
ap tdp leader vanthala rajeswari
TDP : రాజకీయాల్లో అయినా.. ఉద్యోగంలో అయినా.. ఇంకెక్కడైనా.. సరైన నిర్ణయం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఒక్కసారి పప్పులో కాలేస్తే.. ఆ తప్పు వల్ల జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఉద్యోగం మారినా.. పార్టీ మారినా.. ఆ పార్టీలో ఆ సమయానికి ఇచ్చే పదవుల కన్నా.. పార్టీలో భవిష్యత్తు ఎలా ఉంటుంది.. అనే దాన్ని అంచనా వేసుకొని పార్టీ మారాలి. లేదంటే అసలుకే ఎసరు వస్తుంది. ఒక్కోసారి కొందరు నేతలు పార్టీ మారినప్పుడు బాగానే ఉంటుంది. పదవులు కూడా ఇస్తారు. కానీ.. రాను రాను.. ఆ నేతలను పార్టీలో పట్టించుకునేవాడే ఉండడు. అప్పుడే వాళ్లలో అసంతృప్తి స్టార్ట్ అవుతుంది. అప్పుడు మళ్లీ సొంత పార్టీకి వెళ్లాలని ఉన్నా.. వెళ్లలేరు. ఇలా.. తమలో తామే మథనపడుతూ.. ఎందుకు పార్టీ మారాం దేవుడా? అంటూ తలలు పట్టుకొని కూర్చున్న నేతలు ఏపీలో కోకొల్లలు. ఎందుకంటే.. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతుంటాయి అనే విషయాన్ని మనం మరిచిపోతే ఇలాగా ఉంటుంది.
ap tdp leader vanthala rajeswari
ప్రస్తుతం ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రంపచోడవం టీడీపీ నేత వంతల రాజేశ్వరి పరిస్థితి కూడా అలాగే ఉందట. వైసీపీ నుంచి టీడీపీలోకి పార్టీ మారిన రాజేశ్వరిని ప్రస్తుతం పట్టించుకునే నాథుడే కరువయ్యాడట. వంతల రాజేశ్వరి.. వైసీపీ అధినేత జగన్ కు విధేయురాలుగా ఉండేది. తనకు లక్ లో 2014 లో వైసీపీ నుంచి టికెట్ దక్కింది. టికెట్ దక్కడమే కాదు.. తను భారీ మెజారిటీతో రంపచోడవరంలో గెలిచి తన సత్తాను చాటింది. అంతవరకు బాగానే ఉంది కానీ.. ఆమె వైసీపీ ఎమ్మెల్యేగా ఉండగానే.. 2017లో వైఎస్సార్సీపీ పార్టీని వదిలేసి.. టీడీపీలో చేరింది. అయితే.. టీడీపీలో తనకు ఏ పదవిని కూడా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆఫర్ చేయకున్నా కూడా.. భవిష్యత్తులో ఏదైనా పదవి వస్తుందనే ఆశతో రాజేశ్వరి పార్టీ మారింది. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుంది.. టీడీపీ నామరూపం లేకుండా పోతుందని ఆసమయానికి ఆమె ఊహించలేదు కదా. అందుకే పార్టీ మారింది.
ap tdp leader vanthala rajeswari
అయితే.. 2019 ఎన్నికల్లో చంద్రబాబు రంపచోడవరం నుంచి రాజేశ్వరికి టికెట్ ఇచ్చారు. కానీ.. రాజేశ్వరి మాత్రం ఘోరంగా ఓడిపోయారు. అప్పటి నుంచి తన రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడింది. అగమ్యగోచరంగా మారింది. అసలు.. 2024 ఎన్నికల సమయానికి తన అడ్రస్ ఉంటుందా? ఉండదా? అనే డౌట్ రంపచోడవరం రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది. రాజేశ్వరి 2017 లో టీడీపీలో చేరకుండా ఉండి ఉంటే.. ఇప్పుడు తన లైఫ్ వేరేలా ఉండేదని.. తన రాజకీయ భవిష్యత్తును తానే నాశనం చేసుకుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా.. చంద్రబాబును గుడ్డిగా నమ్మి పార్టీలో చేరినందుకు తనకు రాజకీయ భవిష్యత్తే లేకుండా పోయింది. ఒకే ఒక్క రాంగ్ స్టెప్ ఎంత దూరం వెళ్లిందో చూశారా? ఇలా ఒక్క రాజేశ్వరి మాత్రమే కాదు.. చాలామంది నేతలు ఒక్క టప్పటడుగు వేసి తమ రాజకీయ భవిష్యత్తును తమ చేజేతులారా నాశనం చేసుకున్నారు.
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్లో అత్యంత ఆసక్తికర మ్యాచ్లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
This website uses cookies.