బిగ్ న్యూస్‌ : మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ ఔట్..?

Authored By Jagadesh Gatla | The Telugu News | Updated on : 30 April 2021, 8:52 pm

Etela Rajender : తెలంగాణలో ప్రస్తుతం ఓవైపు కరోనా కోరలు చాచింది. మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. చాలా రోజుల నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ఈటల రాజేందర్ మధ్య చాలా గ్యాప్ వచ్చిన విషయం తెలిసిందే. అసలు.. తెలంగాణ ప్రజలంతా కరోనా వ్యాప్తి విషయంలో బెంబేలెత్తిపోతున్న సమయంలో సడెన్ గా ఈటల రాజేందర్ విషయం బయటికి వచ్చింది. మంత్రి ఈటల రాజేందర్ ను సీఎం కేసీఆర్ మంత్రి పదవి నుంచి తప్పించనున్నారని తెలుస్తోంది.

cm kcr different strategy to dismiss minister etela rajender from ministry

cm kcr different strategy to dismiss minister etela rajender from ministry

మెదక్ జిల్లాలోని మాసాయిపేట సమీపంలో సుమారు 100 ఎకరాల భూమి విషయంలో ప్రస్తుతం మంత్రి ఈటల రాజేందర్ పై ఆరోపణలు వస్తున్నాయి. మీడియాలో కూడా కథనాలు పుంఖానుపుంఖలుగా వస్తున్నాయి. మంత్రి ఈటల భూమిని కబ్జా చేశారని ఆరోపణలు రావడంతో పాటు… అక్కడి రైతులు సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. దీంతో ఈ విషయం సీరియస్ అయింది. సీఎం కేసీఆర్ కు కొందరు రైతులు ఈ విషయంపై లేఖ రాయడంతో వెంటనే విచారణ ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

Etela Rajender : నాలుగేళ్ల కిందటి భూవ్యవహారం ఇది

నాలుగేళ్ల కింద 100 ఎకరాల భూమి విషయంలో మంత్రి ఈటల రాజేందర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాగే.. ఇటీవల అక్కడ రోడ్డు వేయడానికి రైతులతో మంత్రి రాజీ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. దానిపై కొందరు రైతులు వ్యతిరేకించడం, సీఎం కేసీఆర్ కు లేఖ రాయడం జరిగినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై సీఎం కేసీఆర్ కూడా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. చాలారోజుల నుంచి మంత్రి ఈటల కూడా పార్టీతో అంటిముట్టనట్టుగానే ఉంటున్నారు. ఆ మధ్య సీఎం కేసీఆర్ తో మంత్రి కేటీఆర్.. ఈటలను కలిపించారు. కేసీఆర్, ఈటల ఇద్దరు కలిసి కాసేపు భేటీ అయ్యారు. ఆ తర్వాత చాలాసార్లు మంత్రి ఈటల కూడా రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈనేపథ్యంలో సీఎం కేసీఆర్.. ఈటలను మంత్రి పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 100 ఎకరాల భూకబ్జా విషయంలోనే సీఎం కేసీఆర్.. ఈటలను మంత్రవర్గం నుంచి తప్పిస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారట. మీడియాలో కూడా ఈటలకు సంబంధించిన భూమి వ్యవహారంపై కథనాలు ప్రసారం అవుతున్నాయి. అయితే.. దీనిపై ఈటల రాజేందర్ మాట్లాడనున్నారు. కాసేపట్లో ఈటల మీడియాతో మాట్లాడనున్నట్టు తెలుస్తోంది. అయితే… ఆయన ఏ విషయంపై మాట్లాడుతారో మాత్రం తెలియదు.

Advertisement

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

  1. "NEET Protest Delhi : నీట్ ఆందోళనలో కొత్త ట్విస్ట్.. విద్యార్థుల సమస్యా? రాజకీయ పోరాటమా..? సీజేపీ నాయకులు ఎక్కడ?"

  2. "NCC Army Jobs : అమ్మాయిలకు గుడ్ న్యూస్.. NCC ‘C’ సర్టిఫికెట్‌తో నేరుగా ఆర్మీ ఆఫీసర్ ఉద్యోగాలు"

  3. "Heavy Rain Alert : బిగ్ బ్రేకింగ్‌.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు IMD రెడ్ అలర్ట్..!"

  4. "Talliki Vandanam 2026 : ఏపీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. తల్లికి వందనం నిధులు విడుదల.. మీ డబ్బులు వచ్చాయో ఇలా చెక్ చేసుకోండి"

  5. "Fact Check PM KISAN : పీఎం కిసాన్ లేటెస్ట్ అప్‌డేట్‌.. రూ.6,000 పెంపుపై కేంద్రం ఫుల్ క్లారిటీ..!"

  6. "karthika Deepam 2 Today Episode 2026 July 22 : సుమిత్ర ఒక్క ప్రశ్నతో షాక్‌లో సూరజ్.. అసలు నిజం బయటపడబోతోందా?"

  7. "Gold Rate Today : బంగారం కొనేవారికి షాక్.. ఒక్కరోజులో పెరిగిన పసిడి ధరలు.. జూలై 22 రేట్లు ఇవే!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి