
bjp and janasena working together on ramatheertham issue
ఏపీ ప్రస్తుతం జరుగుతున్న చర్చ అంటే ఒకటే. అదే రామతీర్థం ఘటన. రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన రాష్ట్రాన్ని అట్టుడికించింది. జాతీయంగానూ ఈ ఘటన చర్చకు దారితీసింది. రాష్ట్రంలో ఎన్నో గుళ్ల మీద దాడి జరిగినప్పటికీ.. ఈ ఘటన మాత్రం కొంచెం సీరియస్ అయింది. చివరకు చంద్రబాబు కూడా అక్కడికి వచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ.. రామతీర్థం ఘటనను ఏపీ ప్రజలు మరిచిపోలేకపోతున్నారు.
bjp and janasena working together on ramatheertham issue
ఇక.. ఏపీలోని ప్రధాన పార్టీలు కూడా రచ్చ రచ్చ చేశాయి. బీజేపీ అయితే ఏకంగా రాముడి గుడి వద్దకే వెళ్లి అక్కడ ఆందోళన నిర్వహించింది. ఆ ఆందోళనలో జనసేన కూడా పాల్గొన్నది. ప్రభుత్వం కూడా ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తును ఆదేశించింది.
కానీ.. అక్కడితో ఏం అయిపోలేదు. ముందున్నది మొసళ్ల పండుగ. బీజేపీ ఈ ఘటనపై కొన్ని రోజులు హడావుడి చేసి పక్కకు జరిగినా.. జనసేన మాత్రం ఈ ఘటనను వదలట్లేదు.
ఏపీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని జనసేన తెగ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే.. రామతీర్థం ఘటనను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని ముందడుగు వేసి.. ఉత్తరాంధ్ర జిల్లాల వరకు జనసేనకు చెందిన నలుగురు పార్టీ నేతలతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ.. రామతీర్థం ఘటన మీద పోరాటం చేస్తుందని జనసేన ప్రకటించింది.
అంటే.. రామతీర్థం ఘటనను ప్రజలు వదిలినా.. రాజకీయ పార్టీలు వదిలేలా లేవు. చూద్దాం మరి.. ఇది ఇంకా ఎంతదూరం వెళ్తుందో?
Zodiac Signs : వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రోజు.. 29 జనవరి 2026, గురువారం ఏ రాశి…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన 'ఆటవిక రాజ్యం'లా మారిందని, ప్రజా ప్రతినిధులు బరితెగించి వ్యవహరిస్తున్నారని…
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
This website uses cookies.