7th Pay Commission
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్.. ఇప్పటికే దసరా, దీపావళి సందర్భంగా బోనస్, డీఏ, డీఆర్ ను కేంద్రం పెంచిన విషయం తెలిసిందే. తాజాగా మరో గుడ్ న్యూస్ ను కేంద్రం అందిస్తోంది. అదే ఫిట్ మెంట్ కు సంబంధించి. ఫిట్ మెంట్ కు సంబంధించి కేంద్రం నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు ఫిట్ మెంట్ ను పెంచేందుకు కేంద్రం యోచిస్తోంది. ఫిట్ మెంట్ పెరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బేసిక్ వేతనం పెరగనుంది.
దానికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఫిట్ మెంట్ పెరిగితే 52 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా జీతాలు పెరుగనున్నాయి. అయితే.. ఫిట్ మెంట్ పెంచాలని, తమ జీతాలు పెంచాలని చాలా రోజుల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం 2.57 శాతంతో ఫిట్ మెంట్ ను ఉద్యోగులకు ఇస్తున్నారు. దీన్ని 3.68 కు పెంచే అవకాశం ఉంది.
7th Pay Commission on central govt employees to get fitment very soon
3.68 శాతానికి పెంచితే ఒక్కసారిగా జీతాలు పెరగనున్నాయి. 2.57 నుంచి 3.68 కు ఫిట్ మెంట్ పెంచితే బేసిక్ వేతనం 18 వేల నుంచి 26 వేలకు పెరుగుతుంది. 2017 లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ జీతాలు పెరగలేదు. మధ్యలో డీఏ పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కనీసం రూ.18 వేల మూల వేతనాన్ని, గరిష్ఠంగా రూ.56,900 మూల వేతనాన్ని పొందుతున్నారు. ఇప్పుడు ఫిట్ మెంట్ పెంచితే హైలేవల్ ఉద్యోగుల వేతనం కనీసం రూ.50 వేల వరకు పెరగనుంది.
Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…
Bhu Bharati : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…
Today Gold Price : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల…
karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…
Sprouted Fenugreek : తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనందరికీ తెలుసు. ఇవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య…
AP Mega DSC : ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదలైంది.…
Jyotishyam : శాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తుని జరిగే సంఘటనలను చెప్పడంలో బాబా వంగ కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి గాంచింది.. బాబా…
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ డివిజన్ Uppal Division సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్రెడ్డి Rajitha…
This website uses cookies.