ఏపీలో గత కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతోంది ఒకే విషయం మీద. అదే హిందూ దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులు. నిజానికి 2019 లో ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చాక ఈ దాడులు ప్రారంభమయ్యాయి. ఒకదాని తర్వాత మరోటి.. ఇలా వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరగడం, దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేయడం పరిపాటిగా మారింది. వందల కొద్ది ఘటనలు జరుగుతున్నా.. పోలీసులు మాత్రం అసలైన నేరస్తులను ఇప్పటి వరకు పట్టుకోలేకపోయారు.
విజయనగరం జిల్లాలోని రామతీర్థం ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. రామతీర్థం ఘటనపై హిందుత్వ వాదులు కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దేవుడు ఏం చేశాడు? దేవుడిని ఎందుకు ఇలా నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు.. అంటూ ప్రశ్నించారు.
అయితే.. ముఖ్యమంత్రి జగన్ కూడా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై సీరియస్ గా ఉన్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయిస్తున్నారు. అయితే.. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ఉన్న విఘ్నేశ్వరాలయంలో సుబ్రహణ్యస్వామి విగ్రహం ధ్వంసం కేసు దర్యాప్తును పోలీసులు పూర్తి చేశారు. కేసును చేధించిన పోలీసులు.. కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.
జనవరి 1 వ తేదీన సుబ్రమణ్యస్వామి విగ్రహం ధ్వంసం అయినట్టు కేసు నమోదు అయిందని ఆయన చెప్పారు. దీనిపై విచారణ జరపగా.. తెలిసిన విషయం ఏంటంటే.. ఆలయంలో పూజు నిర్వహించే పూజారి వెంకట మురళీకృష్ణే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు అశోక్ కుమార్ స్పష్టం చేశారు. ఆలయ పూజారే డబ్బు కోసం ఈ పని చేశాడని.. కొందరు దుండగులు పూజారికి 30 వేల రూపాయలు డబ్బులు ఇచ్చి.. ఈ పని చేయించారని తెలిపారు.
అయితే.. విగ్రహాన్ని ధ్వంసం చేయించినవాళ్లు.. రాజకీయ లబ్ధి కోసమే ఈ పని చేయించారని.. తొందరలోనే వాళ్లను కూడా పట్టుకుంటామని ఆయన తెలిపారు. ఇప్పటికే ఆలయ పూజారితో పాటు.. మరో ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.