Home » Exclusive » Another Powerful 5 Kings Who Ruled India In Past
Exclusive

Kings Ruled INDIA : భారతదేశాన్ని పాలించిన అత్యంత శక్తిమంతమైన రాజులు వీరే..!

Authored By
aruna
The Telugu News | Published on: August 19, 2022, 7:00 pm
Advertisement

Kings Ruled INDIA : భారతదేశాన్ని ఎందరో మహానుభావులు పాలించారు.. ఆ రాజుల కాలంలో ఎటువంటి సంస్కృతి, సంప్రదాయాలను నెలకొల్పారు.. మరి కొంతమంది రాజులు వారి హయాంలో పెద్దపెద్ద కోటలను నిర్మించారు.. ఈ వీడియోలో భారత దేశ చరిత్రలో నిలిచిపోయిన ఐదుగురు రాజుల గురించి తెలుసుకుందాం..

Advertisement

శ్రీ కృష్ణదేవరాయలు : తురువ వంశానికి చెందిన 3వ పాలకుడు శ్రీకృష్ణ దేవరాయలు. ఇతను దక్షణానికి చెందిన గొప్ప పాలకుడు.. ఇతను విజయ నగర పాలకుడు.. ఇతను దక్షిణ భారతదేశంపై మొగల్ చక్రవర్తుల ఆక్రమణలను నిలిపివేశారు, ఇతను అనేక దేవాలయాలను నిర్మించాడు.. అంతే కాక ఇతను గోల్కొండ సుల్తానులను మరియు ఒడిస్సా కళింగ రాజులను జయించి తన రాజ్యాన్ని విస్తరించాడు. ఇతనికి భయపడి బాబర్ ఇతని సైన్యంపై యుద్ధం చేయలేదు.. మహారాణా ప్రతాప్ : ఇతను మొవ్వర్ వంశానికి చెందిన రాజుకు పాలకుడు. వీరు మొగల్ సామ్రాజ్యానికి పాలకులు భారతదేశం అంతటా విస్తరిస్తున్న వేళ మిగతా రాజులు వారిని ఒడించలేక మొగల్ పాలకులకు వారి రాజ్యాలను అప్పగిస్తున్న వేళ మోవ్వర్ వంశం లో సూర్యుడి లా మహా రాణా ప్రతాప్ ఉద్భవించాడు. మొవ్వార్ వంశం యొక్క గొప్పదనాన్ని, సంస్కృతిని, సంప్రదాయాన్ని తన తల్లి ద్వారా తెలుసుకొని మొగల్ పాలకుల నుంచి కాపాడుకోవాలని పోరాటం చేశాడు.. తన దేశాన్ని కాపాడడం కోసం అక్బర్ తో యుద్ధం చేశాడు కానీ.. ఆ యుద్ధం లో ఓడిపోయాడు. వారిమీద గెలిచే వరకు తను మంచం మీద పడుకోనని.. ప్లేటులో అన్నం తిననని.. ఎటువంటి రాజభోగాలు అనుభవించని శబదం చేసుకున్నాడు.. మళ్లీ వారితో యుద్ధం చేసి గెలిచే వరకు ఇలాగే ఉండాలని భీష్మించుకు కూర్చున్నాడు .. ఆ తరువాత వారితో యుద్ధం చేసి గెలుస్తాడు.

Another Powerful 5 Kings Who Ruled INDIA In Past

Advertisement

అక్బర్ : అక్బర్ మొగల్ సామ్రాజ్యానికి చెందిన 3వ పాలకుడు.. తన తండ్రి హామయున్ అడుగు జాడల్లో నడిచి మొగల్ సామ్రాజ్యాన్ని భారత ఉపఖండం అంత విస్తరింపజేశాడు.గోదావరి నది కి ఉత్తరాన ఉన్న దాదాపు మొత్తం ఉపఖండం పరిపాలించాడు. హిందూ మరియు ముస్లింల ప్రేమను గెలుచుకున్న ఏకైక రాజు అక్బర్. ఎన్నో పెద్ద పెద్ద కోటలు నిర్మించాడు.. అక్బర్ కు ఎంతో పెద్ద సైన్యం ఉండేది.. యుద్ధంలో అక్బర్ ఎన్నో రకాల కొత్త కొత్త టెక్నిక్స్ ను ఉపయోగించేవాడు.. ఆ రాజ్యంలో కూడా ఎన్నో రకాల కొత్త కట్టడాలను నిర్మించేవాడు.. 19వ శతాబ్దం వరకు మొగల్ సామ్రాజ్యo నిలబడడానికి కారణం అక్బర్.. శివాజీ మహారాజ్ : ఇతను మరాఠా పాలనలో యెంతో ప్రజాదరణ పొందిన విజయవంతమైన పాలకులు.. వీరు చిన్న వయస్సు నుంచి గెరిల్లా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందారు. ఈయనకు చిన్నప్పటి నుంచి యెంతో దేశ భక్తి కలదు.. ఇతనికి మొగల్ పాలన అంటే అసలు ఇష్టం ఉండేది కాదు.. అందుకే ఈయనకు వ్యతిరేకంగా ఎప్పుడు పోరాటాలు చేస్తూ ఉండేవారు.. శివాజీ మహారాజ్ కి లక్షకు పైగా సైన్యం వుండేవారు.. ఇతను నేర్చుకున్న యుద్ధ కలలను శివాజీ సూక్తం లో రాశారు.. ఇతను పర్షియన్ భాష కంటేనే కూడా సంస్కృతం మరాఠీ భాషలోనే వారి పరిపాలన కొనసాగించారు..

మహా రాజా రంజత్ సింగ్ : ఇతను ఒక సిక్కు పాలకుడు.. 19వ శతాబ్దంలో తన సిక్కు పరిపాలన ప్రారంభించాడు. ఇతని పరిపాలన పంజాబ్ ప్రావిన్స్ లో విస్తరించింది.దాల్ కల్సా అనే సంస్థకు నాయకత్వం వహించాడు. వీరు సిక్కులకు చిన్న చిన్న సమూహాలుగా విభజించాడు. ఇతను తరువాత ఇతని కొడుకు ఖరక్ సింగ్ సిక్కులను పరిపాలించాడు. ఇతను పంజాబ్ లోని అన్ని ప్రాంతాలలో తూర్పున వున్న బ్రిటిష్ వారిని పశ్చిమాన వున్న దూరని రాజ్యాన్ని సైతం ఆక్రమించాడు. మహారాజ రంజిత్ సింగ్ పంజాబ్ ప్రాంతాన్ని ఏకం చేసి సిక్కు రాజ్యాన్ని స్థాపించాడు.ఇతను ఆఫ్గనీలకు ఎదురుగా అనేక యుద్దాలు చేశాడు. అలాగే పర్షియన్ ను సొంతం చేసుకున్నాడు.. ముస్లిమ్స్ కాకుండా పరిచయంను మొదటిసారి పాలించిన రాజు ఇతనే.. ఆ తరువాత జమ్ము కాశ్మీర్ ఇతర రాష్ట్రాలను తన ఆధీనంలో ఉంచుకొని పాలించాడు.. బ్రిటిష్ చరిత్రకారుడైన జట్టి బీలర్ ప్రకారం ఇతను ముందు తరం కనుక పుట్టి ఉంటే భారతదేశం మొత్తాన్ని ఇతను ఒక్కడే పాలించి ఉండేవాడు అని ఆయన పేర్కొన్నాడు..

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి