congress : బలమైన నేత కోసం వెతుకులాట..

Advertisement
Advertisement

congress ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ మొత్తం కూడా వైసిపి ఖాతాలో పడిపోయేలా చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. దాంతో పాటు రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా చేసి ఏపి వాసులకు తీరని ద్రోహం కాంగ్రెస్ చేసిందనే మాట చరిత్రలో నిలిచిపోయింది. అయితే congress కాంగ్రెస్ చేసిన గాయం బిజెపి చెరిపే పని చేసిందా అంటే గత ఏడేళ్ళు గా అదీ జరగలేదు. ఈ నేపథ్యంలో రెండు జాతీయ పార్టీలకు ఇక్కడ స్కోప్ లేకుండా పోయింది. అయితే గతకొంతకాలం క్రితం బిజెపి దూకుడుగా వెళ్ళే సోము వీర్రాజును అధ్యక్షుడిగా చేసి ఏదైనా అవకాశం చిక్కక పోతుందా అని ఎదురుచూస్తోంది.

Advertisement

congress high command focus on gv harsha kumar

మరోపక్క కాంగ్రెస్ రఘువీరారెడ్డి స్థానంలో దళిత సామాజికవర్గానికి చెందిన సాకే శైలజానాధ్ కి పగ్గాలు అప్పగించి చూసింది. కానీ సాకే శైలజానాథ్ వల్ల కూడా పార్టీకి ఎలాంటి ఊపు కనిపించడం లేదు. తాజాగా కాంగ్రెస్ బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో పార్టీని పటిష్టం చేసే ఆలోచన షురూ చేసింది. దీంతో ఏపికి కూడా నిత్యం ప్రజల్లో ఉండే చురుకైన నాయకత్వం కోసం అన్వేషిస్తున్నట్లు సమాచారం.

Advertisement

హర్ష కుమార్ దిశగా.. congress

ఈ వే లో అమలాపురం మాజీ ఎంపి జివి హర్ష కుమార్ సరైన వ్యక్తిగా కాంగ్రెస్ అధిష్టానానికి చేరినట్లు సమాచారం. విభజన తరువాత పార్టీనుంచి బహిష్కరించబడి ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన హర్షకుమార్ మళ్లీ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి టిడిపి లో చేరి ఆ వెంటనే వెనక్కి వచ్చి కొంత కాలంగా మౌనం ఆశ్రయించారు. అయితే వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెట్టిన కేసులకు సైతం వెరవకుండా వ్యతిరేక పోరాటం చేస్తూనే వచ్చారు. తమ సహచరులు, సన్నిహితుల వత్తిడితో తిరిగి కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న హర్ష కుమార్ ప్రజల్లో పార్టీకి మైలేజ్ లేకపోయినా ఏదో ఒక ఉద్యమాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

congress high command focus on gv harsha kumar

ఏపి లో దళితుల సమస్యలు ఎక్కడ ఉన్నా అక్కడ ప్రత్యక్షమై, ఉద్యమ బాటలోనే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ను తిరిగి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో హర్షకుమార్ కు పీసీసీ పీఠం అప్పగిస్తే, వైసీపీకి ఇబ్బందులు తలెత్తే అవకాశంతో పాటు కోస్తాలో బలమైన ఎస్సీ వర్గాన్ని కాంగ్రెస్ కు దగ్గర చేస్తారని అధిష్టానం యోచిస్తోందని టాక్ వినిపిస్తోంది. ఈ పార్లమెంట్ సమావేశాలు ముగిశాక ఈ అంశంపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మరి దీనిపై ఏపీ కాంగ్రెస్ పెద్దలు ఏమంటారన్నదే చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Recent Posts

Telangana Ration : రేషన్ లబ్ధిదారులకు బ్యాడ్‌న్యూస్‌.. ఇక‌పై వారికి రేష‌న్‌ బియ్యం క‌ట్‌..!

Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…

9 minutes ago

WhatsApp : యూజర్లకు బిగ్‌ షాకింగ్ న్యూస్‌.. ఇక పై డ‌బ్బులు చెల్లిస్తేనే వాట్సాప్

WhatsApp :  ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…

1 hour ago

Recruitment 2026 : డిగ్రీ పాసైన అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌.. జీతం నెల‌కు 45000..WIGHలో ప్రభుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేషన్..!

Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…

2 hours ago

Gold Price: 2050 నాటికి తులం బంగారం ధర తెలిస్తే షాక్ ..బ్రహ్మం గారు చెప్పింది నిజమవుతోందా..?

Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…

3 hours ago

Samantha : ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు , సమంత సంచలన వ్యాఖ్యలు

Samantha  : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…

4 hours ago

MSVPG : వరప్రసాద్ సినిమా బ్లాక్ బస్టర్ అనుకుంటున్న చిరు ఫ్యాన్స్ కి బిగ్ బ్యాడ్ న్యూస్

Mana Shankara Vara Prasad Garu Box Office Collections : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఎప్పుడూ…

5 hours ago

Arava Sreedhar : డిల్లీ ని తాకిన జనసేన ఎమ్మెల్యే రాసలీలల వ్యవహారం .. బీజేపీ ఆగ్ర‌హం..!

Arava Sreedhar : జనసేన పార్టీ నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌పై ఒక…

6 hours ago

Ibomma Ravi : ఐ బొమ్మ రవి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్

Ibomma Ravi : ఐబొమ్మ వెబ్‌సైట్ ద్వారా కోట్లాది రూపాయలు గడించిన రవి, కేవలం ఒక సాధారణ పైరేట్ మాత్రమే…

7 hours ago