Chandrababu : ఏ ఒక్కర్నీ వదిలి పెట్టే ప్రసక్తే లేదంటూ వైసీపీ నేతలకు బాబు వార్నింగ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu : ఏ ఒక్కర్నీ వదిలి పెట్టే ప్రసక్తే లేదంటూ వైసీపీ నేతలకు బాబు వార్నింగ్

 Authored By sudheer | The Telugu News | Updated on :5 February 2026,9:00 pm

ప్రధానాంశాలు:

  •  వైసీపీ నేతలు ఏకంగా దేవుడితోనే పెట్టుకున్నారు..శిక్ష తప్పనిసరి !!

  •  వైసీపీ నేతల్లో మళ్లీ టెన్షన్ పెట్టిన చంద్రబాబు

  •  లడ్డు కల్తీ విషయంలో చంద్రబాబు సరికొత్త నిర్ణయం...వైసీపీ నేతల్లో మళ్లీ మొదలైన టెన్షన్

Chandrababu : తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పెను సంచలనంగా మారింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన తాజా వ్యాఖ్యలు, తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి.

Chandrababu ఏ ఒక్కర్నీ వదిలి పెట్టే ప్రసక్తే లేదంటూ వైసీపీ నేతలకు బాబు వార్నింగ్

Chandrababu : ఏ ఒక్కర్నీ వదిలి పెట్టే ప్రసక్తే లేదంటూ వైసీపీ నేతలకు బాబు వార్నింగ్

Chandrababu లడ్డూ కల్తీ వివాదం – చంద్రబాబు హెచ్చరిక

కూటమి ప్రభుత్వం తిరుమల లడ్డూ ప్రసాదం పవిత్రతను దెబ్బతీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కల్తీ ఆరోపణలపై గతంలో వచ్చిన నివేదికల పట్ల ప్రభుత్వం సంతృప్తిగా లేకపోవడంతో, ఈ వ్యవహారంపై లోతైన విచారణ కోసం ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సీబీఐ నివేదిక ఆధారంగా తప్పు చేసిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నిర్ణయంతో గత ప్రభుత్వంలోని కీలక నేతల్లో మళ్లీ ఆందోళన మొదలైంది.

దేవుడితో పెట్టుకుంటే శిక్ష తప్పదు

వైసీపీ నేతలు కేవలం రాజకీయ ప్రత్యర్థులతోనే కాదు, సాక్షాత్తు ఆ ఏడుకొండల వాడితోనే పెట్టుకున్నారని చంద్రబాబు విమర్శించారు. లడ్డూ ప్రసాదంలో రసాయనాలు కలపడం అనేది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా, వెంకటేశ్వర స్వామిపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. “తప్పు చేసిన వారికి భగవంతుడు ఎలాంటి శిక్ష వేస్తాడో మీరే చూస్తారు” అంటూ ఆయన హెచ్చరించారు. మహా పాపానికి ఒడిగట్టిన వారు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ, దేవుడి పవిత్రతను కాపాడటంలో తమ ప్రభుత్వం ఎన్నడూ వెనకడుగు వేయదని భరోసా ఇచ్చారు.

డిక్లరేషన్ వివాదం

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనల సమయంలో ఎదురవుతున్న డిక్లరేషన్ అంశాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. అన్యమతస్తులు శ్రీవారిని దర్శించుకునేటప్పుడు నియమ నిబంధనలు పాటించాల్సిందేనని, జగన్‌కు దేవుడిపై నమ్మకం ఉంటే డిక్లరేషన్ ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. తప్పులు చేసి మళ్లీ తమపైనే ఎదురుదాడి చేయడం ఆశ్చర్యకరమని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో దోషులను తేల్చేందుకు అన్ని నివేదికలను ఏకసభ్య కమిటీ ముందు ఉంచుతామని, చట్టపరమైన చర్యలు అత్యంత వేగంగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

sudheer

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది