7th Pay Commission : గత నెలలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. మరోసారి గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అవుతోంది. జనవరిలో పెరగాల్సిన డీఏ గత నెలలో పెరిగిన విషయం తెలిసిందే. జనవరి 1, 2023 నుంచి డీఏ పెంపు అమలులోకి వస్తుందని కేంద్రం తెలిపింది. ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు డీఏను 4 శాతం పెంచింది. అయితే.. మరోసారి అంటే వచ్చే జులైలో డీఏను మరోసారి పెంచేందుకు కేంద్రం సమాయత్తమవుతున్నట్టు తెలుస్తోంది.
జులైలో మరో 4 శాతం డీఏ పెంచే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి ప్రతి సంవత్సరం జనవరి, జులైలో డీఏ పెరుగుతుంది. జనవరిలో పెరగాల్సిన డీఏ.. గత నెల పెరిగింది. మళ్లీ జులైలో పెరిగే అవకాశం ఉంది. డీఏ, డీఆర్ రెండూ పెరిగే అవకాశాలు ఉన్నాయట. దీని వల్ల ప్రస్తుతం 42 శాతంగా ఉన్న డీఏ మరో 4 శాతం పెరిగితే అది 46 శాతం కానుంది. దీని వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఒక్కసారిగా పెరగనున్నాయి.
డీఏ పెంపు వల్ల దేశవ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 47.58 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. అలాగే.. 69.76 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ఉద్యోగుల బేసిక్ పే ప్రకారం డీఏ పెరగనుంది. ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని డీఏను కేంద్రం పెంచుతుంది. గత సంవత్సరం సెప్టెంబర్ 28, 2022న కేంద్రం డీఏను పెంచింది. ఆ తర్వాత మళ్లీ గత నెలలో జనవరి డీఏను పెంచి జనవరి 1 నుంచి డీఏను అమలులోకి తీసుకొచ్చింది. మళ్లీ జులైలో ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు డీఏను పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…
Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ (PM E-డ్రైవ్)…
TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…
Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…
Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…
Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…
Shekar Basha : బిగ్బాస్ తెలుగు 8 సక్సెస్ ఫుల్గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…
Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…
This website uses cookies.