
MOdi
ఇటీవల ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పును చెప్పారు. ఎక్కడా సందిగ్ధం లేకుండా తాము ఎవరిని గెలిపించాలని అనుకున్నారో వాళ్లనే గెలిపించి తమ సత్తా చాటారు. అయితే.. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. ఎక్కువ శాతం ప్రాంతీయ పార్టీలకే ప్రజలు తమ మద్దతును ప్రకటించారు. జాతీయ పార్టీలను తమ రాష్ట్రాల్లో నుంచి వెళ్లగొట్టేశారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వం కూడా ఏర్పాటయింది. అస్సాంలో మాత్రం ఇంకా ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. కేరళలో కూడా ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో ఇప్పటికే ప్రభుత్వాలను మెజారిటీ సాధించిన పార్టీలు ఏర్పాటు చేశాయి.
internal issues between bjp leaders bring headache to narendra modi
కేరళలో త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ఈనెల 17 తర్వాత ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. అంత వరకు బాగానే ఉంది. ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటుకు ఎటువంటి సందిగ్ధత లేదు. కానీ.. అస్సాంలోనే అసలు కథ దాగి ఉంది. అస్సాంలో ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించిన అతీగతీ లేదు. వేరే రాష్ట్రాల్లో చతికిలపడినా.. బీజేపీ అస్సాంలో మాత్రం బాగానే నెగ్గుకు వచ్చింది. అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన సంపూర్ణ మెజారిటీ బీజేపీకి ఉంది. బీజేపీ అక్కడ 124 సీట్లు సాధించింది. ఒకరకంగా చెప్పాలంటే అస్సాంలో బీజేపీది క్లీన్ స్వీప్. కేవలం 4 సీట్లు మాత్రమే వేరే పార్టీల అభ్యర్థులు గెలిచారు. క్లీన్ స్వీప్ చేసినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మాత్రం బీజేపీ వెనకాముందు ఆడుతోంది. దానికి కారణం ఏంటి? అంటే అస్సాంలో ఇంటి పోరు ఎక్కువైందట.
మొన్నటి వరకు అస్సాం ముఖ్యమంత్రిగా శర్బానంద సొనొవాల్ ఉన్న విషయం తెలిసిందే. రెండోసారి కూడా శర్బానందకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలా? లేక వేరే నాయకుడికి ఇవ్వాలా? అనేదానిపై బీజేపీ మల్లగుల్లాలు పడుతోంది. రెండోసారి ముఖ్యమంత్రి పీఠంపై శర్బానందను కూర్చోబెట్టడానికి.. అక్కడి బీజేపీ నాయకులు కూడా అంగీకరించడం లేదట. నిజానికి అస్సాంలో బీజేపీలో రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటి శర్బానంద వర్గం, ఇంకోటి హిమంత బిశ్వశర్మ వర్గం. హిమంత భిశ్వశర్మ.. సొనొవాల్ కేబినేట్ లో వైద్యారోగ్య మంత్రగా ఉన్నారు. సో.. ఇప్పుడు మరోసారి శర్బానందను ముఖ్యమంత్రిగా అంటే.. హిమంత బిశ్వశర్మ వర్గీయులు ససేమిరా అంటున్నారు. ఈసారి హిమంతకే ముఖ్యమంత్రి పీఠాన్ని ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారట. దీంతో అస్సాంలో ప్రభుత్వ ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో పాటు.. ఇది ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షాకు పెద్ద తలనొప్పిని తెస్తున్నాయట. అసలే.. ఓవైపు మిగితా 4 రాష్ట్రాల్లో పార్టీ ఓడిపోయింది. ఏదో గెలిచిన ఒక్క రాష్ట్రంలో అయినా తొందరగా ప్రభుత్వం ఏర్పాటు చేద్దామంటే అది కూడా చేయనీయకుండా.. మధ్యలో ఈ వర్గాలు ఏంట్రా బాబు.. అంటూ బీజేపీ హైకమాండ్ తెగ టెన్షన్ పడిపోతోందట. చూద్దాం మరి.. అస్సాంలో ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కుతుందో?
LPG Price Hike 2026 : కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రారంభమైన ఏప్రిల్ 1వ తేదీనే చమురు కంపెనీలు…
Telangana తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఏళ్ల తరబడి అహర్నిశలు శ్రమిస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ Contract…
Israel : ఈ ప్రపంచంలో Israel మనిషి తనను తాను సర్వజ్ఞానిగా భావిస్తాడు. తన దగ్గర ఉన్న సైన్స్ మరియు…
Russia India United States : ఈ మధ్య కాలంలో మధ్య ప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే అమెరికా మరియు…
Raghav chadda : దేశంలో విమాన ప్రయాణం అంటే ఒకప్పుడు ధనికులకు మాత్రమే పరిమితం అనుకునేవారు కానీ ఇప్పుడు కాలం…
April Fools Day : ఏప్రిల్ 1 వచ్చిందంటే చాలు... స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆఫీసులో తోటి ఉద్యోగులు ఒకరినొకరు…
Telangana Chicken Shops Strike : మాంసాహార ప్రియులకు, ముఖ్యంగా చికెన్ అంటే ప్రాణం పెట్టే తెలంగాణ వాసులకు ఇది…
Kodali Nani : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా…
Gold Silver Rate April 1st 2026 : పసిడి ప్రియులకు, సామాన్య కొనుగోలుదారులకు బులియన్ మార్కెట్ నుంచి వరుస…
Karthika Deepam 2 April 1st 2026 Episode : బుల్లితెరపై విశేష ఆదరణ పొందుతున్న 'కార్తీక దీపం 2'…
Hot Water : సాధారణంగా వేసవి కాలం రాగానే అందరూ చల్లటి నీళ్లతో స్నానం చేయడానికి ఇష్టపడతారు. కానీ ఎండలు…
Aloe Vera Juice : వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుండి శరీరాన్ని కాపాడుకోవడానికి కలబంద రసం ఒక అద్భుతమైన…
This website uses cookies.