Etela Rajender : ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా ఈటల రాజేందర్ గురించే చర్చ. మొన్నటి నుంచి ఆయన అధికారాలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ… ఈటలను ఒంటరిగా చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మెదక్ జిల్లాలోని అచ్చంపేటలో ఉన్న 100 ఎకరాల అసైన్డ్ భూముల కబ్జా వ్యవహారంపై ఈటల రాజేందర్ ను మంత్రి వర్గం నుంచి ప్రభుత్వం తొలగించింది. ఆయనపై విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశించడంతో… అధికారులు ఆ భూమిలో సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక కూడా అందించారు. దీనిపై మీడియాలో కథనాలు కూడా ప్రసారం అయ్యాయి.
ఇప్పటికే ఒకసారి ప్రెస్ మీట్.. తనే తప్పు చేయలేదని… తనను కావాలని ఇరికిస్తున్నారని.. అన్నీ కట్టుకథలు అల్లారని ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ లో స్పష్టం చేశారు. ఎటువంటి విచారణకైనా తాను సిద్ధమని ప్రకటించినా… ప్రభుత్వం నుంచి ఈటలకు ఎటువంటి విచారణకు సంబంధించిన పిలుపు రాకపోవడంతో పాటు… ఆయన వద్ద ఉన్న వైద్యారోగ్య శాఖను సీఎం కేసీఆర్ కు బదిలీ చేయడంతో పాటు.. మంత్రి వర్గం నుంచి ఈటలను బర్తరఫ్ చేస్తూ గవర్నర్ ఆమోద ముద్ర వేశారు.
దీంతో మరోసారి ఈటల రాజేందర్.. ప్రజల ముందుకు వచ్చారు. మరోసారి మీడియాతో మాట్లాడారు. ఎందుకు తనపై ఇంతలా దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఈటల ప్రశ్నించారు. నేను తప్పు చేస్తే.. ఒక్కసారైనా నాతో మాట్లాడొచ్చు కదా. ఇప్పటి వరకు నన్ను పిలవకుండా.. నాతో కన్సల్ట్ కాకుండా.. మీ ఇష్టం ఉన్నట్టు చేసుకుంటున్నారు. నేను నా సొంత భూమిలో ఫౌల్ట్రీ ఫామ్ కట్టుకుంటున్నా. నాది కాని భూములను కొలిచాలి. జమునా హ్యాచరీస్ నాది కాదు. అయినా కూడా నాది అన్నారు. దాన్ని ప్రొప్రైలర్ నితిన్. మీకు వావి వరసలు తెలియవా కేసీఆర్? నీకు కొడుకు ఉన్నాడు కదా.. నీకూ కూతురు ఉన్నది కదా.. ఇలా చేయడం ఎంత వరకు కరెక్ట్.. అంటూ ఈటల దుయ్యబట్టారు.
మానవ సంబంధాలే ముఖ్యం ఈరోజుల్లో. తెలంగాణ భవన్ ను ఆక్రమించుకుంటా అని వైఎస్సార్ మనుషులను పంపిస్తే.. మీకు మేం కాపలా కాశాం. ఆ విషయాన్ని మరిచిపోయారు మీరు ముఖ్యమంత్రి గారు. మానవ సంబంధాలు చాలా ముఖ్యం. మనుషుల మీద చర్యలు చేపడుతున్నప్పుడు, ఉక్కుపాదం మోపుతున్నప్పుడు మీకు నా మీద ఎంత అనుబంధం ఉంది.. మీరు పిలుపు ఇచ్చారని.. అసెంబ్లీలో నేను ఏం చేశానో.. అమ్ముడుపోకుండా నేను కొట్లాడిన విషయం మీకు గుర్తుకు రావాలి కదా. నా ఆస్తుల మీద, నా సంపాదన మీద.. మీరు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి. దానికి నేను సిద్ధం. ఇప్పుడు నేను ఒక్కడినే కావచ్చు కానీ… తెలంగాణ ప్రజలు మాత్రం నాతో ఎప్పటికీ ఉంటారు. నాకు మంత్రి పదవి కంటే ఆత్మగౌరవం ముఖ్యం.. అనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకొండి. మీరు మమ్మల్ని ఏనాడూ మంత్రులుగా చూడలేదు. అయినా కూడా మేం ఏం అనలేదు. కనీసం మనుషులుగా అయినా మమ్మల్ని చూడండి అని వేడుకుంటున్నా… అని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.