Bairi Naresh : తెలంగాణలో ఉన్న ఎర్రవరం బాలఉగ్రలక్ష్మీనరసింహస్వామి ఆలయం గురించి ప్రముఖ నాస్తికుడు బైరి నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ దగ్గరలోని ఎర్రవరం అనే గ్రామంలో ఒక గుట్టపై బాల ఉగ్ర నరసింహ స్వామి వెలిశాడని, ఆలయానికి వెళ్లి ఏం కోరుకుంటే అది జరుగుతుందని అక్కడి భక్తులు నమ్ముతున్నారు. అంతేకాకుండా అక్కడ పండు అనే బాలుడిపై ఉగ్ర నరసింహ స్వామి పూనడంతో అతడు ఏం చెబితే అది జరుగుతుందని చెబుతున్నారు. ఆ బాలుడు అక్కడ గుట్ట పైన బాల ఉగ్ర నరసింహ స్వామి వెలిశాడని చెప్పడంతో ఆ ఊరి ప్రజలంతా అక్కడికి వెళ్లి చూశారు. నిజంగానే గుట్టపై దేవుడు వెలిశాడని ప్రజలు పూజలు చేయడం ప్రారంభించారు.
అలాగే చాలా మంది తమ కోరికలు నెరవేరాయని కూడా చెప్పారు. అక్కడికి వెళ్లి ఏం కోరుకుంటే అది జరుగుతుందని చెప్పడంతో అది కాస్త వైరల్ అయింది. దీంతో చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలే కాదు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు బాల ఉగ్ర నరసింహ స్వామి దర్శించుకోవడానికి వెళుతున్నారు. ప్రతిరోజు అక్కడ లక్షల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే ఆ గుడిపై ప్రముఖ నాస్తికుడు బైరి నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు అక్కడ దేవుడు అనేది లేదన్నారు. బాల ఉగ్ర నరసింహ స్వామి అనేది అంతా బూటకం అన్నారు.
పండు అనే వాడు నరసింహస్వామి అవతారం ఎత్తి రెండు నెలలు అవుతుంది. మరి మూడో నెల ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది అంటూ బైరి నరేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అలాగే భర్తతో కాపురం చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుందా లేక ఆ పండు స్వామి చెప్పాడని ప్రెగ్నెంట్ రావడం ఏంటి అని ప్రశ్నించారు. అలాగే ఇంకా చాలామంది గుడికి వచ్చాక నాకు క్యాన్సర్ తగ్గిపోయిందని, నాపై ఉన్న కేసులు అన్ని తొలగిపోయాయని చెబుతున్నారు. మీరు ఎప్పటినుంచో ఆ కేసు గురించి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇప్పుడు అది సాల్వ్ అయింది. అంతేకానీ దేవుడు ఏం చేయలేదు అని అన్నారు. వంద ఛానల్స్ ఆ ఉగ్ర నరసింహ స్వామి గురించి చెప్పారు కానీ తెర వెనుక అసలు ఏం జరుగుతుందో చెప్పరు.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.