
etela Rajendar
Etela Rajender : ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా ఈటల రాజేందర్ గురించే చర్చ. మొన్నటి నుంచి ఆయన అధికారాలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ… ఈటలను ఒంటరిగా చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మెదక్ జిల్లాలోని అచ్చంపేటలో ఉన్న 100 ఎకరాల అసైన్డ్ భూముల కబ్జా వ్యవహారంపై ఈటల రాజేందర్ ను మంత్రి వర్గం నుంచి ప్రభుత్వం తొలగించింది. ఆయనపై విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశించడంతో… అధికారులు ఆ భూమిలో సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక కూడా అందించారు. దీనిపై మీడియాలో కథనాలు కూడా ప్రసారం అయ్యాయి.
etela rajender press meet on cm kcr
ఇప్పటికే ఒకసారి ప్రెస్ మీట్.. తనే తప్పు చేయలేదని… తనను కావాలని ఇరికిస్తున్నారని.. అన్నీ కట్టుకథలు అల్లారని ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ లో స్పష్టం చేశారు. ఎటువంటి విచారణకైనా తాను సిద్ధమని ప్రకటించినా… ప్రభుత్వం నుంచి ఈటలకు ఎటువంటి విచారణకు సంబంధించిన పిలుపు రాకపోవడంతో పాటు… ఆయన వద్ద ఉన్న వైద్యారోగ్య శాఖను సీఎం కేసీఆర్ కు బదిలీ చేయడంతో పాటు.. మంత్రి వర్గం నుంచి ఈటలను బర్తరఫ్ చేస్తూ గవర్నర్ ఆమోద ముద్ర వేశారు.
దీంతో మరోసారి ఈటల రాజేందర్.. ప్రజల ముందుకు వచ్చారు. మరోసారి మీడియాతో మాట్లాడారు. ఎందుకు తనపై ఇంతలా దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఈటల ప్రశ్నించారు. నేను తప్పు చేస్తే.. ఒక్కసారైనా నాతో మాట్లాడొచ్చు కదా. ఇప్పటి వరకు నన్ను పిలవకుండా.. నాతో కన్సల్ట్ కాకుండా.. మీ ఇష్టం ఉన్నట్టు చేసుకుంటున్నారు. నేను నా సొంత భూమిలో ఫౌల్ట్రీ ఫామ్ కట్టుకుంటున్నా. నాది కాని భూములను కొలిచాలి. జమునా హ్యాచరీస్ నాది కాదు. అయినా కూడా నాది అన్నారు. దాన్ని ప్రొప్రైలర్ నితిన్. మీకు వావి వరసలు తెలియవా కేసీఆర్? నీకు కొడుకు ఉన్నాడు కదా.. నీకూ కూతురు ఉన్నది కదా.. ఇలా చేయడం ఎంత వరకు కరెక్ట్.. అంటూ ఈటల దుయ్యబట్టారు.
మానవ సంబంధాలే ముఖ్యం ఈరోజుల్లో. తెలంగాణ భవన్ ను ఆక్రమించుకుంటా అని వైఎస్సార్ మనుషులను పంపిస్తే.. మీకు మేం కాపలా కాశాం. ఆ విషయాన్ని మరిచిపోయారు మీరు ముఖ్యమంత్రి గారు. మానవ సంబంధాలు చాలా ముఖ్యం. మనుషుల మీద చర్యలు చేపడుతున్నప్పుడు, ఉక్కుపాదం మోపుతున్నప్పుడు మీకు నా మీద ఎంత అనుబంధం ఉంది.. మీరు పిలుపు ఇచ్చారని.. అసెంబ్లీలో నేను ఏం చేశానో.. అమ్ముడుపోకుండా నేను కొట్లాడిన విషయం మీకు గుర్తుకు రావాలి కదా. నా ఆస్తుల మీద, నా సంపాదన మీద.. మీరు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి. దానికి నేను సిద్ధం. ఇప్పుడు నేను ఒక్కడినే కావచ్చు కానీ… తెలంగాణ ప్రజలు మాత్రం నాతో ఎప్పటికీ ఉంటారు. నాకు మంత్రి పదవి కంటే ఆత్మగౌరవం ముఖ్యం.. అనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకొండి. మీరు మమ్మల్ని ఏనాడూ మంత్రులుగా చూడలేదు. అయినా కూడా మేం ఏం అనలేదు. కనీసం మనుషులుగా అయినా మమ్మల్ని చూడండి అని వేడుకుంటున్నా… అని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
RCB Vs GT Final : ఐపీఎల్ 2026 సీజన్కు తెరపడే సమయం ఆసన్నమైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ Royal Challengers…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేక లక్షణాలు, బలాలు, బలహీనతలు ఉంటాయి. గ్రహాల సంచారం,…
Beer Kidney Stones : కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఏర్పడటం ప్రస్తుతం సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. కిడ్నీ…
Low-Calorie Snacks : ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలంటే కేవలం ప్రధాన భోజనాలపై మాత్రమే కాదు, మధ్యలో తీసుకునే స్నాక్స్పైనా ప్రత్యేక…
Jr NTR : టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…
This website uses cookies.