7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా పెరిగిన జీతం.. హోలీ ముందే వచ్చేసింది

 Authored By kranthi | The Telugu News | Updated on :6 March 2023,7:00 pm

7th Pay Commission : ఏడో వేతనం సంఘం సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ పెంచేందుకు సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. డీఏ పెంపుతో పాటు 18 నెలల డీఏ బకాయిలు, ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ పెంపుపై కేంద్ర ఉద్యోగులు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. కట్ చేస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ముందే కొన్ని రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరిగాయి. డీఏను కూడా పెంచాయి కొన్ని రాష్ట్రాలు. హోలీ పండుగ సందర్భంగా కర్నాటక ప్రభుత్వం డీఏను పెంచింది.

7th Pay Commission hike in salary announced for these govt employees

7th Pay Commission hike in salary announced for these govt employees

గత కొన్ని రోజులుగా వాళ్లు డీఏను పెంచాలంటూ నిరసన వ్యక్తం చేయడంతో డీఏను పెంచింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా డీఏను పెంచుతున్నట్టు తాజాగా ప్రకటించింది. ఈ రెండు రాష్ట్రాలు తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ బహుమతిగా డీఏను పెంచుతున్నట్టు ప్రకటించాయి. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై గత వారమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెంచుతున్నట్టు ప్రకటించారు. 17 శాతం జీతం పెంచుతున్నట్టు ప్రకటించారు.

7th Pay Commission hike in salary announced for these govt employees

7th Pay Commission hike in salary announced for these govt employees

7th Pay Commission : 17 శాతం జీతాలు పెంచిన కర్ణాటక ప్రభుత్వం

ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు జీతాలు పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేయడంతో హోలీ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక.. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం 3 శాతం డీఏను పెంచుతూ ఫిబ్రవరి 15న నిర్ణయం తీసుకుంది. ఇక.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను కేంద్రం త్వరలో పెంచే అవకాశం ఉంది. మార్చి 8 తర్వాత డీఏ 4 శాతం పెరగనుందట. ప్రస్తుతం డీఏ 38 శాతం ఉన్న విషయం తెలిసిందే. 4 శాతం పెరిగితే 42 శాతం అవుతుంది.

kranthi

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి