Categories: NationalNewspolitics

రెండు గా చీలిన బీజేపీ – తలపట్టుకున్న మోదీ ??

Advertisement
Advertisement

ఇటీవల ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పును చెప్పారు. ఎక్కడా సందిగ్ధం లేకుండా తాము ఎవరిని గెలిపించాలని అనుకున్నారో వాళ్లనే గెలిపించి తమ సత్తా చాటారు. అయితే.. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. ఎక్కువ శాతం ప్రాంతీయ పార్టీలకే ప్రజలు తమ మద్దతును ప్రకటించారు. జాతీయ పార్టీలను తమ రాష్ట్రాల్లో నుంచి వెళ్లగొట్టేశారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వం కూడా ఏర్పాటయింది. అస్సాంలో మాత్రం ఇంకా ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. కేరళలో కూడా ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో ఇప్పటికే ప్రభుత్వాలను మెజారిటీ సాధించిన పార్టీలు ఏర్పాటు చేశాయి.

Advertisement

internal issues between bjp leaders bring headache to narendra modi

కేరళలో త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ఈనెల 17 తర్వాత ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. అంత వరకు బాగానే ఉంది. ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటుకు ఎటువంటి సందిగ్ధత లేదు. కానీ.. అస్సాంలోనే అసలు కథ దాగి ఉంది. అస్సాంలో ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించిన అతీగతీ లేదు. వేరే రాష్ట్రాల్లో చతికిలపడినా.. బీజేపీ అస్సాంలో మాత్రం బాగానే నెగ్గుకు వచ్చింది. అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన సంపూర్ణ మెజారిటీ బీజేపీకి ఉంది. బీజేపీ అక్కడ 124 సీట్లు సాధించింది. ఒకరకంగా చెప్పాలంటే అస్సాంలో బీజేపీది క్లీన్ స్వీప్. కేవలం 4 సీట్లు మాత్రమే వేరే పార్టీల అభ్యర్థులు గెలిచారు. క్లీన్ స్వీప్ చేసినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మాత్రం బీజేపీ వెనకాముందు ఆడుతోంది. దానికి కారణం ఏంటి? అంటే అస్సాంలో ఇంటి పోరు ఎక్కువైందట.

Advertisement

సొనొవాల్ వర్సెస్ హిమంత బిశ్వశర్మగా మారింది

మొన్నటి వరకు అస్సాం ముఖ్యమంత్రిగా శర్బానంద సొనొవాల్ ఉన్న విషయం తెలిసిందే. రెండోసారి కూడా శర్బానందకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలా? లేక వేరే నాయకుడికి ఇవ్వాలా? అనేదానిపై బీజేపీ మల్లగుల్లాలు పడుతోంది. రెండోసారి ముఖ్యమంత్రి పీఠంపై శర్బానందను కూర్చోబెట్టడానికి.. అక్కడి బీజేపీ నాయకులు కూడా అంగీకరించడం లేదట. నిజానికి అస్సాంలో బీజేపీలో రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటి శర్బానంద వర్గం, ఇంకోటి హిమంత బిశ్వశర్మ వర్గం. హిమంత భిశ్వశర్మ.. సొనొవాల్ కేబినేట్ లో వైద్యారోగ్య మంత్రగా ఉన్నారు. సో.. ఇప్పుడు మరోసారి శర్బానందను ముఖ్యమంత్రిగా అంటే.. హిమంత బిశ్వశర్మ వర్గీయులు ససేమిరా అంటున్నారు. ఈసారి హిమంతకే ముఖ్యమంత్రి పీఠాన్ని ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారట. దీంతో అస్సాంలో ప్రభుత్వ ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో పాటు.. ఇది ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షాకు పెద్ద తలనొప్పిని తెస్తున్నాయట. అసలే.. ఓవైపు మిగితా 4 రాష్ట్రాల్లో పార్టీ ఓడిపోయింది. ఏదో గెలిచిన ఒక్క రాష్ట్రంలో అయినా తొందరగా ప్రభుత్వం ఏర్పాటు చేద్దామంటే అది కూడా చేయనీయకుండా.. మధ్యలో ఈ వర్గాలు ఏంట్రా బాబు.. అంటూ బీజేపీ హైకమాండ్ తెగ టెన్షన్ పడిపోతోందట. చూద్దాం మరి.. అస్సాంలో ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కుతుందో?

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

9 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

10 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

11 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

12 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

13 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

14 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

15 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

16 hours ago

This website uses cookies.