Home » Exclusive » Bandi Sanjay In Nagarjuna Sagar Bypoll Campaign
Exclusive

Bandi Sanjay : తెలంగాణ ఉద్యమంలో నువ్వెక్కడున్నావ్ కేటీఆర్… నేనెవరో నీ అయ్యను అడుగు.. బండి సంజయ్ ఫైర్?

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: April 15, 2021 10:55 pm
Advertisement

Bandi Sanjay : హమ్మయ్య… నాగార్జున సాగర్ ఉపఎన్నిక ప్రచారం అయితే ముగిసింది. ఇక మిగిలింది ఎన్నికలే. ఈనెల 17న సాగర్ ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. అన్ని పార్టీలు అయితే ప్రచారాన్ని జోరుగా సాగించి ముగించాయి. నాగార్జునసాగర్ లో బలంగా ఉన్న ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, కాంగ్రెస్ కంటే… బీజేపీ ఈసారి ఎన్నికల ప్రచారంలో జోరు పెంచింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు… తెలంగాణ ఫైర్ బ్రాండ్ విజయశాంతి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బండి సంజయ్ గురించి తెలిసిందే కదా. ఆయన మాట్లాడితే మామూలుగా ఉండదు. అసలే ఎన్నికల ప్రచారం.. ఇంకెలా ఉంటది… సాగర్ ఉపఎన్నిక ప్రచారం చివరి రోజును బండి సంజయ్ రెచ్చిపోయారు. అధికార పార్టీ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

bandi sanjay in nagarjuna sagar bypoll campaign

ఎన్నికల ప్రచారం చివరి రోజున బీజేపీ తరుపున.. బండి సంజయ్ తో పాటు విజయశాంతి, మాజీ ఎంపీ వివేక్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్… మంత్రి కేటీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఎక్కడ ఉన్నావ్. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు… అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో? బండి సంజయ్ ఎవరో తెలియదు అని అంటున్నావు కదా… నీ అయ్యను అడుగు… బండి సంజయ్ ఎవరో చెబుతాడు… అంటూ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మంత్రి కేటీఆర్ పై విరుచుకుపడ్డారు..

Advertisement

Bandi Sanjay : ఇద్దరు ఎంపీలతోనే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణను తీసుకొచ్చిందా?

కేవలం ఇద్దరు ఎంపీలు ఉన్న టీఆర్ఎస్ పార్టీ.. తెలంగాణను తెచ్చిందా? పార్లమెంట్ లో సుష్మా స్వరాజ్… తెలంగాణకు మద్దతు ఇచ్చారు… ఆ విషయం మీకు గుర్తు లేదా? కేంద్రం ఇచ్చిన నిధులతోనే తెలంగాణలోని గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోంది. కేంద్రం అభివృద్ధి చేయాలంటూ డబ్బులు ఇస్తే.. కేసీఆర్ మాత్రం పెగ్గులు వేస్తున్నాడు. సాగర్ లో అభివృద్ధి మాత్రం చేయలేదు. కేంద్రం తెలంగాణకు ఎన్ని కోట్లు ఇచ్చిందో అన్ని లెక్కలు నా దగ్గర ఉన్నాయి.. అన్నీ చెబుతా. కేంద్రం నిధులతో మరుగు దొడ్లను నిర్మిస్తే… వాటిపై కేసీఆర్ బొమ్మలు పెట్టుకున్నారు. ఈనెల 17న ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. కేసీఆర్ అవినీతి, అక్రమాలు అన్నీ బయటపెట్టి జైలుకు పంపిస్తాం.. అని బండి సంజయ్ హెచ్చరించారు.

బీజేపీ సాగర్ అభ్యర్థి రవి కుమార్ నాయక్.. పేద బిడ్డ. బీజేపీ అంటేనే బడుగు, బలహీన వర్గాల పార్టీ. ఇక్కడ పేదోళ్లకు… పెద్దలకు మధ్య జరుగుతున్న పోరు ఇది. ప్రజలు ఎటు ఉంటారో ఆలోచించుకోండి. టీఆర్ఎస్ నేతలు అయితే సాగర్ లో ఎక్కడ చూసినా మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. దుబ్బాకలో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో యువత తమ సత్తా చాటింది. అలాగే సాగర్ కూడా మీ సత్తా చాటండి… రవి నాయక్ ను గెలిపించండి.. ఆ తర్వాత హాలియాలో విజయోత్సవ సభను నిర్వహించుకుందాం.. అని బండి సంజయ్ సాగర్ ప్రజలను కోరారు.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి