Telangana Assembly Session : యూరియా కొర‌త‌పై దద్దరిల్లిన తెలంగాణ అసెంబ్లీ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Telangana Assembly Session : యూరియా కొర‌త‌పై దద్దరిల్లిన తెలంగాణ అసెంబ్లీ

 Authored By sudheer | The Telugu News | Updated on :30 August 2025,6:00 pm

BRS Leaders Protest Infront Of Telangana Secretariat : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై రైతులు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. అన్నదాతల సమస్యలు, ముఖ్యంగా యూరియా కొరత సమస్య, తీవ్రమైన స్థాయికి చేరుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు పదేపదే రైతుల పక్షాన నిలబడుతున్న విషయం తెలిసిందే. రైతులు ప్రస్తుతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తమ కష్టాలను పరిష్కరించడానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇటీవల కూడా, యూరియా కొరతపై స్పందిస్తూ బీఆర్ఎస్ నేతలు రైతుల తరపున అనేక కార్యాచరణలు చేపడుతున్నారు.

BRS Leaders Protest Infront Of Telangana Secretariat

BRS Leaders Protest Infront Of Telangana Secretariat

ఈ రోజు కూడా బీఆర్ఎస్ నేతలు వ్యవసాయ శాఖ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించి, తక్షణమే యూరియా కొరతను తీర్చాలని డిమాండ్ చేశారు. కార్యాలయానికి వెళ్లి ధ‌ర్నాకు దిగిన నాయకులను పోలీసులు అరెస్టు చేసినా, వారు విడిచిపెట్టబడ్డారు. తర్వాత హరీశ్‌రావు నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ స‌చివాల‌యాన్ని ముట్ట‌డించారు. ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ “యూరియా వెంటనే సరఫరా చేయండి” అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా స‌చివాల‌య ప్ర‌ధాన గేటు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పు పట్టుతూ.. “యూరియా సంక్షోభానికి కారణం కాంగ్రెస్” అంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో “గణపతి బప్పా మోరియా – కావాలయ్యా యూరియా” అంటూ ఒక వినూత్న నినాదంతో నిరసన వ్యక్తం చేశారు. రైతులకు ఎరువులు సరఫరా చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటనే అధికారంలో నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. “రేవంత్ దోషం – రైతన్నకు మోసం” అంటూ, రైతుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీని నిలదీయడం, బీఆర్ఎస్ నేతల ముఖ్య ఉద్దేశ్యంగా మారింది.

Tags :

    sudheer

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది