కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీతో పెట్టుకుంటే దేశంలో ప్రాంతీయ పార్టీల నాయకుల పరిస్థితి ఏంటో ఇప్పటికే పలు సందర్బాల్లో తెలిసి పోయింది. కేంద్రంలో అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా రాష్ట్రాలను తమ అదుపులో పెట్టుకోవాలని చూస్తుంటాయి. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అంతకు మించి అన్నట్లుగా వ్యవహరిస్తుంది అనేది ప్రతి ఒక్కరు అనే మాట. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీ ప్రభుత్వంతో పెట్టుకోవడం వల్లే 2019 ఎన్నికల్లో ఘోర పరాభవం చవి చూడాల్సి వచ్చింది అనేది ఇక్కడ కొందరు చెబుతున్న మాట. అందుకే చంద్రబాబు నాయుడు విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ ఒక్కరు కూడా మోడీతో పెట్టుకునేందుకు ముందుకు రావడం లేదు. రాజకీయ ఉద్దండుడిగా పేరున్న కేసీఆర్ కూడా మోడీ మరియు షా లతో పెట్టుకునేందుకు వెనుకాడుతున్నాడు.
రాష్ట్రంలో బీజేపీతో టీఆర్ఎస్ పార్టీ కయ్యానికి కాలు దువ్వుతోంది. ముఖ్యంగా దుబ్బాక ఎన్నికలు పూర్తి అయినప్పటి నుండి బీజేపీని తొక్కి పెట్టేందుకు కేసీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రతి ఒక్కరు చెబుతున్న మాట. కేసీఆర్ మరియు కేటీఆర్ లు బీజేపీ నాయకులను తీవ్రంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. కాని మోడీ షాల విషయం వచ్చే వరకు మౌనం గా ఉంటున్నారు. కాస్త మెతకగానే కేంద్ర నాయకత్వం గురించి వ్యాఖ్యలు చేస్తున్నారు. మోడీ మరియు అమిత్ షా లను తిడితే ఏం జరుగుతుందో కేసీఆర్ అండ్ టీమ్ కు బాగా తెలుసు. అందుకే అక్కడ నాయకులతో కాస్త స్నేహంగానే ఉంటున్నారు.
మోడీతో పెట్టుకుంటే తన రాజకీయంను గందరగోళంలోకి నెట్టివేయడం ఖాయం అనే ఉద్దేశ్యంతో కేసీఆర్ ఉన్నాడు. అందుకే కేసీఆర్ ప్రతి విషయంలో కూడా కేంద్రంకు అనుకూలంగా ఉన్నట్లుగానే వ్యవహరిస్తున్నాడు. బయటకు చూస్తే మాత్రం బీజేపీతో ఢీ కొట్టినట్లుగా అనిపిస్తుంది. వారికి రాజ్యసభలో సాయం అవసరం అయినప్పుడు సైలెంట్ గా మద్దతు తెలపడం చేస్తున్నారు. మొత్తానికి కేసీఆర్ రాజకీయ చతురతతో ప్రవర్తిస్తూ తనకు చంద్రబాబు నాయుడు కు పట్టిన గతి పట్టకుండా ప్రయత్నాలు చేస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో కూడా మోడీ ప్రభుత్వం వస్తుందనే నమ్మకంతో కేసీఆర్ వారికి కాస్త స్నేహ హస్తం ఇస్తున్నట్లుగా రాజకీయ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.