
Bairi Naresh comments about Yerravaram Bala Ugra Narasimha Swamy Temple
Bairi Naresh : తెలంగాణలో ఉన్న ఎర్రవరం బాలఉగ్రలక్ష్మీనరసింహస్వామి ఆలయం గురించి ప్రముఖ నాస్తికుడు బైరి నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ దగ్గరలోని ఎర్రవరం అనే గ్రామంలో ఒక గుట్టపై బాల ఉగ్ర నరసింహ స్వామి వెలిశాడని, ఆలయానికి వెళ్లి ఏం కోరుకుంటే అది జరుగుతుందని అక్కడి భక్తులు నమ్ముతున్నారు. అంతేకాకుండా అక్కడ పండు అనే బాలుడిపై ఉగ్ర నరసింహ స్వామి పూనడంతో అతడు ఏం చెబితే అది జరుగుతుందని చెబుతున్నారు. ఆ బాలుడు అక్కడ గుట్ట పైన బాల ఉగ్ర నరసింహ స్వామి వెలిశాడని చెప్పడంతో ఆ ఊరి ప్రజలంతా అక్కడికి వెళ్లి చూశారు. నిజంగానే గుట్టపై దేవుడు వెలిశాడని ప్రజలు పూజలు చేయడం ప్రారంభించారు.
అలాగే చాలా మంది తమ కోరికలు నెరవేరాయని కూడా చెప్పారు. అక్కడికి వెళ్లి ఏం కోరుకుంటే అది జరుగుతుందని చెప్పడంతో అది కాస్త వైరల్ అయింది. దీంతో చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలే కాదు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు బాల ఉగ్ర నరసింహ స్వామి దర్శించుకోవడానికి వెళుతున్నారు. ప్రతిరోజు అక్కడ లక్షల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే ఆ గుడిపై ప్రముఖ నాస్తికుడు బైరి నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు అక్కడ దేవుడు అనేది లేదన్నారు. బాల ఉగ్ర నరసింహ స్వామి అనేది అంతా బూటకం అన్నారు.
Bairi Naresh comments about Yerravaram Bala Ugra Narasimha Swamy Temple
పండు అనే వాడు నరసింహస్వామి అవతారం ఎత్తి రెండు నెలలు అవుతుంది. మరి మూడో నెల ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది అంటూ బైరి నరేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అలాగే భర్తతో కాపురం చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుందా లేక ఆ పండు స్వామి చెప్పాడని ప్రెగ్నెంట్ రావడం ఏంటి అని ప్రశ్నించారు. అలాగే ఇంకా చాలామంది గుడికి వచ్చాక నాకు క్యాన్సర్ తగ్గిపోయిందని, నాపై ఉన్న కేసులు అన్ని తొలగిపోయాయని చెబుతున్నారు. మీరు ఎప్పటినుంచో ఆ కేసు గురించి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇప్పుడు అది సాల్వ్ అయింది. అంతేకానీ దేవుడు ఏం చేయలేదు అని అన్నారు. వంద ఛానల్స్ ఆ ఉగ్ర నరసింహ స్వామి గురించి చెప్పారు కానీ తెర వెనుక అసలు ఏం జరుగుతుందో చెప్పరు.
PAK vs USA: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్తాన్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. గ్రూప్-A లో…
Congress Party : మున్సిపల్ ఎన్నికల చివరి రోజు ప్రచారంలో భాగంగా మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్తృతంగా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా ఏ ప్రభుత్వంలోనైనా ముఖ్యమంత్రి…
Ram Charan Upasana twins : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ mega power star Ram Charan …
Ys Jagan : తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. ముఖ్యంగా…
Xiaomi 17T Pro : కొత్త స్మార్ట్ఫోన్ కొనాలని అనుకుంటున్న వారికి ఇది నిజంగా సూపర్ న్యూస్. ప్రముఖ మొబైల్…
AI : నేటి ఆధునిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం పెరగడంతో చాలామంది తమ ఉద్యోగాల భవిష్యత్తు గురించి…
Vivo T3 FE 5G review : ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం వివో (Vivo) భారత మార్కెట్లో మరో విప్లవాత్మక…
This website uses cookies.