దేశంలో ఈ మధ్య జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అందులో సృష్టంగా చెప్పాలంటే బీజేపీకి వ్యతిరేకమైన గాలి బలంగా వీచింది. మోడీ వ్యతిరేక శక్తులు తమ బలాన్ని పెంచుకోవటమే కాకుండా బీజేపీని మట్టి కరిపించాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ లో యాంటీ మోడీ వర్గం విజయం సాధించింది. దీనితో దేశ వ్యాప్తంగా యాంటీ మోడీ క్యాంపైన్ మరోసారి తెర మీదకు వచ్చింది. ఇప్పుడు ఇదే టీడీపీ అధ్యక్షుడు Chandrababu Naidu కు పెద్ద చిక్కు సమస్యను తెచ్చిపెట్టింది.
ఇప్పుడు చంద్రబాబు మోడీ వర్గంలో ఉండాలా యాంటీ మోడీ వర్గంలో ఉండాలా అనేది తేల్చుకోలేకపోతున్నట్లు తెలుస్తుంది. 2014 లో ఎలాగోలా ఢిల్లీ స్థాయిలో మంతనాలు చేసి, మోడీకి దగ్గరయ్యాడు. 2019కి వచ్చేసరికి యాంటీ మోడీ వర్గంలో చేరిపోవటంతో కాకుండా మోడీని ఓడించటానికి అన్ని రాష్ట్రాలు తిరిగొచ్చాడు. తీరా మోడీ ఘన విజయం సాధించి మరోసారి ప్రధాని అయ్యాడు. అపార మేధావి, 40 ఇయర్స్ ఇండస్ట్రీ, రాజకీయ దురంధురుడు అని చెప్పుకునే చంద్రబాబు సరిగ్గా ఇక్కడే బోల్తాకొట్టాడు.
అయితే ఆ తర్వాత యధావిధిగా మోడీకి దగ్గర కావటానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. దేశ వ్యాప్తంగా మోడీ పనితీరుపై విమర్శలు వస్తున్నా కానీ, తాను మాత్రం పల్లెత్తు మాట కూడా అనటం లేదు. పైగా మోడీ చేసే తప్పులను జగన్ కు ఆపాదించి ఆయన్ని తిట్టటం అలవాటు చేసుకున్నాడు. అలాంటి బాబుకు ఇప్పుడు వచ్చిన ఫలితాలతో దేశంలో యాంటీ మోడీ టీమ్ బలపడుతుందనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి.
ఇలాంటి తరుణంలో మోడీ టీం లో ఉంటే లాభమా లేక యాంటీ మోడీ టీమ్ లో ఉంటే లాభమా అనే లెక్కలు వేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే దేశంలోని యాంటీ మోడీ టీం కూడా చంద్రబాబును నమ్మే స్థితిలో లేదు. 2019 తర్వాత కూడా బాబు యాంటీ మోడీ స్టాండ్ తీసుకోని ఉంటే ఇప్పుడు నమ్మకం కుదిరేది, కానీ ఫలితాలు వచ్చిన వెంటనే మోడీ భజన చేసిన చంద్రబాబును నమ్మటానికి మిగిలిన రాజకీయ పక్షాలు సిద్ధంగా లేవని తెలుస్తుంది. ఇటు ఏమో మోడీ దగ్గరకి రానివ్వటం లేదు అటు ఏమో యాంటీ మోడీ టీం నమ్మటంలేదు. దీనితో బాబు పరిస్థితి అటు ఇటు కాకుండా పోయిందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.