
ktr clarification on bc reservations
పంచాయతీరాజ్ చట్టంలో బీసీ రిజర్వేషన్లపై సీలింగ్ విధించారన్న మంత్రి సీతక్క వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తిప్పికొట్టారు. శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఇది 100 శాతం అబద్ధం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడా సీలింగ్ అన్న పదం వాడలేదు. బీసీ రిజర్వేషన్ల విషయంలో తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. శాస్త్రీయంగా చట్టాలు చేస్తే న్యాయవ్యవస్థ అడ్డు రాదు” అని స్పష్టం చేశారు.
ఆర్టికల్ 243డీ6, టీ6 ప్రకారం రాష్ట్రాలు రిజర్వేషన్లు కల్పించుకోవచ్చని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం 396 జీవో ద్వారా 34 శాతం రిజర్వేషన్లు కల్పించిన విషయం వివరించారు. అయితే ఆ జీవో ఇచ్చిన వెంటనే మహబూబ్నగర్కు చెందిన గోపాల్ రెడ్డి హైకోర్టులో కేసు వేశారని, ఆయన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి బంధువని చెప్పారు. దీంతో రిజర్వేషన్ల ప్రక్రియ నిలిచిపోయిందని, అసలు సమస్య కాంగ్రెస్ పార్టీ నిర్వాకం వల్లే వచ్చిందని కేటీఆర్ ఆరోపించారు.
అలాగే 15 రోజులు సభ నడపకుండా ప్రభుత్వం పారిపోతుందని, అసలు విషయాలపై చర్చకు రాకుండా తప్పించుకుంటుందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ డబ్బులు బీహార్లో ప్రకటనలకు ఖర్చు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. న్యాయసమీక్షలో నిలబడలేని జీవోలతో బీసీలకు ఉపయోగం లేదని, పార్లమెంట్లో చేయాల్సిన చట్టాలను ఇక్కడ చేయడం వలన ప్రయోజనం ఉండదని ప్రశ్నించారు. “ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టని గవర్నర్, ఈ బిల్లుపై సంతకం ఎలా పెడతారు? ప్రజలను మోసం చేయడానికి ఇదంతా చేస్తున్నారు” అని కేటీఆర్ నిలదీశారు.
kondigari Ramulu : ఈ రోజుల్లో రాజకీయాల్లో ఒక్కసారి ప్రజాప్రతినిధిగా గెలిచినా చాలామంది నాయకులు ఆస్తులు, ఐశ్వర్యాలు కూడబెట్టుకునే ప్రయత్నం…
Nakirekal : నకిరేకల్ పట్టణంలో దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మంజూరు చేసిన ప్రత్యేక స్కూటీలను గౌరవ ఎమ్మెల్యే…
Vijay Jason vs Vijay : తమిళ సూపర్ స్టార్ విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు ఒక పెద్ద మలుపు…
Hyderabad : భాగ్యనగరం అంటేనే రకరకాల రుచులకు మరియు విందు వినోదాలకు పెట్టింది పేరు. దేశ విదేశాల నుండి పర్యాటకులు…
YS Jagan good news : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గెలుపోటముల సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో ఆశించిన…
Iran New Supreme : ఇరాన్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన…
Velidanda : గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామంలో గ్రామాభివృద్ధికి మరొక కీలకమైన అడుగు పడింది. గ్రామంలో నూతనంగా నిర్మించబోయే సీసీ…
Alekhya Reddy : నందమూరి తారకరత్న మరణం తర్వాత ఆయన భార్య అలేఖ్య రెడ్డి మొదటిసారి తన మనసులో మాటను…
Sanju Samson : భారత క్రికెట్ జట్టు మరోసారి ప్రపంచ వేదికపై తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ICC Men's T20…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తి ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు.…
students : ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి విద్యార్థులు పరీక్షల కోసం తుది సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులు చివరి…
Kerosene : ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు దేశీయ ఇంధన సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.…
This website uses cookies.