ap minister botsa satyanarayana about 3 capitals
Botsa Satyanarayana : ఏపీ రాజధాని గా అమరావతినే కొనసాగించాల్సిందే అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు పై వైకాపా నేత మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అంటూ పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం మరియు కేంద్ర మంత్రులు పలు దఫాలుగా చెప్పడం జరిగింది. రాజధాని నిర్మాణం మరియు రాజధాని ఏర్పాటు అన్ని కేంద్రం రాష్ట్రానికి అప్పగించిన నేపథ్యంలో ఇప్పుడు అమరావతి ఒక్కటే కాకుండా మరో రెండు రాజధానులను కూడా ఏపీ కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకు వచ్చేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది.
కాని ఒక సామాజిక వర్గం కోసం రాజధానిగా అమరావతి ఉండాలంటూ తెలుగు దేశం పార్టీ మరియు ఇతర పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఐదు కోట్ల మంది ఆకాంక్ష కు అనుగుణంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల ను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. హైకోర్టు తీర్పుని కొందరు రాజకీయ నాయకులు వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మీడియాలో కూడా హైకోర్టు తీర్పు వక్రీకరణ చేస్తు కథనాలు వస్తున్నాయి అంటూ బొత్స ఆరోపించారు.ఈ తీర్పుపై తాము సుప్రీం కోర్టుకు వెళ్లాలని భావించడం లేదని న్యాయ నిపుణులతో చర్చించి ముందుకెళ్తాం అంటూ ఆయన పేర్కొన్నాడు.
Botsa Satyanarayana andhra pradesh capital
ఇప్పటికి కూడా జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు నిర్ణయానికి కట్టుబడి ఉందని ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడైనా కూడా ఏపీకి రాజధానిగా మూడు రాజధానులు నిర్ణయం తీసుకు వస్తా అంటూ మంత్రి హామీ ఇచ్చారు. ఇది ప్రతి ఒక్క ఆంద్రప్రదేశ్ ప్రజల కోరిక అంటూ ఆయన పేర్కొన్నాడు. తెలుగు దేశం పార్టీ మరియు ఇతర పార్టీలు అమరావతి రాజధానిగా ఎందుకు కావాలనుకుంటున్నారో ప్రజలకు తెలుసని, ఏపీ ప్రజలు కచ్చితంగా వారికి బుద్ధి చెప్పే రోజు తప్పకుండా వస్తుందని అన్నారు. కోర్టు తీర్పును గౌరవిస్తాం అదే సమయంలో ప్రజలకు న్యాయం చేసే విధంగా తాము వ్యవహరిస్తామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.