Facebook : ప్రస్తుతం చాలామంది యువత తప్పు ద్రోవ పడుతున్నారు. ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఫేస్ బుక్ ద్వారా ఒక యువకుడు దారుణంగా మోసపోయాడు. చిత్తూరుకు చెందిన యువకుడు ఇచ్చిన కంప్లైంట్ తో స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసు వర్గాలు చెప్పిన వివరాల ప్రకారం చిత్తూరులోని రవిబాబు స్వీట్ షాప్ నడుపుతున్నాడు. అతని కొడుకు 28 ఏళ్ల వైష్ణవకు ఫేస్ బుక్ లో ఒక అమ్మాయి పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి అమ్మాయితో పెళ్లికి కూడా సిద్ధమయ్యారు. కులాలు వేరైనా పెద్దల అనుమతితో గతేడాది నవంబర్లో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు.
మార్చి 10న పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి అవసరాల కోసం, యువతి కోసం వైష్ణవ్ 28 లక్షలు ఖర్చు చేశాడు. ఎంగేజ్మెంట్ కు 15 లక్షల బంగారం, రెండు లక్షల విలువైన డైమండ్ రింగ్, పెళ్లి తర్వాత చిత్తూరులో విందు, ఇతర పనుల కోసం 30 లక్షలు ఖర్చు చేశారు. అయితే తాజాగా ఆ అమ్మాయి వైష్ణవ్ కు ఫోన్ చేసి ఏడు లక్షలు తీసుకురమ్మని చెప్పింది. ఐదు లక్షలు తీసుకొని వెళ్ళిన అతనికి మిగిలిన రెండు లక్షలు తీసుకురావాలని వైష్ణవ్ తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో తండ్రి కొడుకులు ఇద్దరు యువతి ఇంటికి వెళ్ళగా, తమ స్థాయికి తగ్గ సంబంధం కాదని పెళ్లి చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పారు. దీంతో ఇద్దరు షాక్ అయిపోయారు.
అంతేకాకుండా ఆ యువతి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. అందుకు ప్రతిగా పెళ్లి కొడుకు చిత్తూరులో ఫిర్యాదు చేశాడు. సదరు యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వైష్ణవ్ మద్యం తాగి సంగీత్ వేడుకలో మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించాడని అడ్డుకున్న తనవారిపై దాడి చేసినట్లుగా తెలిపారు. దీంతో కంప్లైంట్ తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. కంప్లైంట్ తీసుకున్న పోలీసులు ఉమ్మడిగా విచారిస్తున్నారు. ఇలాంటి ఉదంతాల్లో అసలైన బాధితులు అస్సలు నష్టపోకూడదు అన్నమాట వినిపిస్తుంది. ఏది ఏమైనా అతను ఆమె కోసం అన్ని కోట్లు ఖర్చు చేయడం ఆశ్చర్యంగా ఉంది. ఈ కేసు పై ఇంకా తదుపరి విచారణ జరగాల్సి ఉంది.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.