bihar man Brahma Dev taken 11 doses of corona vaccine
Corona Vaccine : కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవడమే శ్రేయస్కరమని ప్రభుత్వం చెబుతోన్న విషయం తెలిసిందే. ఈ మాటకు అనుగుణంగా ఇప్పటికే దేశంలో కొంత మంది తమ రెండు డోసులను పూర్తి చేసుకోగా.. ఇంకా అనేక మంది ఒక డోసుతోనే సరి పెడుతున్నారు. సమయం లేదనే, బద్దకంతోనో, భయంతోనే వ్యాక్సిన్ జోలికి పోవడం లేదు. అయితే ఇందుకు విచిత్రంగా ఓ వృద్దుడు మాత్రం మూడు కాదు నాలుగు కాదు ఏకంగా 11 సార్లు కరోనా టీకా డోసులు వేయించుకున్నాడు. బీహార్ లోని ఈ వృద్ధుని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
బీహార్ మాధేపుర జిల్లాకు చెందిన వృద్ధుడు బ్రహ్మదేవ్ మండల్(84)… తాను కరోనా టీకా 11 డోసులు తీసుకున్నానని చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. టీకా వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అందువల్లే తాను వీలైనన్ని ఎక్కువసార్లు వేసుకున్నానని వివరించారు. అంతటితో ఆగక.. తాను మరో డోసు తీసుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మంగళవారం నాడు 12 వ డోసు తీసుకునేందుకు వచ్చిన బ్రహ్మ దేవ్… అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో.. టీకాల కార్యక్రమం ముగియడంతో విచారం వ్యక్తం చేశాడు.
bihar man Brahma Dev taken 11 doses of corona vaccine
బ్రహ్మ దేవ్ మాటలు విన్న వైద్య సిబ్బంది అతనిని ఆరా తీయగా వారికి ఊహించని విషయాలు తెలియడంతో ఒక్కసారిగా అవక్కాయ్యారు. బ్రహ్మ దేవ్ తన తొలి డోసును 13 ఫిబ్రవరి, 2021న తీసుకున్నారని తెలిపారు. అప్పటి నుంచి వరుసగా 2021 డిసెంబరు వరకు 11 డోసులు పొందారు. ఇదిలా ఉంచితే ఆయన ఏయే తేదీల్లో టీకా తీసుకున్నది కూడా రాసి పెట్టు కోవడం విశేషం. బ్రహ్మ దేవ్ గతంలో ఈ వృద్దుడు పోస్టల్ శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందాడట. అయితే ఏది ఏమైనప్పటికీ ఇప్పుడీ వృద్దుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. తమకు రెండో డోసుకే దిక్కు లేదు.. మీకు 11 డోసులు ఎవరిచ్చారు సామీ అంటూ కామెడీగా కామెంట్లు పెడుతున్నారు.
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
This website uses cookies.