ChandraBabu : తెలుగు దేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు నాయుడు కాళ్ల కు చక్రాలు కట్టుకున్నట్లుగా రాష్ట్రం లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. వయసు మీద పడ్డా కూడా తనయుడు లోకేష్ కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే పరిస్థితి ఎక్కడ చేయి జారి పోతుందో అనే భయంతో చంద్రబాబు నాయుడు ఇంకా కూడా తెలుగు దేశం పార్టీ ని తన నెత్తిన పెట్టుకుని నడి సంద్రం ఈదుతున్నట్లుగా మీటింగ్ లు.. పార్టీ నాయకుల కార్యక్రమాలకు హాజరు అవుతున్నాడు. అయితే ఈమద్య కాలంలో ఈయన కార్యక్రమాలకు జనాలు కరువు అవుతున్నారు.
కొన్ని చోట్ల కాస్త ఎక్కువగా వచ్చినా కూడా ఎక్కువ శాతం జనాలు చంద్రబాబు నాయుడు మీటింగ్ కు వెళ్లేందుకు ఆసక్తిగా లేరట. ఈ విషయాన్ని స్వయంగా తెలుగు తమ్ముళ్లు చెబుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు నాయుడు కృష్ణ మరియు గుంటూరు జిల్లాల్లో మినీ మహానాడు కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొనగా తెలుగు తమ్ముళ్లకు భారీ ఎత్తున జనాలను సమీకరించాలంటూ అధినాయకత్వం నుండి సమాచారం అందిందట. కాని జనాల సమీకరణ అనేది తెలుగు దేశం పార్టీ నాయకులకు చాలా పెద్ద ఇష్యూగా మారింది.ఈమద్య కాలంలో తెలుగు దేశం పార్టీ మీటింగ్ లకు జనాలు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు.
అందుకు కారణాలు చాలా ఉన్నాయి. తాజాగా ఆ రెండు జిల్లాల్లో జరిగిన మినీ మహానాడు కార్యక్రమానికి భారీగా హాజరు అవుతారు అంటూ భావించినా కూడా.. భారీగా ఖర్చు చేసినా కూడా వచ్చిన జనాలు చాలా తక్కువ. ఇటీవల బాబు సొంత నియోజక వర్గం లో మీటింగ్ ఏర్పాటు చేయగా మంచి జనాలు వచ్చారట. ఆ స్థాయిలో అయినా ఈ మీటింగ్ కు వస్తారేమో అని ఆశించారు చంద్రబాబు నాయుడు. కాని ఆయన ఆశ అడియాశ అయ్యింది. మరీ దారుణమైన జన సంఖ్య కనిపించడం తో ఆయన అవాక్కయ్యారని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు.
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
This website uses cookies.