YS Jagan : ప్రస్తుతం ఏపీలో సర్వత్రా చర్చనీయాంశం అవుతున్న ఇష్యూ ఒక్కటే. అదే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రుల హక్కు అని.. దాన్ని తీసుకెళ్లి కార్పొరేట్లకు దారాదత్తం చేయడం ఏంటంటూ ఏపీ మొత్తం.. కేంద్ర ప్రభుత్వం మీద, బీజేపీ పార్టీ మీద గుర్రుగా ఉంది. ఏపీ ప్రజలతో పాటు పార్టీలతో సంబంధం లేకుండా నేతలంతా ఏకమై విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఆందోళన చేస్తున్నారు. కొన్ని పార్టీలు మాత్రం దీనిపై రాజకీయం చేస్తున్నాయి కానీ.. ఎక్కువ శాతం అందరూ విశాఖ స్టీల్ ప్లాంట్ పై కలిసికట్టుగా ఉండి.. తమ హక్కును కాలరాస్తున్నారంటూ బీజేపీపై విరుచుకుపడుతున్నారు. ప్రధాని మోదీని కూడా తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.
అయితే.. ఈ నేపథ్యంలో.. ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. దీంతో ఏపీలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఎందుకంటే.. ఓవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ లొల్లి ఏపీలో నడుస్తున్న సమయంలో సీఎం జగన్.. రేపు అంటే బుధవారం ఉదయం ఢిల్లీ వెళ్తున్నారు.. అంటూ వార్తలు వస్తున్నాయి.
ఢిల్లీలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో ఆయన భేటీ కానున్నారట. ఇప్పటికే అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం సీఎం జగన్.. చాలారోజులు వెయిట్ చేశారని.. బుధవారం ఆయన్ను కలిసేందుకు జగన్ కు అపాయింట్ మెంట్ దొరికిందని తెలుస్తోంది.
అయితే.. అసలు జగన్ ఢిల్లీకి ఈ సమయంలో ఎందుకు వెళ్తున్నారు.. అనేదానిపై సర్వత్రా ఆందోళన నెలకొన్నది. ఏపీలో నెలకొన్న కొన్ని సమస్యలతో పాటు.. ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచించాలని సీఎం జగన్.. అమిత్ షాను కోరుతారని తెలుస్తోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం కేంద్రం పరిధిలోనిదని.. దానిపై ఎవ్వరూ మాట్లాడొద్దని.. ఇప్పటికే అమిత్ షా స్పష్టం చేసిన నేపథ్యంలో జగన్.. దీని గురించి అమిత్ షా వద్ద ప్రస్తావిస్తారా? లేక రాష్ట్రంలో నెలకొన్న వేరే సమస్యల గురించి చర్చిస్తారా? అనే విషయంపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.