PM Modi : ప్రస్తుతం కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. చాప కింద నీరులా దేశం మొత్తం కరోనా సెకండ్ వేవ్ దూసుకొచ్చింది. దీంతో కరోనా కేసులు ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా… దేశమంతా ఎక్కడ చూసినా ఆసుపత్రులు ఫుల్ అయిపోయాయి. బెడ్స్ లేవు… వెంటిలేటర్లు లేవు.. ఆక్సీజన్ సిలిండర్లు లేవు. కరోనా మరణాల రేటు కూడా విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ఆక్సీజన్ దొరకక… చాలామంది మృత్యువాత పడుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించి.. దేశమంతటా.. ఎక్కడా ఆక్సీజన్ సిలిండర్ల కొరత రావద్దని.. అన్ని చోట్లకు ఆక్సీజన్ సిలిండర్లను… రోడ్డు, రైల్వే మార్గం ద్వారా పంపిస్తున్నారు.
అయితే… ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులతో దేశ ప్రజలంతా ఆందోళన చెందుతున్న నేపథ్యంలో… ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి తాజాగా ప్రసంగించారు. కరోనా సెకండ్ వేవ్ దూసుకొస్తోందని… తుపానులా విరుచుకుపడుతోందని.. దాని నుంచి మనం బయటపడాలంటే… లాక్ డౌన్ విధించడమే చివరి అస్త్రం అని మోదీ స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలు కూడా చివరి అస్త్రంగానే లాక్ డౌన్ ను ఉపయోగించాలని మోదీ సూచించారు.
చాలా రాష్ట్రాల్లో ఆక్సీజన్ కొరత ఉంది. ప్రతి ఒక్క కరోనా పేషెంట్ కు ఆక్సీజన్ అందేలా చర్యలు తీసుకున్నాం. మీ కుటుంబ సభ్యుడిగా చెబుతున్నా… అందరం జాగ్రత్తగా ఉందాం. కరోనా సంక్షోభం నుంచి బయటపడదాం. కరోనా సెకండ్ వేవ్ మనందరికీ సవాల్ విసురుతోంది. కాబట్టి.. అందరూ జాగ్రత్త పడాలి. ఎటువంటి పరిస్థితినైనా సరే… ఎదుర్కునేందుకు రెడీగా ఉండాలి.. అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
మన దేశంలోనే ఎక్కడా లేనంత చౌకగా వ్యాక్సిన్ లభిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తున్నాం. రోజూ లక్షల మంది ఉచిత వ్యాక్సిన్ ను వేసుకుంటున్నారు. వలస కార్మికులు కూడా ఎక్కడి వాళ్లు అక్కడే ఉండండి. వారికి కూడా వ్యాక్సినేషన్ ఇవ్వాలి. వలస కార్మికులను చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. అవసరమైతేనే ప్రజలంతా ఇంట్లోనుంచి బయటికి వెళ్లండి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా సుమారు 12 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశాం. ఇప్పటి వరకు 45 సంవత్సరాలు పైబడిన వాళ్లకే వ్యాక్సిన్ ఇస్తున్నాం. మే 1 నుంచి మాత్రం 18 ఏళ్లు పైబడిన అందరికీ వ్యాక్సిన్ ను ఇస్తాం.. అని ప్రధాని మోదీ తెలిపారు.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.