Ap Cabinet Meeting : ఏపీ కేబినెట్‌లో చ‌ర్చించిన కీల‌క అంశాలు ఇవే

Advertisement
Published by
Advertisement

Ap Cabinet Meeting : ప్రస్తుతం కరోనా ఎక్కడ చూసినా తీవ్రంగా విజృంభిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణ కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు. ఏపీలో ఇప్పటికే రాత్రి పూట కర్ఫ్యూను విధించారు. రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు ప్రస్తుతం కర్ఫ్యూ అమలులో ఉండగా.. తాజాగా ఏపీ కేబినేట్ మరో నిర్ణయం తీసుకుంది. బుధవారం (మే 5) నుంచి పగటి పూట కర్ఫ్యూను విధించనుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో ఏపీ కేబినేటీ భేటీ జరగగా… ఈ భేటీలో మంత్రివర్గం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా నియంత్రణ కోసం, కర్ఫ్యూ గురించి, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ గురించి, రైతుల గురించి, ఇతర సంక్షేమ పథకాల విషయంలో మంత్రివర్గం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి పేర్ని నాని.. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.

Advertisement

ap cabinet meeting and prime decisions

మే 5 నుంచి పగటి పూట కర్ఫ్యూ అమలులోకి రానుంది. పగటిపూట కర్ఫ్యూలో భాగంగా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే షాపులకు అనుమతి ఉంటుంది. మధ్యాహ్నం 12 దాటాక ఏపీలోని అన్ని షాపులు బంద్ చేయాల్సి ఉంటుంది. 12 తర్వాత షాపులు మాత్రమే కాదు.. ప్రజా రవాణా, ఇతర వాహనాలు కూడా రోడ్డు మీద తిరగడానికి వీలు లేదు. అంటే.. మధ్యాహ్నం 12 దాటితే బస్సులు తిరగవు. ప్రైవేటు వాహనాలు కూడా తిరగవు.. అని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.

Advertisement

ఏపీ కేబినేట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే

మధ్యాహ్నం 12 తర్వాత అంతరాష్ట్ర సర్వీసులను కూడా రద్దు చేశారు. పగటి పూట కర్ఫ్యూ వల్ల రాష్ట్రంలో కేసులు గణనీయంగా తగ్గుతాయని.. అలా అయితేనే కరోనాను నియంత్రించడం కుదురుతుందని మంత్రి పేర్ని నాని తెలిపారు. రైతులకు సంబంధించి… మే 13న రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు. దీని వల్ల సుమారు 54 లక్షల రైతులకు లబ్ధి చేకూరనుంది. మే 25న వైఎస్సార్ ఉచిత పంటల బీమా నగదును ప్రభుత్వం జమ చేయనుంది. దీని వల్ల సుమారు 38 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.

ప్రస్తుతం మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరు కాబట్టి… వాళ్ల కోసం మే 18న వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద… నగదు జమ చేయనుంది ప్రభుత్వం. ఈ పథకంలో భాగంగా… వేటకు వెళ్లే మత్స్యకారులకు 10 వేల రూపాయల సాయాన్ని అందించనుంది ప్రభుత్వం. పట్టా రైతులకు భూసేకరణ పరిహారం ఇచ్చినట్టుగానే… అసైన్డ్ భూమి కలిగిన రైతులకు కూడా సమానంగా భూసేకరణ పరిహారాన్ని ప్రభుత్వం అందించనుంది.

ప్రభుత్వ పాఠశాలల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 7వ తరగతి నుంచి ఏపీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ ను బోధించనున్నారు. సీబీఎస్ఈ సిలబస్ కు కేబినేట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఉన్న 44639 ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే సంవత్సరం నుంచి సీబీఎస్ఈ సిలబస్ ను బోధించనున్నారు. అలాగే పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో సీబీఎస్ఈ బోధన ఉండనుంది. ఇప్పటికే ఏపీలో నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయని… ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య కూడా పెరిగిందని మంత్రి పేర్ని నాని తెలిపారు.

Advertisement
Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Recent Posts

Certificates : గుడ్‌న్యూస్‌ .. ఇక పై ‘మీసేవా’ల చుట్టూ తిరగాల్సిన పనిలేదు .. వాట్సాప్‌లోనే కాస్ట్, ఇన్‌కమ్, GHMC సర్టిఫికెట్లు .. !

Certificates : హైదరాబాద్ నగరంలో కాస్ట్, ఇన్‌కమ్, రెసిడెన్స్, EBC, OBC మ్యారేజ్, బర్త్, డెత్ వంటి వివిధ ప్రభుత్వ…

1 hour ago

IPL : క్రికెట్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్… ఆ కారణంగా IPL వాయిదా పడనుందా ?

IPL : భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న Indian Premier League (ఐపీఎల్) ప్రారంభంపై ఇప్పుడు సందేహాలు నెలకొన్నాయి.…

2 hours ago

Gold and Silver Prices 11 March 2026 : ట్రంప్ ఒక్క ప్రకటనతో భగ్గుమన్న బంగారం.. హైదరాబాద్‌లో రూ. 3 లక్షలు దాటిన వెండి!

Gold and Silver Prices 11 March 2026 : దేశీయ బులియన్ మార్కెట్‌లో ఒక్కసారిగా ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.…

3 hours ago

Ustaad Bhagat Singh Censor Review: ఉస్తాద్ భగత్ సింగ్ సెన్సార్ రివ్యూ..!

Ustaad Bhagat Singh Censor Review పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan అభిమానులు ఎప్పుడెప్పుడా అని కళ్లు…

3 hours ago

Karthika Deepam 2 March 11th 2026 Episode : జ్యోత్స్న మాస్టర్ ప్లాన్.. హాస్పిటల్ లో దీపకు షాక్, అడ్డంగా బుక్కైన కార్తీక్!

Karthika Deepam 2 March 11th 2026 Episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న 'కార్తీక దీపం 2'…

3 hours ago

Guava : జామకాయ తినే సరైన విధానం ఏది? .. తొక్కతో తినాలా.. లేక తొక్క తీసి తినాలా ? .. నిపుణుల సూచనలు ఇవే..!

Guava : తక్కువ ధరలోనే అధిక పోషకాలు అందించే పండ్లలో జామకాయ ప్రత్యేక స్థానం కలిగి ఉంది. విటమిన్ సి,…

4 hours ago

Alcohol : మందుబాబులకు హెచ్చరిక .. ప్రపంచంలోనే అధిక ఆల్కహాల్ ఉన్న మద్యం బ్రాండ్లు ఏంటో తెలుసా? .. ఒక క్యాప్ తాగినా ప్రమాదమే !

Alcohol :  మద్యం సేవించే వారిలో చాలామంది వివిధ రకాల ఆల్కహాల్ బ్రాండ్లను రుచి చూడటానికి ఆసక్తి చూపుతుంటారు. మార్కెట్‌లో…

5 hours ago

Zodiac Signs : ఉగాది నుంచి ఈ నాలుగు రాశుల వారికి అదృష్ట కాలం .. భారీగా ధన లాభాలు .. కెరీర్‌లో పురోగతి ..!

Zodiac Signs : తెలుగు పంచాంగం ప్రకారం మార్చి 19న ఉగాది పండుగతో కొత్త సంవత్సరం అయిన శ్రీ పరాభవ…

6 hours ago

Vijaya Milk : విజయ పాలు బ్రాండ్ గొడవ ఏంటి .. అసలేం జరిగింది .. ?

Vijaya Milk : తెలుగు రాష్ట్రాల్లో విజయ డైరీ పేరు తెలియని వారు ఉండరు. దశాబ్దాలుగా పాడి రైతులకు అండగా…

15 hours ago

YS Jagan : తెలంగాణాలో బయటపడ్డ జగన్ సరికొత్త స్కాం .. !

YS Jagan : తెలుగు రాష్ట్రాల్లో ఎంతో నమ్మకానికి మారుపేరుగా ఉన్న విజయ డైరీ ఉత్పత్తుల విషయంలో ఇప్పుడు కొత్త…

16 hours ago

Tirumala : ఇప్పుడే అందిన బిగ్ బ్రేకింగ్ : తిరుమలలో ఏం జరిగిందో తెలుసా..!

Tirumala : తిరుమల శ్రీవారి కి భక్తులు ఎంతో భక్తితో సమర్పించుకునే కానుకల విషయంలో ఒక సంచలనమైన దొంగతనం వెలుగులోకి…

17 hours ago

YS Jagan : ఏపీ ఉలిక్కిపడే బ్రేకింగ్ : జగన్ బెంగుళూరులో సీక్రెట్ గా ఎవరిని కలిసాడు

YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మళ్ళీ చర్చ మొదలైంది. ఎన్నికల తర్వాత కొంచెం సైలెంట్ గా ఉన్న…

18 hours ago