Sagar by poll : ప్రస్తుతం తెలంగాణలో ఒక్కటే హాట్ టాపిక్. అదే నాగార్జునసాగర్ ఉపఎన్నిక. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో గెలవడం కోసం అన్ని పార్టీలు తెగ ఆరాటపడుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అప్పుడే రంగాన్ని సిద్ధం చేశాయి.
టీఆర్ఎస్ పార్టీకి చెందిన సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అనారోగ్యంతో చనిపోవడంతో సాగర్ లో ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే… ఇప్పటికే జరిగిన దుబ్బాక ఉపఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ కంటే… బీజేపీ మెరుగైన సీట్లు సాధించింది. దీంతో టీఆర్ఎస్ పార్టీ వెంటనే అలర్ట్ అయిపోయింది. తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయదుందుబి మోగించింది.
ఆ తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో… ఈ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ గెలిచి మరోసారి తమ సత్తా చూపించాలని ఆరాటపడుతుంటే… బీజేపీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడంతో… కనీసం సాగర్ ఉపఎన్నికల్లో అయినా గెలిచి సత్తా చూపించాలని ప్రణాళికలు రచిస్తోంది.
ఈనేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి అమరవీరుల కుటుంబాలు భారీ షాక్ ఇచ్చాయి. సాగర్ ఉపఎన్నిక కోసం ఏకంగా 400 నామినేషన్లను వేసి.. సీఎం కేసీఆర్ అవాక్కయ్యేలా చేశాయి. గతంలో కూడా నిజామాబాద్ ఎంపీ స్థానం ఎన్నిక కోసం… ఇలాగే పసుపు రైతులు వేల సంఖ్యలో నామినేషన్లు వేశారు. టీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో ఇండిపెండెంట్ గా వేల మంది రైతులు నామినేషన్లు వేయడంతో… టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కవిత ఓడిపోయారు. ఆమె స్వయానా సీఎం కూతురు కావడంతో అప్పట్లో అది పెద్ద సంచలనంగా మారింది.
తాజాగా… అదే సీన్ మళ్లీ రిపీట్ కావడంతో… ఈ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అమరవీరుల కుటుంబాలు సాగర్ ఉపఎన్నికల్లో నామినేషన్ వేయడంతో వెంటనే తేరుకున్న టీఆర్ఎస్ హైకమాండ్… అమరవీరుల కుటుంబాలతో చర్చలు కూడా జరుపుతోందని సమాచారం. మీరు ఏం చేసినా.. సాగర్ ఉపఎన్నికల్లో మాత్రం పోటీ చేస్తాం… అని అమరవీరుల కుటుంబాలు భీష్మించుకు కూర్చున్నాయట. చూద్దాం మరి.. నాగార్జునసాగర్ ఉపఎన్నిక ఎన్ని మలుపులు తిరుగుతుందో?
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.