సంవత్సరానికి రూ.6261.20 కోట్లు డీఆర్, రూ.4174.12 కోట్లు 2022-23 ఆర్థిక సంవత్సరానికి అంటే జులై 2022 నుంచి ఫిబ్రవరి 2023 కి కేంద్రంపై పడే భారం అది.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.