
#image_title
Revanth Reddy | తెలంగాణ ప్రభుత్వం మరోసారి పేదల పక్షాన ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లికి, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 300 ఇళ్లు మంజూరు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ గ్రామం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఉండటం విశేషం.
కొండారెడ్డిపల్లికి ప్రత్యేక మంజూరు
ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దశల వారీగా ఇళ్ల మంజూరు, నిర్మాణ కార్యక్రమాలు చేపట్టింది. తొలి విడతలో 4.5 లక్షల గృహాల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకుని, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించింది.ఇందిరమ్మ పథకంలో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం విడతల వారీగా రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తోంది.
ఇప్పటికే అచ్చంపేట నియోజకవర్గానికి మంజూరైన 3,500 ఇళ్లకు అదనంగా, సీఎం స్వగ్రామమైన కొండారెడ్డిపల్లికి ప్రత్యేకంగా 300 ఇళ్లు మంజూరు చేయడం గమనార్హం. ఈ అదనపు ఇళ్లతో స్థానికులకు మరింత ఊరటనిచ్చే అవకాశం ఉంది.ఇదే సమయంలో, లబ్ధిదారులకు ప్రభుత్వం చెల్లింపులు త్వరగా, పారదర్శకంగా చేరేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద జరిగే అన్ని చెల్లింపులు ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (ABPS) ద్వారా ప్రాసెస్ చేయనున్నట్టు తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ MD వీపీ గౌతమ్ తెలిపారు.ఈ సిస్టం ద్వారా బిల్లుల చెల్లింపులో జాప్యాలు తగ్గుతాయని, బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమయ్యే విధంగా వ్యవస్థ రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు.
YSRCP : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రస్తుత పరిస్థితి మరియు పార్టీ…
Ram Charan Upasana Twins : మెగా పవర్స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించారనే వార్త సోషల్…
Whatsapp : వాట్సాప్ తన యూజర్ల సౌకర్యం, భద్రతను దృష్టిలో పెట్టుకొని వరుసగా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే…
Akira Nandan Tollywood entry : మెగా ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో ఎప్పుడు వస్తాడా అని అభిమానులు…
Success Story : జీవితంలో పెద్ద విజయాలు సాధించాలంటే ఉన్నత విద్య, విదేశీ డిగ్రీలు తప్పనిసరి అని చాలా మంది…
Threatening Letters : ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం 'బెదిరింపు లేఖల' వ్యవహారం పెను సంచలనంగా మారింది. కూటమి ప్రభుత్వంలో…
Telangana Municipal Elections : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ శాంతియుతంగా, ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతోంది. పట్టణ స్థానిక…
PM Surya Ghar Yojana : దేశంలో విద్యుత్ ఛార్జీలు రోజురోజుకు పెరుగుతూ సాధారణ కుటుంబాలపై ఆర్థిక భారం మోపుతున్నాయి.…
This website uses cookies.