Bairi Naresh : ఎర్రవరం అంతా ఒక బూటకం.. పండు స్వామి వాడు దేవుడు ఏంటి — నాస్తికుడు బైరి నరేష్ ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bairi Naresh : ఎర్రవరం అంతా ఒక బూటకం.. పండు స్వామి వాడు దేవుడు ఏంటి — నాస్తికుడు బైరి నరేష్ ..!!

Bairi Naresh : తెలంగాణలో ఉన్న ఎర్రవరం బాలఉగ్రలక్ష్మీనరసింహస్వామి ఆలయం గురించి ప్రముఖ నాస్తికుడు బైరి నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ దగ్గరలోని ఎర్రవరం అనే గ్రామంలో ఒక గుట్టపై బాల ఉగ్ర నరసింహ స్వామి వెలిశాడని, ఆలయానికి వెళ్లి ఏం కోరుకుంటే అది జరుగుతుందని అక్కడి భక్తులు నమ్ముతున్నారు. అంతేకాకుండా అక్కడ పండు అనే బాలుడిపై ఉగ్ర నరసింహ స్వామి పూనడంతో అతడు ఏం చెబితే అది జరుగుతుందని చెబుతున్నారు. ఆ […]

 Authored By aruna | The Telugu News | Updated on :18 August 2023,5:00 pm

Bairi Naresh : తెలంగాణలో ఉన్న ఎర్రవరం బాలఉగ్రలక్ష్మీనరసింహస్వామి ఆలయం గురించి ప్రముఖ నాస్తికుడు బైరి నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ దగ్గరలోని ఎర్రవరం అనే గ్రామంలో ఒక గుట్టపై బాల ఉగ్ర నరసింహ స్వామి వెలిశాడని, ఆలయానికి వెళ్లి ఏం కోరుకుంటే అది జరుగుతుందని అక్కడి భక్తులు నమ్ముతున్నారు. అంతేకాకుండా అక్కడ పండు అనే బాలుడిపై ఉగ్ర నరసింహ స్వామి పూనడంతో అతడు ఏం చెబితే అది జరుగుతుందని చెబుతున్నారు. ఆ బాలుడు అక్కడ గుట్ట పైన బాల ఉగ్ర నరసింహ స్వామి వెలిశాడని చెప్పడంతో ఆ ఊరి ప్రజలంతా అక్కడికి వెళ్లి చూశారు. నిజంగానే గుట్టపై దేవుడు వెలిశాడని ప్రజలు పూజలు చేయడం ప్రారంభించారు.

అలాగే చాలా మంది తమ కోరికలు నెరవేరాయని కూడా చెప్పారు. అక్కడికి వెళ్లి ఏం కోరుకుంటే అది జరుగుతుందని చెప్పడంతో అది కాస్త వైరల్ అయింది. దీంతో చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలే కాదు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు బాల ఉగ్ర నరసింహ స్వామి దర్శించుకోవడానికి వెళుతున్నారు. ప్రతిరోజు అక్కడ లక్షల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే ఆ గుడిపై ప్రముఖ నాస్తికుడు బైరి నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు అక్కడ దేవుడు అనేది లేదన్నారు. బాల ఉగ్ర నరసింహ స్వామి అనేది అంతా బూటకం అన్నారు.

Bairi Naresh comments about Yerravaram Bala Ugra Narasimha Swamy Temple

Bairi Naresh comments about Yerravaram Bala Ugra Narasimha Swamy Temple

పండు అనే వాడు నరసింహస్వామి అవతారం ఎత్తి రెండు నెలలు అవుతుంది. మరి మూడో నెల ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది అంటూ బైరి నరేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అలాగే భర్తతో కాపురం చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుందా లేక ఆ పండు స్వామి చెప్పాడని ప్రెగ్నెంట్ రావడం ఏంటి అని ప్రశ్నించారు. అలాగే ఇంకా చాలామంది గుడికి వచ్చాక నాకు క్యాన్సర్ తగ్గిపోయిందని, నాపై ఉన్న కేసులు అన్ని తొలగిపోయాయని చెబుతున్నారు. మీరు ఎప్పటినుంచో ఆ కేసు గురించి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇప్పుడు అది సాల్వ్ అయింది. అంతేకానీ దేవుడు ఏం చేయలేదు అని అన్నారు. వంద ఛానల్స్ ఆ ఉగ్ర నరసింహ స్వామి గురించి చెప్పారు కానీ తెర వెనుక అసలు ఏం జరుగుతుందో చెప్పరు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది