YS Jagan video conference with govt officials on asani cyclone
YS Jagan : ప్రస్తుతం ఎక్కడ చూసినా నిరుద్యోగులు కుప్పలు తెప్పలుగా ఉంటున్నారు. ఏపీలో నిరుద్యోగ యువత విపరీతంగా పెరిగిపోయింది. సీఎం వైఎస్ జగన్ పై కూడా విమర్శలు కురిపిస్తున్నారు. ఇంకెప్పుడు వేస్తారు నోటిఫికేషన్లు.. ఇంకెప్పుడు ఇస్తారు ఉద్యోగాలు.. అంటూ వైసీపీ ప్రభుత్వంపై యువత నిప్పులు చెరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్.. ఇటీవల నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారు. నిజానికి.. ఆ జాబ్ క్యాలెండర్ మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి. అది జాబ్ క్యాలెండర్ కాదు.. నిరుద్యోగల పాలిట శాపం అంటూ ప్రతిపక్షాలు ఆ జాబ్ క్యాలెండర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
ap cm ys jagan list on mlc post vishakapatnam ysrcp
కట్ చేస్తే.. ఇప్పుడు వైసీపీలో ఉన్న నిరుద్యోగుల కోసం.. అంటే పదవులు రాకుండా ఉన్నవాళ్ల కోసం జాబ్ క్యాలెండర్ సిద్ధం చేస్తున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా.. పదవుల కోసం ఆతృతగా చూస్తున్నవాళ్లు కోకొల్లలు. ఎవరికి న్యాయం చేయాలి.. ఎవరికి పదవి ఇవ్వాలి.. ఎవరికి ఇవ్వకూడదు.. అనే దానిపై సీఎం జగన్ మల్లగుల్లాలు పడుతున్నారు.
త్వరలో ఎమ్మెల్సీ పోస్టులను సీఎం జగన్ భర్తీ చేయనున్నారని తెలిసి… పదవి కోసం చూస్తున్న నేతలంతా ఇక మంతనాలు చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా విశాఖ జిల్లాలో అయితే.. బోలెడు మంది నాయకులు.. పదవుల కోసం వెయిట్ చేస్తున్నారు. గత రెండేళ్ల నుంచి వీళ్లు ఎదురు చూస్తున్నారు. అయితే.. వీళ్లలో ఎవరికి పదవులు దక్కుతాయి.. అనేదే ప్రస్తుతం పెద్ద సస్పెన్స్ గా మారింది.
విశాఖ జిల్లాలో పదవుల కోసం ఎదురు చూసే వాళ్ల లిస్ట్ చూస్తే చాంతాడంత ఉంటుంది. వీళ్లందరికీ పదవులు దక్కాలంటే మాత్రం కష్టమే. కానీ.. ఇందులో ఎవరికి దక్కుతాయి.. అనేది మాత్రం సీఎం జగన్ కే తెలియాలి. ఇందులో కొందరు వేరే పార్టీల నుంచి జంప్ అయిన వాళ్లు ఉన్నారు. వైసీపీ సీనియర్ నేతలు ఉన్నారు. ఎన్నికలకు ముందు వైసీపీలోకి వచ్చినవాళ్లు ఉన్నారు. వీళ్లలో ఎవరికి పదవులు దక్కుతాయి.. అనేదానిపై ప్రస్తుతం స్పష్టత లేదు. కాకపోతే.. సీఎం జగన్ మాత్రం ఎమ్మెల్సీ పోస్టుల భర్తీ విషయమై కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
నిజానికి.. సీఎం జగన్.. పదవుల విషయంలో చాలా క్లారిటీతో ఉన్నారు. ఎందుకంటే.. ఆయన ముందు నుంచి కూడా పార్టీలో ప్రాధాన్యత ఉన్ననేతలకే పదవులు కట్టబెడుతున్నారు. పార్టీలో మొదటి నుంచి ఉండి.. పార్టీని గాడిలో పెట్టడంతో సహకరించిన వాళ్లకే పదవులు దక్కుతున్నాయి. టీడీపీ నుంచి పార్టీలో చేరిన వాళ్లలోనూ అందరికి కాకుండా.. సమర్థత ఉన్న నాయకులకే పదవులను ఇస్తున్నారు. ఈ విషయం ఇటీవల జరిగిన నామినేటెడ్ పోస్టుల విషయంలోనే అర్థమయింది. అందుకే.. త్వరలో భర్తీ కానున్న ఎమ్మెల్సీ పోస్టులు దక్కుతాయో.. అని అంతా టెన్షన్ గా ఎదురుచూస్తున్నారు.
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
This website uses cookies.