congress high command focus on gv harsha kumar
congress ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ మొత్తం కూడా వైసిపి ఖాతాలో పడిపోయేలా చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. దాంతో పాటు రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా చేసి ఏపి వాసులకు తీరని ద్రోహం కాంగ్రెస్ చేసిందనే మాట చరిత్రలో నిలిచిపోయింది. అయితే congress కాంగ్రెస్ చేసిన గాయం బిజెపి చెరిపే పని చేసిందా అంటే గత ఏడేళ్ళు గా అదీ జరగలేదు. ఈ నేపథ్యంలో రెండు జాతీయ పార్టీలకు ఇక్కడ స్కోప్ లేకుండా పోయింది. అయితే గతకొంతకాలం క్రితం బిజెపి దూకుడుగా వెళ్ళే సోము వీర్రాజును అధ్యక్షుడిగా చేసి ఏదైనా అవకాశం చిక్కక పోతుందా అని ఎదురుచూస్తోంది.
congress high command focus on gv harsha kumar
మరోపక్క కాంగ్రెస్ రఘువీరారెడ్డి స్థానంలో దళిత సామాజికవర్గానికి చెందిన సాకే శైలజానాధ్ కి పగ్గాలు అప్పగించి చూసింది. కానీ సాకే శైలజానాథ్ వల్ల కూడా పార్టీకి ఎలాంటి ఊపు కనిపించడం లేదు. తాజాగా కాంగ్రెస్ బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో పార్టీని పటిష్టం చేసే ఆలోచన షురూ చేసింది. దీంతో ఏపికి కూడా నిత్యం ప్రజల్లో ఉండే చురుకైన నాయకత్వం కోసం అన్వేషిస్తున్నట్లు సమాచారం.
ఈ వే లో అమలాపురం మాజీ ఎంపి జివి హర్ష కుమార్ సరైన వ్యక్తిగా కాంగ్రెస్ అధిష్టానానికి చేరినట్లు సమాచారం. విభజన తరువాత పార్టీనుంచి బహిష్కరించబడి ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన హర్షకుమార్ మళ్లీ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి టిడిపి లో చేరి ఆ వెంటనే వెనక్కి వచ్చి కొంత కాలంగా మౌనం ఆశ్రయించారు. అయితే వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెట్టిన కేసులకు సైతం వెరవకుండా వ్యతిరేక పోరాటం చేస్తూనే వచ్చారు. తమ సహచరులు, సన్నిహితుల వత్తిడితో తిరిగి కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న హర్ష కుమార్ ప్రజల్లో పార్టీకి మైలేజ్ లేకపోయినా ఏదో ఒక ఉద్యమాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
congress high command focus on gv harsha kumar
ఏపి లో దళితుల సమస్యలు ఎక్కడ ఉన్నా అక్కడ ప్రత్యక్షమై, ఉద్యమ బాటలోనే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ను తిరిగి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో హర్షకుమార్ కు పీసీసీ పీఠం అప్పగిస్తే, వైసీపీకి ఇబ్బందులు తలెత్తే అవకాశంతో పాటు కోస్తాలో బలమైన ఎస్సీ వర్గాన్ని కాంగ్రెస్ కు దగ్గర చేస్తారని అధిష్టానం యోచిస్తోందని టాక్ వినిపిస్తోంది. ఈ పార్లమెంట్ సమావేశాలు ముగిశాక ఈ అంశంపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మరి దీనిపై ఏపీ కాంగ్రెస్ పెద్దలు ఏమంటారన్నదే చర్చనీయాంశంగా మారింది.
Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…
High Court : గుజరాత్ హైకోర్టులో తాజాగా చోటుచేసుకున్న ఒక సంఘటన తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈనెల 20న హైకోర్టు…
Turmerick Milk : శా కాలం ప్రారంభమైందంటే ఇక వ్యాధులు కూడా ప్రారంభమైతాయి. కాలంలో వచ్చే వ్యాధులన్నీ కూడా అంటూ…
AP : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, కేంద్రం తాజాగా జనగణనతో పాటు కులగణనకు గ్రీన్…
YS Jagan : పల్నాడు జిల్లాలో జరిగిన సింగయ్య మృతి కేసు రాజకీయంగా, న్యాయపరంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. మాజీ…
Mother : సమాజంలో మానవీయత, తల్లిదండ్రుల పట్ల గౌరవం క్రమంగా తగ్గిపోతున్నాయన్న దానికి ఇదొక ఉదాహరణ. ఎంతో కష్టపడి, కన్న…
Samantha Sreeleela : అల్లు అర్జున్ నటించిన పుష్ప ఫ్రాంచైజీలో ఐటెం సాంగ్స్తో మెప్పించిన అందాల ముద్దుగుమ్మలు ఒకే ఫ్రేములో…
Manchu Manoj : మోహన్ బాబు నిర్మాణంలో మంచు విష్ణు Manchu Vishnu నటించిన సినిమా కన్నప్ప kannappa Movie…
This website uses cookies.