Home » Exclusive » Bjp Telangana Leaders Return Gitf For Cm Kcr
Exclusive

KCR : కేసీఆర్ కు బీజేపీ రిటర్న్‌ గిఫ్ట్‌ అంటే అలా ఇరికించడమేనా?

Authored By
Himanshi
The Telugu News | Published on: February 7, 2022, 12:00 pm
Advertisement

KCR  : భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సమయం లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ పర్యటనకు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. భారత ప్రధాన మంత్రి రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రోటోకాల్ పాటించకుండా సీఎం కేసీఆర్ జ్వరం అంటూ సిల్లీ రీజన్ చెప్పడం పై బిజెపి నాయకులు సీరియస్ అవుతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ ను ఏ విధంగా టార్గెట్ చేయాలని ఎదురు చూస్తున్న బిజెపి నాయకులు ఇపుడు ఈ విషయాన్ని సీరియస్‌ గా తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఈ విషయాన్ని అంత సులభంగా విడువకుండా కేసీఆర్ ను టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో బిజెపి నాయకులు ఉన్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

అందులో భాగంగానే తాజాగా సోషల్ మీడియా ద్వారా బిజెపి నాయకులు సీఎం కేసీఆర్ మరియు టిఆర్ఎస్ పార్టీని హెచ్చరించినట్లు తెలిసింది. సోషల్ మీడియా లో తాజాగా బిజెపి వారు కచ్చితంగా కేసీఆర్ కి
రిటర్న గిఫ్ట్‌ భారీగానే ఉంటుంది అని ప్రకటించారు. బిజెపి రిటర్న్ గిఫ్ట్ అంటే అది సీరియస్ గానే ఉంటుంది అంటూ జాతీయ రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఏదైనా సాధ్యమే.. కేంద్ర ప్రభుత్వం తో పెట్టుకుంటే ఏం చేసేందుకు అయినా సిద్దమే అన్నట్లుగా బీజేపీ ఉంటుంది అనడంలో సందేహం లేదు. బీజేపీ ప్రత్యర్థి ముఖ్యమంత్రి అయినా మరెవరైనా తాము తలుచుకుంటే ఏం చేసేందుకైనా సిద్ధమైనట్లు గా వ్యవహరిస్తారని ప్రచారం ఉంది.

bjp telangana leaders return gitf for cm kcr

Advertisement

కేంద్ర ప్రభుత్వం తన అధికారాన్ని ప్రదర్శిస్తే మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ కు ఇబ్బందులు తప్పవు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ముందస్తుగా ఊహించకుండా కేసీఆర్ ఈ పని చేసి ఉండరు. ప్రతి ఒక్క విషయాన్ని ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కనుక బిజెపి ఏమి చేసినా సిద్ధంగా ఉండే ఆయన ఈ పని చేసి ఉంటారని కొందరు నాయకులు మరియు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బిజెపి కేసీఆర్ కి రిటర్న్ గిఫ్ట్ ప్రకటించడంతో ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ మరియు బిజెపి ల మధ్య జరుగుతున్న వైరంను కాంగ్రెస్ పార్టీ అలా చూస్తూ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నట్లు అనిపిస్తుంది. ప్రధాని మోడీ మరియు కేసీఆర్ ల మధ్య ఈప్రోటోకాల్ వ్యవహారం ఎంత దూరం వెళుతుంది అనేది చూడాలి.

Himanshi

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి