
Chandrababu Naidu
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా ఎంతలా విజృంభిస్తుందో అందరికీ తెలుసు. దేశ వ్యాప్తంగానే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా బీభత్సంగా వ్యాప్తి చెందుతోంది. దానికి అడ్డుఅదుపు లేదు. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. దీనిపై టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలోనూ రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయని ఆయన తెలిపారు. టెస్టులు పెంచితే కేసుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు.
chandrababu Reading sakshi news paper
టెస్టుల సంఖ్యను ప్రభుత్వం పెంచాలి. 18 నుంచి 45 ఏళ్ల వయసు ఉన్నవాళ్లకు.. విధిగా కరోనా వ్యాక్సిన్ ఇప్పుడే వేయాల్సిందే. సెప్టెంబర్ లో వేస్తాం అంటే కుదరదు అని కేంద్రం కూడా ఏపీ ప్రభుత్వంపై సీరియస్ అయింది. అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాల్సిందే. కరోనా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఏపీ సీఎం జగన్ తోనూ ప్రధాని మోదీ భేటీ అయ్యారు. డైరెక్ట్ గా ప్రధాన మంత్రే.. సీఎం జగన్ తో మాట్లాడినప్పుడు.. రాష్ట్రానికి కావాల్సిన వ్యాక్సిన్లు, ఆక్సీజన్ సిలిండర్ల సరఫరా గురించి అడగొద్దా? అసలు.. సీఎం జగన్.. మోదీతో ఏం మాట్లాడారో ఏమో… అంటూ సీఎం జగన్ పై ఆయన ఫైర్ అయ్యారు.
ఇదిలా ఉంటే… సాక్షి పత్రికలో కేంద్ర ప్రభుత్వం… రాష్ట్రానికి లేఖ రాసిందని చెబుతూ ఇటీవల ప్రచురించారు. దానిపై పట్టాభిరామ్ మండిపడ్డారు. అది దొంగ పత్రిక.. దాంట్లో ప్రచురించిన లేఖను పరిశీలిస్తే… రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా వ్యాక్సిన్ల కొనుగోలు కోసం కేంద్రాన్ని అనుమతి కోరినట్టుగా లేదు. కేంద్రం కూడా అనుమతి ఇస్తున్నట్టుగా ఎక్కడా లేదు. మరి.. ప్రభుత్వంలో పనిచేస్తే ఐఏఎస్ లకు, మంత్రులకు, సాక్షి పత్రిక యాజమాన్యానికి ఇంగ్లీష్ రాదా? మాట్లాడితే ఇంగ్లీష్ మీడియం అంటారు కదా.. ఇంగ్లీష్ లో ఉన్న ఆ లేఖ సారాంశం ఏంటో తెలుసుకోకుండా.. ఏది పడితే అది అచ్చేస్తారా? రాష్ట్రాలకు, ప్రైవేటు ఆసుపత్రులకే వ్యాక్సిన్లను కొనుగోలు చేసేందుకు.. పర్మిషన్ ఇస్తున్నామని.. ఆ లేఖలో కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపితే… వీళ్లు మాత్రం తమకు నచ్చినట్టు ప్రచురించుకున్నారు. వ్యాక్సిన్ల కొనుగోలుకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్లు పెట్టలేకపోయింది. అందుకే… కేంద్రమే స్పందించి.. రాష్ట్రానికి లేఖ రాసింది. తన బాధ్యతను గుర్తు చుసింది. డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వాలే.. వ్యాక్సిన్ తయారీ కంపెనీల నుంచి వ్యాక్సిన్లను కొనుగోలు చేయొచ్చు.. అని లేఖలో స్పష్టం చేసింది అని ఆయన వెల్లడించారు.
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
This website uses cookies.