
bjp leader vijayashanthi asks telangana govt over night curfew
Vijayashanthi : తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 20 నుంచి రాత్రి పూట కర్ఫ్యూను విధించింది. అంటే.. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. ఈసమయంలో అత్యవసరమైన వాటి కోసం తప్పితే మరే దేనికి కూడా బయటికి వెళ్లొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే…. పగటి పూట ఎటువంటి నియంత్రణలు లేకుండా….. కేవలం రాత్రి పూట కర్ఫ్యూను పెట్టి చేతులు దులుపుకున్న ప్రభుత్వం… దీని వల్ల సాధించేదేంటి… అంటూ బీజేపీ నేత విజయశాంతి ప్రశ్నించారు.
bjp leader vijayashanthi asks telangana govt over night curfew
కరోనా బారిన పడిన సీఎం కేసీఆర్… అంతకుముందు మాస్క్ లేకుండా సమీక్షలు నిర్వహించి.. సభల్లో పాల్గొని… ఆ ఫోటోలు మీడియాలో, సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. సీఎం కేసీఆర్ ను చూసి… మంత్రులు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు… అందరూ ఆయన బాటలోనే నడుస్తూ నిర్లక్ష్యానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది అని తెలిసాక కూడా ఒక ముఖ్యమంత్రి ఎందుకు కరోనా మహమ్మారిని లైట్ తీసుకున్నారని విజయశాంతి ట్విట్టర్ ద్వారా కేసీఆర్ ను ప్రశ్నించారు. మాస్క్ లు పెట్టుకోకుండా బయట తిరిగే ప్రజలకు కాదు ఫైన్ వేసేది… మాస్క్ లు లేకుండా సభలు, మీటింగ్ లు నిర్వహించిన కేసీఆర్ కు ముందు ఫైన్ వేయాలి అంటూ విజయశాంతి స్పష్టం చేశారు.
తెలంగాణలో కరోనా కట్టడికి సంబంధించి ప్రభుత్వంపై హైకోర్టు సంధించిన ప్రశ్నలను చూస్తుంటే రాష్ట్రంలో అసలు పాలన జరుగుతోందా? అనే అనుమానం కలుగుతోంది. తెలంగాణలో పాలన పూర్తిగా స్తంభించిపోయిందని అర్థమవుతోంది. కరోనా టెస్టుల నిర్వహణ, కరోనా నియంత్రణ కోసం తీసుకుంటన్న చర్యలపై గత సంవత్సరం కూడా ఇలాగే ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. అప్పుడూ హైకోర్టు చాలాసార్లు ప్రభుత్వంపై సీరియస్ అయింది. అయినప్పటికీ తెలంగాణ సర్కారు మాత్రం తన తీరును మార్చుకోవడం లేదు. విద్యా సంస్థలను మాత్రం ముందే మూసేశారు. సభలు, ర్యాలీలు, వైన్ షాపులు, పబ్ లు, క్లబ్ లు… ఇవన్నీ మాత్రం ఓపెన్ చేసే ఉంచారు. గుంపులు గుంపులుగా తిరుగుతున్న జనాలను మాత్రం కట్టడి చేయరు. బెడ్స్ కొరత ఉన్నా పట్టించుకోరు. కోర్టు ప్రశ్నలు అడిగితే నీళ్లు నములుతారు. మీదగ్గర సరైన సమాచారం లేదు కాబట్టే కదా…. ప్రభుత్వం మిమ్మల్ని నిలదీసింది. సరిగ్గా సంవత్సరం క్రితం ఏ తప్పులు జరిగాయో… అవే తప్పులు మళ్లీ జరుగుతున్నాయి. తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చింది… అనే విషయాన్ని ప్రభుత్వం ఎందుకు ఇంకా తెలుసుకోవడం లేదు… ఎందుకు గుణపాఠం నేర్చుకోవడం లేదు… అంటూ విజయశాంతి ప్రశ్నించారు.
Gautam Gambhir : భారత జట్టు టీ20 ప్రపంచకప్ 2026 టైటిల్ను కైవసం చేసుకున్న శుభతరుణంలో, కోచ్ గౌతమ్ గంభీర్…
T20 World Cup 2026 : అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్…
T20 World Cup 2026 : ప్రపంచ టీ20 క్రికెట్ కప్లో భారత జట్టు ఘన విజయం సాధించడం దేశవ్యాప్తంగా…
Nara Brahmani : విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ తెలుగు…
TKGKS Maha Dharna : మార్చి 17న ఇందిరాపార్క్ Indira Park వద్ద గీత కార్మికుల మహాధర్నా రాష్ట్రంలోని గీత…
Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. సాగు పెట్టుబడి కోసం ప్రభుత్వం అందించే…
Donald Trump : పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా మరియు ఇజ్రాయెల్…
PM Kisan : పౌరసరఫరాల శాఖ మరియు కేంద్ర ప్రభుత్వం నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా కోట్లాది మంది…
Hardik Pandya : టీమిండియా వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ను గెలిచి చరిత్ర సృష్టించిన నేపథ్యంలో స్టార్ ఆల్రౌండర్…
ICC T20 World Cup 2026 : 2026లో జరిగిన ICC T20 World Cup 2026 టోర్నీ అనేక…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణాలు ఎప్పుడూ కీలకంగానే ఉంటాయి. ముఖ్యంగా కాపు సామాజికవర్గం ఓట్లు ఏ పార్టీ…
Gold and silver Rate Today March 9 : బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే మీకు…
This website uses cookies.