KCR
కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీతో పెట్టుకుంటే దేశంలో ప్రాంతీయ పార్టీల నాయకుల పరిస్థితి ఏంటో ఇప్పటికే పలు సందర్బాల్లో తెలిసి పోయింది. కేంద్రంలో అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా రాష్ట్రాలను తమ అదుపులో పెట్టుకోవాలని చూస్తుంటాయి. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అంతకు మించి అన్నట్లుగా వ్యవహరిస్తుంది అనేది ప్రతి ఒక్కరు అనే మాట. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీ ప్రభుత్వంతో పెట్టుకోవడం వల్లే 2019 ఎన్నికల్లో ఘోర పరాభవం చవి చూడాల్సి వచ్చింది అనేది ఇక్కడ కొందరు చెబుతున్న మాట. అందుకే చంద్రబాబు నాయుడు విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ ఒక్కరు కూడా మోడీతో పెట్టుకునేందుకు ముందుకు రావడం లేదు. రాజకీయ ఉద్దండుడిగా పేరున్న కేసీఆర్ కూడా మోడీ మరియు షా లతో పెట్టుకునేందుకు వెనుకాడుతున్నాడు.
రాష్ట్రంలో బీజేపీతో టీఆర్ఎస్ పార్టీ కయ్యానికి కాలు దువ్వుతోంది. ముఖ్యంగా దుబ్బాక ఎన్నికలు పూర్తి అయినప్పటి నుండి బీజేపీని తొక్కి పెట్టేందుకు కేసీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రతి ఒక్కరు చెబుతున్న మాట. కేసీఆర్ మరియు కేటీఆర్ లు బీజేపీ నాయకులను తీవ్రంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. కాని మోడీ షాల విషయం వచ్చే వరకు మౌనం గా ఉంటున్నారు. కాస్త మెతకగానే కేంద్ర నాయకత్వం గురించి వ్యాఖ్యలు చేస్తున్నారు. మోడీ మరియు అమిత్ షా లను తిడితే ఏం జరుగుతుందో కేసీఆర్ అండ్ టీమ్ కు బాగా తెలుసు. అందుకే అక్కడ నాయకులతో కాస్త స్నేహంగానే ఉంటున్నారు.
KCR
మోడీతో పెట్టుకుంటే తన రాజకీయంను గందరగోళంలోకి నెట్టివేయడం ఖాయం అనే ఉద్దేశ్యంతో కేసీఆర్ ఉన్నాడు. అందుకే కేసీఆర్ ప్రతి విషయంలో కూడా కేంద్రంకు అనుకూలంగా ఉన్నట్లుగానే వ్యవహరిస్తున్నాడు. బయటకు చూస్తే మాత్రం బీజేపీతో ఢీ కొట్టినట్లుగా అనిపిస్తుంది. వారికి రాజ్యసభలో సాయం అవసరం అయినప్పుడు సైలెంట్ గా మద్దతు తెలపడం చేస్తున్నారు. మొత్తానికి కేసీఆర్ రాజకీయ చతురతతో ప్రవర్తిస్తూ తనకు చంద్రబాబు నాయుడు కు పట్టిన గతి పట్టకుండా ప్రయత్నాలు చేస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో కూడా మోడీ ప్రభుత్వం వస్తుందనే నమ్మకంతో కేసీఆర్ వారికి కాస్త స్నేహ హస్తం ఇస్తున్నట్లుగా రాజకీయ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తనకు పదవి కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) స్పష్టం చేశారు.…
ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(Police Recruitment Board)లో 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో…
Laptop | వైఫై పాస్వర్డ్ను మర్చిపోవడం సాధారణంగా జరిగేదే. పాస్వర్డ్ మరిచిపోయినప్పుడు ఎలా తెలుసుకోవాలో ఐడియా లేకపోతే కొంచెం ఇబ్బంది…
SIIMA | 'సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025' (సైమా 2025) ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా రెండు రోజుల…
ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డుగా బీసీసీఐకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఐపీఎల్తో బీసీసీఐ బాగానే దండుకుంది. ప్రస్తుతం బీసీసీఐ ఖాతాలో…
Ponguleti srinivas reddy | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు పథకంపై కీలక అభివృద్ధి చోటుచేసుకుంది.…
Bigg Boss 9 | ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచ్కు సమయం…
Coconut| ఖాళీ కడుపుతో కొబ్బరి తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరిలో…
This website uses cookies.