Ashok Ganapathi Raju : గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు నియామకం
Ashok Ganapathi Raju : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో గోవా రాష్ట్రానికి గవర్నర్గా ఆంధ్రప్రదేశ్కు చెందిన సీనియర్ రాజకీయ నేత పూసపాటి అశోక్ గజపతి రాజును నియమించారు. ఆయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి చెందిన యాక్టివ్ మెంబర్గా కొనసాగుతున్నారు. కేంద్ర మంత్రిగా గతంలో సేవలందించిన అశోక్ గజపతిరాజు విజయనగరానికి చెందిన రాజకీయ కుటుంబానికి చెందినవారు. రాజకీయం, పరిపాలన అనుభవంతో పాటు విశాలమైన దృక్పథం ఉన్న ఆయనకు ఈ నియామకంతో మరో కీలక బాధ్యత వచ్చి చేరింది.
ఇక హర్యానా గవర్నర్గా బండారు దత్తాత్రేయ స్థానంలో ఆషింకుమార్ ఘోష్ను నియమించారు. ప్రొఫెసర్గా సేవలందించిన ఘోష్కు విద్యా రంగంలో విశేష అనుభవం ఉంది. అలాగే లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవిందర్ గుప్తా నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు రాష్ట్రాల పరిపాలనలో కీలక మార్పులకు దారితీయనున్నాయని భావిస్తున్నారు. పాలనా పరమైన అనుభవం గల ప్రముఖులను ఈ పదవుల్లోకి తీసుకోవడం ద్వారా కేంద్రం తగిన సమతుల్యత పాటించినట్టు తెలుస్తోంది.
Ashok Ganapathi Raju : గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు నియామకం
గవర్నర్ పదవిలో తెలుగువారు ఎక్కువగా సేవలందించిన ఘనతను కూడా కలిగి ఉన్నారు. ఇప్పటివరకు ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు వంటి ముఖ్యమైన రాష్ట్రాల్లో తెలుగువారు గవర్నర్లుగా నియమితులై బాధ్యతలు నిర్వహించారు. మొత్తం 20 మంది తెలుగు వ్యక్తులు గవర్నర్ పదవిలో ఆదేశాలకనుగుణంగా విధులు నిర్వర్తించారు. కొంతమంది ఏకకాలంలో ఒకేసారి వేర్వేరు రాష్ట్రాల్లో గవర్నర్లుగా వ్యవహరించిన ఘట్టాలు కూడా ఉన్నాయి. తాజాగా అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్గా నియమితులవ్వడం తెలుగు ప్రజల గర్వకారణంగా నిలిచింది.
తనకు పదవి కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) స్పష్టం చేశారు.…
ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(Police Recruitment Board)లో 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో…
Laptop | వైఫై పాస్వర్డ్ను మర్చిపోవడం సాధారణంగా జరిగేదే. పాస్వర్డ్ మరిచిపోయినప్పుడు ఎలా తెలుసుకోవాలో ఐడియా లేకపోతే కొంచెం ఇబ్బంది…
SIIMA | 'సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025' (సైమా 2025) ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా రెండు రోజుల…
ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డుగా బీసీసీఐకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఐపీఎల్తో బీసీసీఐ బాగానే దండుకుంది. ప్రస్తుతం బీసీసీఐ ఖాతాలో…
Ponguleti srinivas reddy | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు పథకంపై కీలక అభివృద్ధి చోటుచేసుకుంది.…
Bigg Boss 9 | ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచ్కు సమయం…
Coconut| ఖాళీ కడుపుతో కొబ్బరి తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరిలో…
This website uses cookies.