JC Prabhakar Reddy Fires On Anantapur Dist Collector Nagalakshmi
JC Prabhakar Reddy : తాడిపత్రి రాజకీయాలు అంటేనే రసవత్తరంగా ఉంటాయి. ఓవైపు అధికార పార్టీ, మరోవైపు ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే అక్కడ భగ్గుమంటుంది. మాట యుద్ధమే అక్కడ. కానీ.. తాజాగా తాడిపత్రిలో చోటు చేసుకున్న ఘటన చివరకు కేసు నమోదు వరకు వెళ్లింది. మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మరో 120 మంది టీడీపీ నేతలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
నిజానికి.. తాడిపత్రిలో టీడీపీ కౌన్సిలర్లపైనే దాడి జరిగిందని, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. దాన్ని ఖండించారు. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు కూడా జేసీకి మద్దతు ఇచ్చారు. తాడిపత్రి పోలీస్ స్టేషన్ ముందు తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి బైఠాయించి ఆందోళనకు కూడా దిగారు. వైసీపీ నేతలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు అంటూ పోలీసులపై కూడా జేసీ విరుచుకుపడ్డారు. పోలీసులకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టడంపై జేసీపై పోలీసులు కేసు నమోదు చేశారు.
case registered against JC Prabhakar Reddy
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై, స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలపై కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి విరుచుకుపడ్డారు. క్రైమ్ రేటు ఇప్పుడు ఎందుకు పెరిగిందంటూ నిలదీశారు. అసలు.. శాంతి భద్రతలకు పరిరక్షణ ఉందా అంటూ విరుచుకుపడ్డారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ టీడీపీ శ్రేణులు మొత్తం తాడిపత్రి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన నిర్వహించడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. చివరకు తాడిపత్రి డీఎస్పీతో కూడా జేసీ వాగ్వాదానికి దిగారు. చివరకు టీడీపీ కార్పొరేటర్లపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని జేసీ ప్రభాకర్ రెడ్డికి పోలీసులు హామీ ఇవ్వడంతో జేసీ ఆందోళన విరమించారు. అయినప్పటికీ.. ఈ వ్యవహారంపై పోలీసులు జేసీతో పాటు ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు.
Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…
Bhu Bharati : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…
Today Gold Price : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల…
karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…
Sprouted Fenugreek : తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనందరికీ తెలుసు. ఇవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య…
AP Mega DSC : ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదలైంది.…
Jyotishyam : శాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తుని జరిగే సంఘటనలను చెప్పడంలో బాబా వంగ కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి గాంచింది.. బాబా…
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ డివిజన్ Uppal Division సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్రెడ్డి Rajitha…
This website uses cookies.