corona vaccination for kids from 12 to 14 age starts from march 16
Covid Vaccination for Kids : కరోనా థర్డ్ వేవ్ ముగింపు దశలో ఉన్నాం ఇప్పుడు. అయితే.. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా చైనా, ఇటలీలో ఫోర్త్ వేవ్ స్టార్ట్ అయింది. అమెరికాలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో భారత్ కూడా అప్రమత్తమయింది.ఇప్పటికే 18 ఏళ్లు పైబడిన వాళ్లకు కరోనా వ్యాక్సినేషన్ ను అందిస్తున్నారు. దాదాపుగా అందరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నారు. కొందరైతే బూస్టర్ డోస్ కూడా వేసుకున్నారు. 15 నుంచి 17 ఏళ్ల వయసు వాళ్లకు కూడా ఇటీవలే వ్యాక్సినేషన్ ప్రారంభించారు.
ఈ బుధవారం నుంచే అంటే మార్చి 16 నుంచి 12 నుంచి 14 ఏళ్ల వయసు వాళ్లకు కరోనా వ్యాక్సినేషన్ ను కేంద్రం ప్రారంభించనుంది. ఈ వ్యాక్సిన్ ను హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్ ఈ లిమిటెడ్ తయారు చేసింది. ఈ వ్యాక్సిన్ పేరు కార్బెవ్యాక్స్.అలాగే.. మార్చి 16 నుంచి 60 ఏళ్లు దాటిన వాళ్లకు ప్రికాషన్ డోస్ కూడా అందిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 60 ఏళ్లు దాటి రెండు డోసులు వేసుకున్న వాళ్లు ఖచ్చితంగా ప్రికాషన్ డోస్ వేసుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవియా సూచించారు.
corona vaccination for kids from 12 to 14 age starts from march 16
12 నుంచి 14 ఏళ్ల వయసు పిల్లలకు వ్యాక్సిన్ కోసం కోవిన్(www.cowin.gov.in) వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. అక్కడ రిజిస్టర్ / సైన్ ఇన్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ ఇప్పటికే రిజిస్టర్ చేసుకొని ఉంటే.. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి.. ఓటీపీ ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వొచ్చు.లేదంటే కొత్తగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. పిల్లల వయసు ధృవీకరణ కోసం ఆధార్ కార్డు, పాన్ కార్డు లాంటి ఏదైనా ఒక డాక్యుమెంట్ ను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అటువంటివేవీ లేకపోతే స్కూల్ ఐడీ కార్డును అయినా ప్రూఫ్ గా చూపించవచ్చు.రిజిస్టర్ చేసుకున్న తర్వాత తేదీ, సమయం, సెంటర్ సెలెక్ట్ చేసుకొని ఆ సమయానికి పిల్లలను తీసుకెళ్లి వ్యాక్సిన్ వేయించాలి.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.