బిగ్ న్యూస్‌ : మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ ఔట్..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

బిగ్ న్యూస్‌ : మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ ఔట్..?

 Authored By jagadesh | The Telugu News | Updated on :30 April 2021,8:52 pm

Etela Rajender : తెలంగాణలో ప్రస్తుతం ఓవైపు కరోనా కోరలు చాచింది. మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. చాలా రోజుల నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ఈటల రాజేందర్ మధ్య చాలా గ్యాప్ వచ్చిన విషయం తెలిసిందే. అసలు.. తెలంగాణ ప్రజలంతా కరోనా వ్యాప్తి విషయంలో బెంబేలెత్తిపోతున్న సమయంలో సడెన్ గా ఈటల రాజేందర్ విషయం బయటికి వచ్చింది. మంత్రి ఈటల రాజేందర్ ను సీఎం కేసీఆర్ మంత్రి పదవి నుంచి తప్పించనున్నారని తెలుస్తోంది.

cm kcr different strategy to dismiss minister etela rajender from ministry

cm kcr different strategy to dismiss minister etela rajender from ministry

మెదక్ జిల్లాలోని మాసాయిపేట సమీపంలో సుమారు 100 ఎకరాల భూమి విషయంలో ప్రస్తుతం మంత్రి ఈటల రాజేందర్ పై ఆరోపణలు వస్తున్నాయి. మీడియాలో కూడా కథనాలు పుంఖానుపుంఖలుగా వస్తున్నాయి. మంత్రి ఈటల భూమిని కబ్జా చేశారని ఆరోపణలు రావడంతో పాటు… అక్కడి రైతులు సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. దీంతో ఈ విషయం సీరియస్ అయింది. సీఎం కేసీఆర్ కు కొందరు రైతులు ఈ విషయంపై లేఖ రాయడంతో వెంటనే విచారణ ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

Etela Rajender : నాలుగేళ్ల కిందటి భూవ్యవహారం ఇది

నాలుగేళ్ల కింద 100 ఎకరాల భూమి విషయంలో మంత్రి ఈటల రాజేందర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాగే.. ఇటీవల అక్కడ రోడ్డు వేయడానికి రైతులతో మంత్రి రాజీ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. దానిపై కొందరు రైతులు వ్యతిరేకించడం, సీఎం కేసీఆర్ కు లేఖ రాయడం జరిగినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై సీఎం కేసీఆర్ కూడా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. చాలారోజుల నుంచి మంత్రి ఈటల కూడా పార్టీతో అంటిముట్టనట్టుగానే ఉంటున్నారు. ఆ మధ్య సీఎం కేసీఆర్ తో మంత్రి కేటీఆర్.. ఈటలను కలిపించారు. కేసీఆర్, ఈటల ఇద్దరు కలిసి కాసేపు భేటీ అయ్యారు. ఆ తర్వాత చాలాసార్లు మంత్రి ఈటల కూడా రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈనేపథ్యంలో సీఎం కేసీఆర్.. ఈటలను మంత్రి పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 100 ఎకరాల భూకబ్జా విషయంలోనే సీఎం కేసీఆర్.. ఈటలను మంత్రవర్గం నుంచి తప్పిస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారట. మీడియాలో కూడా ఈటలకు సంబంధించిన భూమి వ్యవహారంపై కథనాలు ప్రసారం అవుతున్నాయి. అయితే.. దీనిపై ఈటల రాజేందర్ మాట్లాడనున్నారు. కాసేపట్లో ఈటల మీడియాతో మాట్లాడనున్నట్టు తెలుస్తోంది. అయితే… ఆయన ఏ విషయంపై మాట్లాడుతారో మాత్రం తెలియదు.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది