Employees : ఉద్యోగులకు కేంద్రం తీపికబురు.. కొత్త ఏడాది భారీగా పెరగనున్న జీతం.. ఎంతంటే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Employees : ఉద్యోగులకు కేంద్రం తీపికబురు.. కొత్త ఏడాది భారీగా పెరగనున్న జీతం.. ఎంతంటే..?

Employees :  కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు శుభవార్త చెప్పనుందనే వార్తలు వస్తున్నాయి. నూతన ఏడాది కానుకగా ఉద్యోగులకు ఫిట్‌మెంట్ పెంచే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ మేరకు ఆయా ఉద్యోగుల బేసిక్ శాలరీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఫలితంగా ఉద్యోగుల బేసిక్ శాలరీ రూ.26 వేలకు పెరగ వచ్చునని భావిస్తున్నారు. దీనిపై కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపితే.. బడ్జెట్ కన్నా ముందుగానే అనగా కొత్త సంవత్సరం ఆరంభంలోనే ఉద్యోగులకు ఈ శుభవార్త వినిపించే […]

 Authored By inesh | The Telugu News | Updated on :27 December 2021,1:20 pm

Employees :  కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు శుభవార్త చెప్పనుందనే వార్తలు వస్తున్నాయి. నూతన ఏడాది కానుకగా ఉద్యోగులకు ఫిట్‌మెంట్ పెంచే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ మేరకు ఆయా ఉద్యోగుల బేసిక్ శాలరీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఫలితంగా ఉద్యోగుల బేసిక్ శాలరీ రూ.26 వేలకు పెరగ వచ్చునని భావిస్తున్నారు.

దీనిపై కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపితే.. బడ్జెట్ కన్నా ముందుగానే అనగా కొత్త సంవత్సరం ఆరంభంలోనే ఉద్యోగులకు ఈ శుభవార్త వినిపించే అవకాశాలున్నాయి. ఉద్యోగులు చాలా కాలం నుంచి ఫిట్‌మెంట్ పెరుగుదలకై డిమాండ్ చేస్తున్నారు. 2.57 శాతం ఉన్న ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.68 శాతానికి పెంచాలని కోరుతున్నారు. ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను చివరిగా 2016లో పెంచారు. అప్పుడు ఉద్యోగుల కనీస బేసిక్ శాలరీ రూ.6 వేల నుంచి రూ.18 వేలకు చేరింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరోసారి ఫిట్‌మెంట్ ను మరోసారి పెంచితే..

Central Government is increasing basic salary of employees from new year

Central Government is increasing basic salary of employees from new year

ఈ మినిమమ్ బేసిక్ పే రూ.26 వేలకు చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇదే జరిగితే ఉద్యోగులకు చాలా మేలు కలుగనుంది. అయితే కేంద్రం నుంచి దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

inesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది