Home » Andhra Pradesh » Chandrababu Reading Sakshi News Paper
andhra pradesh

తెల్లారగానే సాక్షి పేపర్ చదివిన చంద్రబాబు కి గుండె పేలినంత పనైంది?

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: May 8, 2021 8:05 pm
Advertisement

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా ఎంతలా విజృంభిస్తుందో అందరికీ తెలుసు. దేశ వ్యాప్తంగానే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా బీభత్సంగా వ్యాప్తి చెందుతోంది. దానికి అడ్డుఅదుపు లేదు. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. దీనిపై టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలోనూ రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయని ఆయన తెలిపారు. టెస్టులు పెంచితే కేసుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు.

Advertisement

chandrababu Reading sakshi news paper

టెస్టుల సంఖ్యను ప్రభుత్వం పెంచాలి. 18 నుంచి 45 ఏళ్ల వయసు ఉన్నవాళ్లకు.. విధిగా కరోనా వ్యాక్సిన్ ఇప్పుడే వేయాల్సిందే. సెప్టెంబర్ లో వేస్తాం అంటే కుదరదు అని కేంద్రం కూడా ఏపీ ప్రభుత్వంపై సీరియస్ అయింది. అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాల్సిందే. కరోనా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఏపీ సీఎం జగన్ తోనూ ప్రధాని మోదీ భేటీ అయ్యారు. డైరెక్ట్ గా ప్రధాన మంత్రే.. సీఎం జగన్ తో మాట్లాడినప్పుడు.. రాష్ట్రానికి కావాల్సిన వ్యాక్సిన్లు, ఆక్సీజన్ సిలిండర్ల సరఫరా గురించి అడగొద్దా? అసలు.. సీఎం జగన్.. మోదీతో ఏం మాట్లాడారో ఏమో… అంటూ సీఎం జగన్ పై ఆయన ఫైర్ అయ్యారు.

Advertisement

దొంగ పత్రిక సాక్షిలో మాత్రం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి లేఖ రాసినట్టు ప్రచురించారు

ఇదిలా ఉంటే… సాక్షి పత్రికలో కేంద్ర ప్రభుత్వం… రాష్ట్రానికి లేఖ రాసిందని చెబుతూ ఇటీవల ప్రచురించారు. దానిపై పట్టాభిరామ్ మండిపడ్డారు. అది దొంగ పత్రిక.. దాంట్లో ప్రచురించిన లేఖను పరిశీలిస్తే… రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా వ్యాక్సిన్ల కొనుగోలు కోసం కేంద్రాన్ని అనుమతి కోరినట్టుగా లేదు. కేంద్రం కూడా అనుమతి ఇస్తున్నట్టుగా ఎక్కడా లేదు. మరి.. ప్రభుత్వంలో పనిచేస్తే ఐఏఎస్ లకు, మంత్రులకు, సాక్షి పత్రిక యాజమాన్యానికి ఇంగ్లీష్ రాదా? మాట్లాడితే ఇంగ్లీష్ మీడియం అంటారు కదా.. ఇంగ్లీష్ లో ఉన్న ఆ లేఖ సారాంశం ఏంటో తెలుసుకోకుండా.. ఏది పడితే అది అచ్చేస్తారా? రాష్ట్రాలకు, ప్రైవేటు ఆసుపత్రులకే వ్యాక్సిన్లను కొనుగోలు చేసేందుకు.. పర్మిషన్ ఇస్తున్నామని.. ఆ లేఖలో కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపితే… వీళ్లు మాత్రం తమకు నచ్చినట్టు ప్రచురించుకున్నారు. వ్యాక్సిన్ల కొనుగోలుకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్లు పెట్టలేకపోయింది. అందుకే… కేంద్రమే స్పందించి.. రాష్ట్రానికి లేఖ రాసింది. తన బాధ్యతను గుర్తు చుసింది. డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వాలే.. వ్యాక్సిన్ తయారీ కంపెనీల నుంచి వ్యాక్సిన్లను కొనుగోలు చేయొచ్చు.. అని లేఖలో స్పష్టం చేసింది అని ఆయన వెల్లడించారు.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి