వైసీపీ విజయం చూసి పిచ్చి పట్టిందా..?.. ఇవేమి మాటలు చంద్రన్న

chandrababu : ఏపీలో జరిగిన తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి తమ సమీప అభ్యర్థిని టీడీపీ నేత పనబాక లక్ష్మిపై 2,71,592 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. 2019 లో వచ్చిన మెజారిటీ కంటే 40 వేల ఓట్లు ఎక్కువగా సాధించింది వైసీపీ పార్టీ. దీనిని బట్టి చూస్తే జగన్ పనితీరును ప్రజలు మెచ్చుకున్నట్లే లెక్కని విశ్లేషకులు చెపుతున్న మాట. అయితే ఇది సరైన విజయం కాదని, వైసీపీ నేతల అహాన్ని అణచివేసే విజయమని, తిరుపతి ప్రజలు సరైన తీర్పు ఇచ్చారని చంద్రబాబు chandrababu తన ధోరణిలో ప్రసంగం ఇచ్చాడు.

చంద్రబాబు ఏమన్నాడో ఆయన మాటల్లో విందాం..

వైసీపీ నేతల అహాన్ని అణచిన తిరుపతి లోక్ సభ ఓటర్లకు ధన్యవాదాలు

★ వైసీపీ అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు అభినందనలు.

★ తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో వైసీపీ నేతల అధికార దుర్వినియోగానికి, అక్రమాలకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన టీడీపీ శ్రేణులకు ధన్యవాదాలు.

★ వైసీపీ అక్రమాలపై ఎదురొడ్డి పోరాడిన టీడీపీ కార్యకర్తలను, నాయకులను అభినందిస్తున్నా.

★ తిరుపతి ఉపఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గడం వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వున్న వ్యతిరేకతకు అద్దం పడుతోంది.

★ అరాచకాలు, అక్రమాలతో ప్రజాస్వామ్యాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్న వైసీపీ చర్యలకు వ్యతిరేకంగా పోరాడిన టీడీపీ కార్యకర్తల తెగువ స్ఫూర్తిదాయకం.

★ ఐదు లక్షలకు పైగా మెజార్టీ వస్తుందని అహంభావంతో వ్యవహరించిన వైసీపీ శ్రేణులకు ఓటుతో బుద్ధి చెప్పిన తిరుపతి లోక్ సభ ఓటర్లకు అభినందనలు తెలుపుతున్నా.

బాబు మాటలను గమనిస్తే తాము ఓడిపోయామనే బాధ కంటే కూడా హమ్మయ్య వైసీపీ కి పెద్ద మెజారిటీ రాలేదులే అనే సంతోషం కనిపిస్తుంది. చంద్రబాబు చెప్పినట్లు ప్రభుత్వం మీద వ్యతిరేకత వలనే ఓటింగ్ శాతం తగ్గిందని అనుకుందాం. మరి టీడీపీ మీద సానుభూతి పెరిగిందా..? పెరిగితే గతంలో కంటే ఎక్కువ ఓట్లు రావాలి కదా…? లేకపోతే గతంలో వచ్చిన ఓట్లు అయిన రావాలి కదా..? 2019 లో టీడీపీకి 4,94,501 ఓట్లు వస్తే , తాజా ఎన్నికల ఫలితాల్లో 3,54,516 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే సుమారు 1,40,000 ఓట్లు తగ్గాయి.. మరి దీని గురించి చంద్రబాబు ఏమని చెపుతాడు… ?

2019 లో వైసీపీ కి 7,22,877 ఓట్లు వస్తే తాజా ఫలితాల్లో 6,26,108 ఓట్లు మాత్రమే వచ్చాయి.. అంటే రమారమి 96 వేల ఓట్లు తగ్గినా కానీ 2019 లో వచ్చిన మెజారిటీ కంటే కూడా 40 వేల మెజారిటీ ఎక్కువ వచ్చింది.. ఈ గణాంకాలు చాలవా ఎవరి మీద ప్రజలకు నమ్మకం ఉందొ.. ? ఎవరి మీద ప్రజలకు వ్యతిరేకత ఉందో..? తెలుసుకోవటానికి . ఇప్పటికైనా బాబు ఈ అసత్యాలను మానుకొని నిజాలేమిటో తెలుసుకుంటే రాబోయే రోజుల్లో కనీసం పార్టీకైనా భవిష్యత్ అనేది ఉంటుంది.

Recent Posts

Vivo | వివో నుంచి కొత్త బ్లాక్‌బస్టర్ ..Vivo T4R 5G స్మార్ట్‌ఫోన్ ₹17,499కే!

Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…

3 hours ago

Jupitar Price | జీఎస్టీ రేట్లు తగ్గడంతో టీవీఎస్ బైకులు, స్కూటీల ధరలు భారీగా తగ్గింపు .. కొత్త ధరల వివరాలు ఇదే!

Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…

5 hours ago

Asia Cup 2025 | ఆసియా క‌ప్‌లో భార‌త్ క‌ప్ కొట్టినా కూడా తీసుకోదా.. సూర్యకి ఏమైంది?

Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…

7 hours ago

Aghori | వర్షిణి – అఘోరీ వివాదం కొత్త మలుపు.. మోసం చేసింది నువ్వురా..మోసపోయింది నేనురా అంటూ సంచలన వ్యాఖ్యలు

Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…

8 hours ago

Raja Saab | ఎట్ట‌కేల‌కి రాజా సాబ్ ట్రైల‌ర్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారు.. ఇక ఫ్యాన్స్‌కి పండ‌గే..!

Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…

10 hours ago

Telangana | తెలంగాణలో దంచికొడుతున్న వ‌ర్షాలు.. 11 జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్

Telangana |  తెలంగాణ రాష్ట్రంలో వ‌ర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…

13 hours ago

Makhana | మఖానా ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫుడ్ .. ఇది తింటే ఆ స‌మ‌స్య‌లన్నీ మ‌టాష్‌

Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…

14 hours ago

Salt | పింక్‌ సాల్ట్‌ vs సాధారణ ఉప్పు .. మీ ఆరోగ్యానికి ఏది ఉత్తమం?

Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…

14 hours ago