
bjp leader vijayashanthi asks telangana govt over night curfew
Vijayashanthi : తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 20 నుంచి రాత్రి పూట కర్ఫ్యూను విధించింది. అంటే.. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. ఈసమయంలో అత్యవసరమైన వాటి కోసం తప్పితే మరే దేనికి కూడా బయటికి వెళ్లొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే…. పగటి పూట ఎటువంటి నియంత్రణలు లేకుండా….. కేవలం రాత్రి పూట కర్ఫ్యూను పెట్టి చేతులు దులుపుకున్న ప్రభుత్వం… దీని వల్ల సాధించేదేంటి… అంటూ బీజేపీ నేత విజయశాంతి ప్రశ్నించారు.
bjp leader vijayashanthi asks telangana govt over night curfew
కరోనా బారిన పడిన సీఎం కేసీఆర్… అంతకుముందు మాస్క్ లేకుండా సమీక్షలు నిర్వహించి.. సభల్లో పాల్గొని… ఆ ఫోటోలు మీడియాలో, సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. సీఎం కేసీఆర్ ను చూసి… మంత్రులు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు… అందరూ ఆయన బాటలోనే నడుస్తూ నిర్లక్ష్యానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది అని తెలిసాక కూడా ఒక ముఖ్యమంత్రి ఎందుకు కరోనా మహమ్మారిని లైట్ తీసుకున్నారని విజయశాంతి ట్విట్టర్ ద్వారా కేసీఆర్ ను ప్రశ్నించారు. మాస్క్ లు పెట్టుకోకుండా బయట తిరిగే ప్రజలకు కాదు ఫైన్ వేసేది… మాస్క్ లు లేకుండా సభలు, మీటింగ్ లు నిర్వహించిన కేసీఆర్ కు ముందు ఫైన్ వేయాలి అంటూ విజయశాంతి స్పష్టం చేశారు.
తెలంగాణలో కరోనా కట్టడికి సంబంధించి ప్రభుత్వంపై హైకోర్టు సంధించిన ప్రశ్నలను చూస్తుంటే రాష్ట్రంలో అసలు పాలన జరుగుతోందా? అనే అనుమానం కలుగుతోంది. తెలంగాణలో పాలన పూర్తిగా స్తంభించిపోయిందని అర్థమవుతోంది. కరోనా టెస్టుల నిర్వహణ, కరోనా నియంత్రణ కోసం తీసుకుంటన్న చర్యలపై గత సంవత్సరం కూడా ఇలాగే ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. అప్పుడూ హైకోర్టు చాలాసార్లు ప్రభుత్వంపై సీరియస్ అయింది. అయినప్పటికీ తెలంగాణ సర్కారు మాత్రం తన తీరును మార్చుకోవడం లేదు. విద్యా సంస్థలను మాత్రం ముందే మూసేశారు. సభలు, ర్యాలీలు, వైన్ షాపులు, పబ్ లు, క్లబ్ లు… ఇవన్నీ మాత్రం ఓపెన్ చేసే ఉంచారు. గుంపులు గుంపులుగా తిరుగుతున్న జనాలను మాత్రం కట్టడి చేయరు. బెడ్స్ కొరత ఉన్నా పట్టించుకోరు. కోర్టు ప్రశ్నలు అడిగితే నీళ్లు నములుతారు. మీదగ్గర సరైన సమాచారం లేదు కాబట్టే కదా…. ప్రభుత్వం మిమ్మల్ని నిలదీసింది. సరిగ్గా సంవత్సరం క్రితం ఏ తప్పులు జరిగాయో… అవే తప్పులు మళ్లీ జరుగుతున్నాయి. తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చింది… అనే విషయాన్ని ప్రభుత్వం ఎందుకు ఇంకా తెలుసుకోవడం లేదు… ఎందుకు గుణపాఠం నేర్చుకోవడం లేదు… అంటూ విజయశాంతి ప్రశ్నించారు.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.