BREAKING ysrcp mp raghurama krishnam raju to get ticket from tdp
BREAKING : వైఎస్సార్సీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) టీడీపీలో చేరే ముహూర్తం దాదాపు ఖరారు అయినట్టే. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి ఆయన రెబల్ గా మారిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వైసీపీ పార్టీపై, ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఢిల్లీలోనే ఉంటూ కేంద్రంతో సఖ్యతగా ఉంటూ వైసీపీపై ఆరోపణలు చేస్తూ జాతీయ మీడియాలోనూ ఈయన హైలైట్ అయ్యారు. వైసీపీకి రాజీనామా చేసి రఘురామ బీజేపీలో చేరుతారని వార్తలు వచ్చినప్పటికీ.. రఘురామ బీజేపీలో కాదు.. టీడీపీలో చేరబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఆయనకు కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు చంద్రబాబు ఇప్పటికే టికెట్ కూడా కన్ఫమ్ చేసినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఎన్నికల వేళ ఎలాంటి పొత్తులు పెట్టుకున్నా సరే.. కాకినాడ నుంచి రఘురామనే పోటీలో నిలపాలని చంద్రబాబు యోచిస్తున్నారట.
దాని కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకోవాలని రఘురామ కృష్ణంరాజుకు చంద్రబాబు సూచించారట. నిజానికి కాకినాడలో టీడీపీ బలమే ఎక్కువ. ప్రస్తుతం జనసేన కూడా కాస్త దూకుడు మీదనే ఉన్నది. 1998 లో కాకినాడ నుంచే పోటీ చేసి రఘురామ కృష్ణంరాజు గెలిచిన విషయం తెలిసిందే. అందుకే.. కాకినాడ నుంచి మరోసారి రఘురామను పోటీలోకి దించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట. చంద్రబాబు చేయించిన సర్వేల్లోనూ కాకినాడలో రఘురామను బరిలోకి దింపితే గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలిశాయట. అందుకే కాకినాడ టికెట్ ను చంద్రబాబు రఘురామకు కన్ఫమ్ చేశారట.
BREAKING ysrcp mp raghurama krishnam raju to get ticket from tdp
అయితే.. రఘురామ ఇప్పటికే కాకినాడలో గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన నరసాపురం ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో నరసాపురం నుంచి కాకినాడకు షిఫ్ట్ అవ్వాలని రఘురామ భావిస్తున్నారట. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే అక్కడ వ్యూహాలు రచించాలని భావిస్తున్నారట. రఘురామ కాకినాడలో పోటీ చేస్తే గెలవడం కూడా పెద్ద కష్టమేమీ కాదని తెలుస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీకి ఉన్న పట్టు వల్ల, రఘురామకు ఉన్న పాపులారిటీ వల్ల కాకినాడలో ఆయన విజయం సునాయసమే అని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. చూద్దాం మరి.. రఘురామ భవిష్యత్తు టీడీపలో ఎలా ఉండబోతోందో?
Esha Gupta : బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్ అయ్యింది. గతంలో టీమిండియా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే…
Manchu Vishnu : టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన పౌరాణిక చిత్రం…
రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త. జులై నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే…
Team India :ఇండియన్ క్రికెట్ జట్టు టెస్ట్ ఫార్మాట్లో ఈ మధ్య నిరాశాజనక ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.…
RK Roja : ఏపీ రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం…
Wife : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నిషాద్ అనే వ్యక్తి తాజాగా సితార అనే…
Three Sisters : ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో చిరంజీవి అని చెప్పొచ్చు. ఆ ముగ్గురితో కలిసి…
This website uses cookies.