Roja – Pattabhi : ప్రస్తుతం ఏపీలో పట్టాభి ఘటనే బర్నింగ్ టాపిక్ అయింది. గన్నవరం వెళ్లి మరీ.. అక్కడ వల్లభనేని వంశీ, కొడాలి నానిపై బూతు పురాణం చేసిన పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గన్నవరం సంఘటన గురించే రాష్ట్రమంతా ప్రస్తుతం మాట్లాడుకుంటోంది. పోలీసులే రౌడీలుగా వ్యవహరిస్తున్నారు అంటూ టీడీపీ నేతలు రచ్చ రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ఏపీ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. టీడీపీ హయాంలో ఇంతకంటే ఎక్కువ దాడులు జరిగాయి. పోలీసులను అడ్డం పెట్టుకొని టీడీపీ నేతలు చాలా దాడులకు పాల్పడ్డారు.
అలాంటి చాలా సంఘటనలు ఉన్నాయి. రౌడీయిజానికి, సైకోయిజానికి కేరాఫ్ అడ్రస్ ఎవరు అంటే అది చంద్రబాబునాయుడు. పోలీస్ వ్యవస్థను తనకు అనుకూలంగా చాలా విషయాల్లో వీళ్లు ఉపయోగించుకొని ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న తీరును చూసి జనాలు నవ్వుకుంటున్నారు. టీడీపీకి ఏపీలో అడ్రస్ లేదు. ఏపీ ప్రజలు తరిమి కొడితేనే హైదరాబాద్ కు వెళ్లి ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్ లో కూడా ఉండరు. అక్కడి నుంచి కూడా తరిమికొడతారు. శెభాష్ అంటూ సీఎం జగన్ పథకాలను కేంద్రంతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా పొగుడుతున్నాయి.
అలాంటి నాయకుడిని దౌర్భాగ్యులతో తిట్టిస్తారా? తనను ఏమన్నా కూడా దేవుడే శిక్షిస్తాడు అని జగన్ మోహన్ రెడ్డి అనుకుంటారు. తనకున్న సమయంలో ప్రజలకు ఏవిధంగా సాయం చేయాలి, ఎలాంటి సంక్షేమ పథకాలు అందించాలి అనేదానిపైనే ఎప్పుడూ ఆలోచిస్తుంటారు అంటూ రోజా చెప్పారు. గన్నవరం వెళ్లి మరీ అక్కడ రచ్చ చేసి మరీ పట్టాభి తన గోతి తానే తీసుకున్నాడు. గిల్లవా గిల్లవా అంటే రసగుల్ల రసం పిండేశారు అంటూ పట్టాభిని ఉద్దేశిస్తూ రోజా సంచలన కామెంట్స్ చేశారు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.