Bharat Rice
Bharat Rice : తాజాగా భారత దేశంలో కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ పేరుతో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నాణ్యమైన బియ్యాన్ని సబ్సిడీపై కేవలం 29 రూపాయలకే అందించడం జరుగుతుంది. అయితే ఇంత సరసమైన ధరతో సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఈ బియ్యాన్ని తీసుకురావడంతో ఈ బియ్యానికి డిమాండ్ విపరీతంగా పెరిగింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ బియ్యాన్ని ఆన్లైన్ లో ఎలా కొనుగోలు చేయాలి అనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఇక పూర్తిగా వివరాల్లోకి వెళితే. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ , అలాగే నేషనల్ కో-ఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనే రెండు సహకార సంఘాలు 5 లక్షల టన్నుల బియ్యాన్ని సరఫరా చేసేందుకు చూస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఏజెన్సీలో ఈ బియ్యాన్ని ఐదు కిలోలు మరియు 10 కిలోల చొప్పున ప్యాక్ చేస్తున్నాయి. ఇక వాటిని అవుట్ లెట్స్ ద్వారా భారత్ బ్రాండ్ తో రిటైల్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు అదనంగా భారత రైస్ ను ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ద్వారా కూడా విక్రయించేందుకు ప్రణాళికల సిద్ధం చేస్తున్నాయి. ఇక దీనికి సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో భారత్ రైస్ ను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగల వినియోగదారులందరూ అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ లను ఆశ్రయిస్తున్నారు.
అయితే నిజానికి ప్రస్తుతం భారత్ రైస్ ను ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ లో అమ్మకానికి జాబితా సిద్ధం చేయలేదని చెప్పాలి. అయితే ఇది జియో మార్ట్ వెబ్ సైట్ లో జాబితా చేయబడినప్పటికీ అమ్మకానికి ఇంకా ప్రారంభం మాత్రం చేయలేదు. బెంగళూరు ముంబై చెన్నై ఢిల్లీ మరియు కోల్ కత్తా వంటి వివిధ పిన్ కోడ్ ప్రయత్నాలు చేసినప్పటికీ ఆర్డర్ ఇవ్వడానికి ప్రయత్నించే వినియోగదారులు ఉత్పత్తి లభ్యతను సూచిస్తూ నోటిఫికేషన్లను అందుకుంటున్నారు. అలాగే ఎన్.ఏ.ఎఫ్.ఈ.డి అధికారిక వెబ్ సైట్ లో కూడా ఆన్ లైన్ విక్రయాలు ఇంకా ప్రారంభం కాలేదు. మరి ఈ భారత్ రైస్ ఆన్లైన్ ద్వారా విక్రయించేందుకు సన్నహాలు జరుగుతున్నప్పటికీ ఎప్పుడు అందుబాటులో ఉంటాయి అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.