Bandi Sanjay: బండి సంజయ్ ఏంటి.. అలా అనేశారు.. కేటీఆర్ సీఎం అయితే నిజంగా అలాగే జరుగుతుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bandi Sanjay: బండి సంజయ్ ఏంటి.. అలా అనేశారు.. కేటీఆర్ సీఎం అయితే నిజంగా అలాగే జరుగుతుందా?

ప్రస్తుతం తెలంగాణలో ఒకటే చర్చ. అది తెలంగాణ ముఖ్యమంత్రిగా త్వరలో కేటీఆర్ పట్టాభిషేకం. అసలు.. చరిత్రలోనే ఎవ్వరూ చేయని పని ఇది. ఒక తండ్రి.. తన కొడుకుకు ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించడం అనేది ఇప్పుడే చరిత్ర సృష్టించనుంది. అందుకే తెలంగాణ రాజకీయాల్లో ఈ టాపిక్ హాట్ టాపిక్ గా మారింది. అయితే.. నిజంగానే కేటీఆర్ ను కేసీఆర్ ముఖ్యమంత్రిని చేస్తున్నారా? లేదా? అనేదానిపై స్పష్టత లేనప్పటికీ.. ప్రచారం మాత్రం జోరందుకుంది. ఈ నేపథ్యంలో సందు దొరికింది కదా.. […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :22 January 2021,7:37 pm

ప్రస్తుతం తెలంగాణలో ఒకటే చర్చ. అది తెలంగాణ ముఖ్యమంత్రిగా త్వరలో కేటీఆర్ పట్టాభిషేకం. అసలు.. చరిత్రలోనే ఎవ్వరూ చేయని పని ఇది. ఒక తండ్రి.. తన కొడుకుకు ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించడం అనేది ఇప్పుడే చరిత్ర సృష్టించనుంది. అందుకే తెలంగాణ రాజకీయాల్లో ఈ టాపిక్ హాట్ టాపిక్ గా మారింది. అయితే.. నిజంగానే కేటీఆర్ ను కేసీఆర్ ముఖ్యమంత్రిని చేస్తున్నారా? లేదా? అనేదానిపై స్పష్టత లేనప్పటికీ.. ప్రచారం మాత్రం జోరందుకుంది.

bandi sanjay sensational comments on ktr cm post

bandi sanjay sensational comments on ktr cm post

ఈ నేపథ్యంలో సందు దొరికింది కదా.. అని ప్రతిపక్షాలు టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడుతున్నాయి. అలా ఎలా కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తారంటూ విమర్శిస్తున్నారు కానీ.. వాళ్లను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అయితే.. తెలంగాణలో సీఎం కేసీఆర్ ను విమర్శించే దమ్మున్న నాయకుల్లో బండి సంజయ్ ఒకరు. ఆయన ఎప్పుడూ సీఎం కేసీఆర్ ను తీవ్రంగా విమర్శిస్తుంటారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఓడించి.. బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ సవాల్ విసురుతుంటారు. మరోసారి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఈ సారి త్వరలో ముఖ్యమంత్రి కాబోయే కేటీఆర్ మీద తన విమర్శనాస్త్రాలు ప్రదర్శించారు.

కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తెలంగాణలో అణుబబాంబు పేలడమే?

కేసీఆర్… కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడం కోసమే.. తన ఫామ్ హౌస్ లో దోష నివారణ పూజను నిర్వహించారు. పూజ చేసిన వస్తువులను తీసుకెళ్లి.. త్రివేణి సంగమంలో కలిపారు. అందుకే కాళేశ్వరం పర్యటన అంటూ కొత్త నాటకం ఆడారు. కానీ.. కాళేశ్వరం వెళ్లింది తన సొంత పనికోసం. ఇక.. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే మాత్రం తెలంగాణలో ఆటమ్ బాంబ్ కాదు.. ఏకంగా అణుబాంబే పేలుతుంది.. అంటూ బండి సంజయ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇదంతా ఒక డ్రామా

కేటీఆర్ ముఖ్యమంత్రి.. అంటూ బయట జరుగుతున్న ప్రచారం అంతా ఒక డ్రామా. కేసీఆర్ మీద ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో.. టీఆర్ఎస్ నేతలు పార్టీని వీడి పోకుండా ఉండేందుకు.. కేటీఆర్ ముఖ్యమంత్రి అంటూ కొత్త డ్రామాకు తెరలేపారు. టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్.. రెండూ దొందు దొందే… తోడు దొంగలే అంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది