AP CM Ys Jagan Target 175 out of 175
Ys Jagan : ‘మంచి చేస్తున్నాం.. చేసిన మంచిని గట్టిగా చెప్పుకోకపోతే ఎలా.? లబ్దిదారులకు చేయాల్సినదంతా చేస్తున్నాం. వారు మనం చేస్తున్న మంచిని గుర్తు పెట్టుకునేలా చేయడం, వారికి ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల గురించి చెప్పడం ఎమ్మెల్యేలుగా మీ బాధ్యత..’ అంటూ వైసీపీ ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కష్ట నష్టాలున్నా, బటన్ నొక్కి సంక్షేమ పథకాల్ని క్యాలెండర్ ప్రకారం అమలు చేస్తున్నారు సీఎం వైఎస్ జగన్.
మ్యానిఫెస్టో అంటే, కేవలం ఎన్నికల ప్రచారం కోసం ఓటర్లను మభ్యపెట్టే ఓ ఉత్త వ్యవహారమనే భావన నుంచి, ఎన్నికల హామీలంటే, మాటకు కట్టుబడి నెరవేర్చాల్సినవని తాము నిరూపించామని వైఎస్ జగన్ సర్కారు చెబుతోన్న సంగతి తెలిసిందే. అయితే, సంక్షేమ పథకాల లబ్దిదారుల ఆలోచన ఒకింత భిన్నంగా వుంటుంది. ‘మా మీద అప్పులు చేసి, సంక్షేమ పథకాలతో మాకు టోపీ పెట్టి, మా నెత్తిన అప్పుల భారం మోపుతున్నారు..’ అనే భావన సహజంగానే ప్రజల్లో వుంటుంది. గతంలో చంద్రబాబు సర్కారు మీద ఇలాంటి భావనే నెలకొంది. అందుకే, చంద్రబాబుకి ఇంటిదారి తప్పలేదు 2019 ఎన్నికల్లో.
AP CM Ys Jagan Target 175 out of 175
అందుకేనేమో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్కడా పార్టీ శ్రేణులు అలసత్వం ప్రదర్శించకుండా ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక్కో సచివాలయానికీ 20 లక్షల చొప్పున, ఒక్కో నియోజకవర్గంలో ఏడు సచివాలయాలకు నిధులు కేటాయించడం జరుగుతుందనీ, వాటిని ఆయా సచివాలయాల పరిధిలో అభివృద్ధి పనులకు ఖర్చు చేయాలని ఎమ్మెల్యేలకు సూచించారు వైఎస్ జగన్.
ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం చేస్తున్న మంచి పని జనం గుండెల్లో నిలిచిపోవాలనీ, అలా చేస్తేనే మొత్తంగా 175 సీట్లనూ గెలుచుకోగలుగుతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఎమ్మెల్యేలకు ఉద్బోధ చేశారు.
Esha Gupta : బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్ అయ్యింది. గతంలో టీమిండియా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే…
Manchu Vishnu : టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన పౌరాణిక చిత్రం…
రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త. జులై నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే…
Team India :ఇండియన్ క్రికెట్ జట్టు టెస్ట్ ఫార్మాట్లో ఈ మధ్య నిరాశాజనక ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.…
RK Roja : ఏపీ రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం…
Wife : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నిషాద్ అనే వ్యక్తి తాజాగా సితార అనే…
Three Sisters : ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో చిరంజీవి అని చెప్పొచ్చు. ఆ ముగ్గురితో కలిసి…
This website uses cookies.