Maharashtra : ఏడాది వయసు ఉన్న చిన్నారి.. అరుదైన వ్యాధితో బాధపడింది. వంశపారపర్యంగా వచ్చే అరుదైన వ్యాధి అది. దానికి చికిత్స లేదు. కానీ.. 16 కోట్ల రూపాయల విలువైన ఓ ఇంజెక్షన్ వేస్తే మత్రం ఆ పాపకు నయం అయ్యే చాన్సెస్ ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. దీంతో ఆ పాప తల్లిదండ్రులు ఎందరినో డబ్బులు అడిగారు. ఉన్నది అమ్ముకున్నారు. బంధువులు, స్నేహితులు, డొనేషన్స్.. ఇలా ఎంతో కష్టపడి.. చివరకు 16 కోట్ల రూపాయల విలువైన ఆ ఇంజెక్షన్ ను పాపకు వేయించారు. దీంతో పాప బతుకుతుందిలే.. డబ్బుది ఏముంది.. ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు.. అని అనుకున్నారు పాప తల్లిదండ్రులు. కానీ.. విధి విచిత్రమైనది.
ఎందుకంటే.. ఆ పాపను 16 కోట్ల రూపాయల విలువైన ఇంజెక్షన్ కూడా కాపాడలేకపోయింది. తను ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయింది. ఆ పాప పేరు వేదిక షిండే. తనది మహారాష్ట్రలోని పూణె. తనకు స్పైనల్ మస్క్యూలర్ అట్రోపీ అనే వ్యాధి ఉంది. ఎస్ఎంఏ టైప్ 1 అని అంటారు ఆ వ్యాధిని. ఆ వ్యాధి వస్తే చికిత్స ఏం ఉండదు కానీ.. ఒక్క ఇంజెక్షన్ వేస్తే బతికే చాన్సెస్ ఉంటాయని తెలుసుకొని 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ ను వేదికకు ఇప్పించారు. అయినా కూడా పాప ప్రాణాలు నిలవలేదు.
కేవలం సోషల్ మీడియాలో పాప చికిత్స కోసం ఇంజెక్షన్ కు డొనేషన్స్ కావాలని ప్రచారం చేయడంతో.. కేవలం సోషల్ మీడియా ద్వారానే పాపకు 14 కోట్ల రూపాయల డొనేషన్స్ వచ్చాయి. దీంతో తనకు అత్యంత ఖరీదైన ఇంజెక్షన్ ను పూణెలోని డాక్టర్లు వేశారు. తర్వాత పాప కోలుకుంది. కొన్ని రోజులు బాగానే ఉంది. తనకు చనిపోవడానికి కొన్ని గంటల ముందు కూడా పాపతో తన తల్లిదండ్రులు ఫోటోలు దిగి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఆ తర్వాత తనకు శ్వాస తీసుకోవడంలో సమస్య వచ్చి వెంటనే తను అపస్మారక స్థితికి చేరుకొని చనిపోయినట్టు డాక్టర్లు వెల్లడించారు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.