
#image_title
Assembly Unanimously Passed 3 Bills : తెలంగాణ శాసనసభలో మున్సిపల్, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులు, అలాగే అలోపతిక్ ప్రైవేట్ వైద్య సంరక్షణ సంస్థల చట్టాన్ని రద్దు చేసే బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ బిల్లులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సభలో ప్రవేశపెట్టారు. అనంతరం జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ.. ఆర్థిక అసమానతలు తొలగాలంటే ఉపాధి అవకాశాలు పెరగాలని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
Assembly Unanimously Passed 3 Bills
2018లో కేసీఆర్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ విధించిందని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా ఇలాంటి సీలింగ్ లేవని, తెలంగాణలో ఉన్న ఆ పరిమితిని తొలగించేందుకే సవరణ బిల్లు తీసుకొచ్చామని తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా బీసీలకు మరింత న్యాయం జరుగుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
అయితే ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలలో అపోహలు కలిగించేలా తప్పుడు సమాచారం ఇవ్వొద్దని ఆయన హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లపై పూర్తి వివరాలు సేకరించేందుకు బీసీ కమిషన్కు బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఉద్దేశపూర్వకంగా ప్రజల్లో అనుమానాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. “సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినప్పుడు చిత్తశుద్ధి చూపినట్లే, మా ప్రభుత్వం కూడా బీసీలకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధితో ఆర్డినెన్స్ తీసుకొచ్చింది” అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
pakistan : టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ఇంకా రెండు వారాల సమయం కూడా లేకపోయినా ఈ మెగా టోర్నీ…
Municipal Elections : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
Union Budget 2026 : దేశ ఆర్థిక దిశను నిర్దేశించే కేంద్ర బడ్జెట్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 1న…
Key Survey : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తన రెండున్నర ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో,…
Bank Holidays : జనవరి 27న దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లావాదేవీలకు అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా బ్యాంకులు…
Vizianagaram: మానవత్వ విలువలు రోజురోజుకు క్షీణిస్తున్నాయనే వాదనకు విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. కేవలం…
Samantha : సినిమా రంగంలో నటీమణులు పెళ్లి తర్వాత తమ ఇంటి పేరును మార్చుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. గతంలో…
Roja : చిత్తూరు జిల్లా నగరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన పర్యటనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే…
This website uses cookies.