Categories: News

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల‌కి గుడ్ న్యూస్.. డీఏపై 3 శాతం పెంపు !

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో బంపర్ బొనాంజా లభించే అవకాశం ఉన్న‌ట్టుగా తెలుస్తుంది. ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. కనీసం 3శాతం వరకూ పెంచే యోచన చేస్తున్నట్లు సమాచారం. 2024, జూలై 1 నుంచి ఈ పెంచిన డీఏను అమలు చేసేలా ప్రణాళిక చేస్తుండ‌గా, ఈ మొత్తాన్ని సెప్టెంబర్ మాసంలో ఉద్యోగులకు అందించేందుకు కసరత్తు చేస్తోంది. 3శాతం డీఏ అయితే ఖాయమని.. అవకాశాన్ని బట్టి అది 4శాతానికి పెరగవచ్చని కూడా కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 3 నుంచి 4శాతం వరకూ డీఏ పెంపు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ ప్రకటించే అవకాశం ఉందని.. 3శాతం పెంపును ద్రవీకరించినా.. అప్పటి ద్రవ్యోల్బణ పరిస్థితిని బట్టి అది 4శాతానికి కూడా పెరగవచ్చిన విశ్వసనీయ వర్గాల సమాచారం.

7th Pay Commission బంప‌ర్ బొనాంజా..

అయితే ప్రకటన ఎప్పుడు వచ్చినా.. జూలై 1వ తేదీ నుంచి అమలు చేస్తారు. జనవరిలో డీఏ 4 శాతం పెంచడంతో డీఏ 50 శాతానికి చేరింది. ఇప్పుడు 3 శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే 53 శాతానికి చేరుతుంది. ఆ క్రమంలో ఉద్యోగి డియర్‌నెస్ అలవెన్స్ రూ.1,00,170 వరకు పొందవచ్చు. ఈ పెంపు గ్రేడ్ పే, జీతం ఆధారంగా మారుతుంది. 4వ వేతన సంఘం సమయంలో డీఏ అత్యధికంగా 170 శాతానికి చేరుకుంది. 2024 మార్చిలో ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్ 4 శాతం పెంచింది. దీంతో ఈ మొత్తం బేసిక్ పేలో 50 శాతానికి చేరింది. పెన్షనర్లకు ఇచ్చే డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) కూడా 4 శాతం పెరిగింది. సాధారణంగా జనవరి, జులై నుంచి అమల్లోకి వచ్చే డీఏ, డీఆర్‌ సంవత్సరానికి రెండుసార్లు సవరిస్తారు.

7th Pay Commission

8వ వేతన సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల సమాఖ్య డిమాండ్‌ చేస్తున్నాయి. దీనిపై ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి జులై 30న రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 8వ వేతన సంఘం ఏర్పాటుకు ప్రస్తుతం ఎలాంటి ప్రణాళికలు లేవని కేంద్ర మంత్రి తెలిపారు. 7వ వేతన సంఘం 2014 ఫిబ్రవరిలో ఏర్పాటు చేశారు. దీని సిఫార్సులను 2016 జనవరి 1 నుంచి అమలు చేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను సమీక్షించడానికి , సవరించడానికి ప్రతి 10 సంవత్సరాలకు ఒక కొత్త పే కమిషన్‌ను ఏర్పాటు చేస్తారు.

Recent Posts

Chanakya Niti | చాణక్య సూత్రాలు: ఈ మూడు ఆర్థిక నియమాలు పాటిస్తే జీవితంలో డబ్బు కొరత ఉండదు!

Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…

2 hours ago

Phone | రూ.15,000 బడ్జెట్‌లో మోటరోలా ఫోన్ కావాలా?.. ఫ్లిప్‌కార్ట్‌లో Moto G86 Power 5Gపై భారీ ఆఫర్!

Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…

13 hours ago

Cancer Tips | ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కాళ్లలో కనిపించే ప్రారంభ సంకేతాలు .. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం

Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్‌, గుండెపోటు, స్ట్రోక్‌…

16 hours ago

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ఆందోళన .. కాకినాడ తీరంలో కల్లోలం

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…

19 hours ago

Dry Eyes | కళ్ళు పొడిబారడం వ‌ల‌న పెరుగుతున్న సమస్య .. కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు ఇవే

Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…

20 hours ago

Lemon Seeds | అవి పారేయకండి ..నిమ్మగింజల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!

Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…

23 hours ago

Lemons | మూఢనమ్మకాల వెనుక శాస్త్రం ..మూడు బాటల దగ్గర నడవకూడదంటారా?

Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…

1 day ago

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

2 days ago