Home » News » Congress Leader Konda Murali About Ys Sharmila
News

YS Sharmila : షర్మిల పార్టీలో చేరితే నాకు పదివేల కోట్లు ఇస్తుంది… ఆ నేత షాకింగ్ కామెంట్..?

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: April 16, 2021, 9:02 pm
Advertisement

YS Sharmila : వైఎస్ షర్మిల పార్టీ గురించే ప్రస్తుతం తెలంగాణలో చర్చ. షర్మిల పార్టీ పేరు ఇంకా ప్రకటించకున్నా.. పార్టీ విధివిధానాలను ఇంకా ప్రకటించకున్నా చాలామంది నేతలు షర్మిల పార్టీలో చేరడానికి సిద్ధపడుతున్నారు. జులై 8న షర్మిల తన పార్టీ పేరును ప్రకటించనున్నారు. అప్పుడే వివిధ పార్టీలకు చెందిన కొందరు నేతలు పార్టీలో చేరేందుకు సమాయత్తం అవుతున్నట్టు తెలుస్తోంది. షర్మిల గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఈనేపథ్యంలో వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత కొండా మురళి షర్మిల పార్టీపై వ్యాఖ్యానించారు.

Advertisement

congress leader konda murali about ys sharmila

నేను పార్టీ మారితే షర్మిల పదివేల కోట్లు ఇస్తుంది. నాకు డబ్బు కావాలంటే పార్టీ మారేవాడిని కానీ.. నాకు డబ్బు అవసరం లేదు… నాకు విలువలే ముఖ్యం. షర్మిల పార్టీ నుంచి పిలుపు వచ్చినా… మేం రామని చెప్పా.. నేను వైఎస్ కుటుంబానికి ఎంతో మేలు చేశా కానీ… తర్వాత నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు. జగన్ ను జైలు నుంచి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేశాను. జగన్ జైలు నుంచి వచ్చాక కనీసం పలకరించలేదు నన్ను. అందుకే మేం పార్టీ మారం. మేము కాంగ్రెస్ లోనే కొనసాగుతాం.. పార్టీకి పునర్వైభవం తీసుకొస్తాం… అని కొండా మురళి స్పష్టం చేశారు.

Advertisement

YS Sharmila : మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలతో మురళి భేటి

త్వరలో వరంగల్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… షర్మిల పార్టీ గురించి వెల్లడించారు. ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలి అనే విషయంపై ఆయన ఈ మీటింగ్ లో ప్రసంగించారు. నాకు కరోనా వచ్చి చాలా సమస్యలు అనుభవించా. చావు అంచు వరకు వెళ్లి వచ్చా. అప్పుడు టీఆర్ఎస్ నాయకులు సంబురాలు కూడా చేసుకున్నారు. కానీ… నేను వెనక్కి తగ్గేవాడిని కాదు. మునిసిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేయకుండా ఉండొద్దు. అందరూ నామినేషన్ వేయండి. పార్టీ చెప్పిన వాళ్లందరికీ టికెట్లు ఇస్తాం. టికెట్లు తీసుకొని అమ్ముడు పోకండి. నిజాయితీగా ఉండండి. మీకు మేం ఉంటాం. భరోసా ఇస్తాం… అని కొండా మురళీ స్పష్టం చేశారు.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి